RangaReddy

News April 25, 2024

HYD: 4,43,487 మంది ఇంటర్ విద్యార్థులు

image

నేడు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఉదయం 11 గంటలకు వెలువడనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి ప్రథమ సంవత్సరం విద్యార్థులు 2,32,858 మంది, ద్వితీయ సంవత్సరం 2,10,629 మంది పరీక్షలు రాశారు. మొత్తం 4,43,487 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు. #ResultsFirstOnWay2News

News April 25, 2024

HYD: 15 లక్షల మంది ఓటర్లు పెరిగారు!

image

HYD నగరం వేగంగా విస్తరిస్తున్నట్లుగానే ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల నుంచి ప్రస్తుతం జరగనున్న ఎన్నికల వరకు సుమారు 15 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు నమోదైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం గ్రేటర్ HYD, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఓటర్ల సంఖ్య 1.05 కోట్లు దాటింది. మొత్తం తెలంగాణ ఓటర్లలో ఇది 30% ఉంటుందని అధికారుల అంచనా.

News April 25, 2024

HYD: నగర ప్రజలకుముఖ్య గమనిక

image

GHMC పరిధి ప్రజలకు ముఖ్య గమనిక. ప్రతి ఇళ్లు, అపార్ట్‌మెంట్ ముందు పైపుతో కడగొద్దు. బకెట్‌తో‌ నీరు తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ఎవరి ఇంటి ముందు నుంచి నీరు వరద మాదిరిగా బయటకి రావొద్దు. ఆ విధంగా వచ్చినా, నీటి వృథా చేసినా GHMC/మున్సిపల్ వారు ఆ ఇంటికి రూ.5వేల జరిమానా వేస్తారు. ఎవరికి తెలియకుండానే ఉదయం ఫొటో తీయడం జరుగుతుందని హెచ్చరించారు. నీటిని ఆదా చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 25, 2024

ఎంటైర్ హైదరాబాద్‌ మాతో ఉంది: KCR

image

ఎంటైర్ హైదరాబాద్‌ మాతో ఉందని మాజీ CM KCR అన్నారు. ఓ ఛానెల్ డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ మోసపూరిత హామీలు నమ్మిన పల్లె ప్రజలు ఆ పార్టీకి ఓటేశారని పేర్కొన్నారు. HYD మేథావులు‌ BRS వైపే ఉన్నారని.. లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ఇప్పటికే సికింద్రాబాద్‌‌లో గెలిచేశామని, ఎందుకంటే అక్కడ నిలబడ్డది టి.పద్మారావు అని భరోసా‌ వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు.

News April 25, 2024

HYD: సినిమా యానిమేషన్ స్టోరీ రైటర్ సూసైడ్

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక సినిమా యానిమేషన్ స్టోరీ రైటర్ దాసరి లలిత సాయి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పీఎస్ పరిధి పంచవటి కాలనీలోని విక్రమ్ హైట్స్‌లో నివాసముంటున్న ప్రశాంత్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అప్పులబాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

News April 24, 2024

HYD: దుండిగల్‌లో మహిళ దారుణ హత్య

image

హైదరాబాద్ శివారు దుండిగల్ PS పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు బండరాయితో కొట్టి హత్య చేశారు. అనంతరం ఈడ్చుకెళ్లి గొయ్యిలో పారేశారు. మృతురాలు సక్కుబాయి (44) అడ్డా కూలీగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు.
ఆమె కుమారుడు శేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 24, 2024

హైదరాబాద్‌లో తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

HYDలో మార్చి నెలలో 6,416 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలో 7,135 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. 10% తగ్గినట్లు రియల్ ఎస్టేట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లాలో 46%, మేడ్చల్ మల్కాజిగిరిలో 40%, హైదరాబాదులో 10%, సంగారెడ్డిలో ఒక శాతం ఉన్నట్లు వెల్లడించింది.

News April 24, 2024

కంటోన్మెంట్ BRS అభ్యర్ధి‌గా నివేదిత నామినేషన్

image

కంటోన్మెంట్ నియోజకవర్గ BRS పార్టీ MLA అభ్యర్థిగా నివేదిత మంగళవారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్య నాయకులతో కలిసి RO మధుకర్ నాయక్‌కు పత్రాలు అందజేశారు. తన తండ్రి చేసిన అభివృధి, BRS ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

News April 24, 2024

HYD: జగద్గిరిగుట్ట వాసి హత్య

image

సంగారెడ్డి జిల్లా కోహిర్‌‌లో HYDకు చెందిన వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. HYD జగద్గిరిగుట్టకు చెందిన అన్వర్ ఆలీని గురుజవాడకు చెందిన మహమ్మద్ కైఫ్, రాజనెల్లికి చెందిన ముస్తకిం కలిసి కత్తితో దాడి చేసి చంపేశారు. ముగ్గురు కలిసి తరచూ దొంగతనాలు చేసేవారు. అయితే సోమవారం రాత్రి మద్యం తాగి గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి అన్వర్‌ను హత్య చేశారని జహీరాబాద్ పట్టణ సీఐ రవి తెలిపారు.

News April 24, 2024

30 మంది అధికారులపై క్రిమినల్ కేసులు: రొనాల్డ్ రాస్

image

HYD జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల విధుల కోసం నియమితులైన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరవడంపై జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ కొరడా ఝులిపించారు. శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మంది సిబ్బందిపై ఆర్పీ యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు.