India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్లో నాటు తుపాకీ కలకలం రేపింది. జీడిమెట్లలో గురువారం సైబరాబాద్ SOT పోలీసులు తనీఖీలు చేపట్టారు. ద్విచక్రవాహనదారుడిని ఆపి సోదాలు చేయగా రివాల్వర్తో పాటు 3 బులెట్లు లభ్యమయ్యాయి. నిందితుడు జీడిమెట్ల అయోధ్యనగర్లో నివాసం ఉంటున్న విశాల్(మధ్యప్రదేశ్ వాసి)గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొన్నారు. ARMS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘ఇది భాగ్యలక్ష్మి అమ్మవారి భాగ్యనగరం’ అంటూ @BJP4Telangana ట్వీట్ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాత్రి HYD MP అభ్యర్థి మాధవీ లతకు మద్దతుగా లాల్దర్వాజా BJP బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన బీజేపీ తెలంగాణ తన అధికారిక సోషల్ మీడియా ‘X’లో ‘Hyderabad ❌ Bhagyanagar ✅’ అని రాసుకొచ్చింది. దీనిపై మీ కామెంట్?
బాలానగర్ వద్ద ఉన్న HAL(హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ.. అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రానిక్, మెకానిక్ విభాగాలలో B.Tech ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు. ఆన్లైన్ ద్వారా ఆసక్తి గలవారు మే 8 వరకు https://www.hal-india.co.inవెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
SHARE IT
అమ్మాయిల పేరుతో మోసగిస్తున్న యువకుడిని CYB సైబర్క్రైమ్ అరెస్టు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన దినేశ్.. బెట్టింగ్, ఆన్లైన్ గేమ్లకు అలవాటుపడ్డాడు. ఈజీ మనీ కోసం డేటింగ్ యాప్లో యువతి ఫొటోలు పెట్టి అకౌంట్ తెరిచాడు. యువకులతో అమ్మాయిలా చాటింగ్ చేస్తూ, నగ్న చిత్రాలు పంపుతూ డబ్బులు వసూలు చేశాడు. మోసపోయిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు దినేశ్ను అరెస్ట్ చేశారు.
HYDలో CM రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్కు ఆకర్షితులై ఇప్పటికే 12 మంది BRS కార్పొరేటర్లు హస్తం కండువా కప్పుకొన్నారు. తాజాగా వనస్థలిపురం BJP కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి రేవంత్ సమక్షంలో పార్టీలోకి చేరారు. MP ఎన్నికల్లో రాజధానిలోని 4 స్థానాల్లో విజయమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న CM చేరికలపైనా దృష్టి పెట్టారు.
HYD నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిలో కడ్తాల్, అమనగల్లు ప్రాంతంలో రోడ్డుకు సైతం రైతుబంధు వస్తుందన్న అంశం పై అధికారులు స్పందించారు. రైతుల భూమి నుంచి జాతీయ రహదారి నిర్మించిన సమయంలో భూములు కట్ కాకపోవడంతో, పలువురికి రైతుబంధు అందుతుంది. అయితే రహదారి సర్వే చేస్తామని, రోడ్డు ఉన్న భూమి రైతుల పేరిట ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు తహసీల్దార్ లలిత తెలిపారు.
HYD నగరం సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రైళ్లలో నీటి కొరత ఏర్పడటం, బెడ్స్ పాడైపోవడం, కొచ్ శుభ్రంగా లేకపోవడం, ఎలుకలు, బొద్దింకలు ఉండటం, మరుగుదొడ్లలో నీరు రాకపోవడం లాంటి సమస్యలు ఏర్పడితే తమకు కాల్ చేసి తెలిపితే తగు చర్యలు తీసుకుంటామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నోట్ విడుదల చేస్తూ నెంబర్లను తెలిపారు. ఫోటోలో ఉన్న నెంబర్లకు కాల్ చేసి తెలపాలన్నారు.
ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, గ్రీన్ హిల్స్, బండ్లగూడ, హయత్ నగర్, ఆటోనగర్, శాంతినగర్ కరెంటు సంబంధిత సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారికి తెలియజేయాలని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారుల నెంబర్లను తెలిపి, అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. స్థానికంగా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికలు మనకు ఫైనల్స్ లాంటివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శేర్లింగంపల్లి తారా నగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ బెడ్ రూం సర్వీసు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు శివానంద్ను MBA విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అతివేగంగా ప్రయివేట్ బస్సును వెనుక నుంచి బైకుతో ఢీ కొట్టడంతో చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.