RangaReddy

News May 1, 2024

యాచారం: క్రీడల్లో రాణిస్తూనే పది ఫలితాల్లో మొదటి స్థానం

image

పది ఫలితాల్లో చింతపట్ల జెడ్పిహెచ్ఎస్‌కు చెందిన బండి కంటి ఉమామహేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిపిఏ 8.7 సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఉమామహేశ్వరి 2 సార్లు రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడల్లో 5 సార్లు జిల్లా స్థాయిలో పాల్గొని పతకాలు సాధించడంలో కీలక పాత్ర వహించిందని హెచ్ఎం శోభాదేవి, పీఈటి సాబేర్ అన్నారు. భవిష్యత్తులో తగిన విధంగా ప్రోత్సహిస్తే చదువుల్లోనూ క్రీడల్లోనూ అద్భుతాలు సాధించవచ్చన్నారు

News May 1, 2024

HYD: రైల్వే పట్టాల పై ఆత్మహత్యలు!

image

HYD పరిధి సికింద్రాబాద్ రైల్వే పరిధిలో ఆత్మహత్యలు, పట్టాలు దాటుతుండగా జరిగిన మరణాల పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. 2021లో-586, 2022-677, 2023-648 ఆత్మహత్యలు జరిగినట్లు తెలిపారు. గత మూడేళ్లలో పలు ప్రాంతాల్లో కలిపి 1815 రైల్వే పట్టాలు దాటుతూ మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆత్మహత్యలు, మరణాలు కలిపి 12కు పైగా నమోదయినట్లు వెల్లడించారు.

News May 1, 2024

RR: ప్రాజెక్టుల పై ప్రజల కోటి ఆశలు!

image

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా 2.8 లక్షలు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరు అందనుంది. ఈ నేపథ్యంలో పాలమూరు రంగారెడ్డికి రూ.2,050 కోట్లు, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.9000.59 కోట్లను మొదట ఖర్చు చేసి, త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. దీంతో ఉమ్మడి RR జిల్లా ప్రజలు ప్రాజెక్టుల పై కోటి ఆశలు పెట్టుకున్నారు.

News April 30, 2024

HYD: ఫ్లై ఓవర్ పై నుంచి పడి కార్మికుడు మృతి

image

ఫ్లై ఓవర్ పైనుంచి పడి ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన అంబర్‌పేటలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కి చెందిన ప్రబీర్ సర్దార్(22) చే నెంబర్ ఫ్లై ఓవర్ పై సెంట్రింగ్ పని చేస్తుండగా కాలుజారి కిందపడ్డాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయం అయింది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News April 30, 2024

షాద్ నగర్: సీఎంని సన్మానించిన రవి శర్మ

image

తెలంగాణలోని నిరుపేద బ్రాహ్మణులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర యువ బ్రాహ్మణ చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో, షాద్ నగర్ అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు రవిశర్మ.. CM రేవంత్ రెడ్డిని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి దేవాలయంలో బ్రాహ్మణ యువతకు ప్రాధాన్యత కల్పించాలని కోరానన్నారు.

News April 30, 2024

వికారాబాద్: జిల్లాలో ‘TODAY TOP NEWS’

image

✏టెన్త్ ఫలితాలు.. వికారాబాద్ జిల్లా లాస్ట్
✏టెన్త్‌లో సత్తా చాటిన విద్యార్థులను సన్మానించిన ఆయా నియోజకవర్గాల నేతలు
✏జాగ్రత్త.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
✏కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మాదిగలు ఓటు వేయవద్దు:మందకృష్ణ
✏పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాలి:కలెక్టర్
✏రేపు తాండూరుకు ఎమ్మెల్యే రాజాసింగ్‌
✏ధారూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
✏గండీడ్: వెన్న చెడ్ మోడల్ స్కూల్లో 99% రిజల్ట్.. అభినందించిన కలెక్టర్

News April 30, 2024

రేపు ఈ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం

image

రేపు కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు కూకట్ పల్లి కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ఆ తర్వాత రాత్రి 8.30 గంటలకు శేరిలింగంపల్లి కార్నర్ మీటింగ్‌కు హాజరవుతారు. పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.

News April 30, 2024

కొడంగల్: టెన్త్ ఫలితాలు.. సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

image

10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కొడంగల్ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. 67 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 97 శాతం ఉత్తీర్ణతతో 65 మంది పాసైనట్లు ప్రిన్సిపల్ బలరాం తెలిపారు. పాఠశాలకు చెందిన హరిచంద్ 10/10, సునీల్ 9.8/10 జీపీఏ సాధించి టాపర్లుగా నిలిచారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది అభినందించారు.

News April 30, 2024

ఓయూ సెలవులు రద్దు: రిజిస్ట్రార్

image

ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించిన వేసవి సెలవులను రద్దు చేస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. హాస్టల్ మరమ్మతులు, విద్యార్థులు తమ తల్లిదండ్రులతో గడపాలనే ఉద్దేశంతో ప్రతియేటా వేసవి సెలవులు ఇస్తామని గుర్తు చేశారు. ఈ వేసవి సెలవులు కూడా ఆ నేపథ్యంలోనే ప్రకటించామని అన్నారు. పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 30, 2024

HYD: ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్!

image

HYD నగరం ORR బయట శాటిలైట్ టౌన్ షిప్స్ నిర్మాణం పై HMDA కసరత్తు చేస్తోంది. ఈ మేరకు రెండు ప్రాజెక్టులకు సంబంధించి దరఖాస్తులను HMDA స్వీకరించింది. RR జిల్లా దామర్లపల్లి-533 ఎకరాలు, నందిగామ పరిధి చేగురులో 100 ఎకరాల్లో షిప్స్ నిర్మాణానికి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను ఎన్నికల అనంతరం వేగవంతం చేయనున్నారు.