India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేవెళ్ల BRS అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు.. జ్ఞానేశ్వర్ కుటుంబానికి రూ.228.47 కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు డిపాజిట్లతో పాటు పలు సంస్థల్లో షేర్లు ఉన్నాయి. సొంతంగా వాహనాలు లేకపోగా.. ఆయన భార్యకు 4 కార్లు ఉన్నాయి. వీరి చరాస్తుల విలువ రూ.15.12 కోట్లు ఉండగా.. స్థిరాస్తులు రూ.213.35 కోట్లు ఉన్నాయి. రూ.30 లక్షల అప్పు ఉంది.
HYD నగరంలో కల్తీ లేని పదార్థమే లేదన్నట్టుగా పరిస్థితి మారింది. HYD టాస్క్ఫోర్స్ పోలీసు బృందం చేపట్టిన తనిఖీల్లో హబీబ్నగర్ పరిధిలో పాలలో అమ్మోనియం సల్ఫేట్ రసాయనాన్ని కలిపి చిక్కగా ఉండేలా చేసి విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. చిక్కటి బర్రె పాలు పితికి వెంటనే అందిస్తున్నామని కవర్లలో విక్రయిస్తున్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాలు కొనేటప్పుడు జర జాగ్రత్త..!
బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకొని గర్భవతిని చేసిన యువకుడిపై పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన మణికంఠ (21) ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యాక పెళ్లికి నిరాకరించాడు. బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మణికంఠను అదుపులోకి తీసుకున్నారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం రాత్రి జరిగిన BRS ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. తన తండ్రి, సోదరిని తలుచుకొని నివేదిత కంటతడి పెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. నివేదితను గెలిపించుకోవాలని మల్లారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
HYD నగరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా 30కి పైగా సమ్మర్ స్పెషల్ ట్రైన్లు నడిపిస్తున్నప్పటికీ రద్దీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మరికొన్ని రూట్లకు స్పెషల్ ట్రైన్లు నడిపించనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి ముజఫర్పూర్ వెళ్లడానికి ఏప్రిల్ 25 నుంచి జూన్ 27 వరకు మొత్తం 10 ట్రిప్పులు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. మిగతా ట్రైన్ల షెడ్యూల్ సైతం విడుదల చేశారు.
HYD నగరంలో ఫైర్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మాట్లాడారు. త్వరలో అగ్నిమాపక శాఖకు 18 చిన్న శకటాలు తెస్తామని తెలిపారు. మరోవైపు ఐదు ఫైర్ ఫైటింగ్ రోబోలు రానున్నాయని, వరద బాధితులను రక్షించేందుకు మానవ రహిత రిమోట్ లైఫ్ బాయ్స్ అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. HYD నగరం సహా రాష్ట్రవ్యాప్తంగా నూతన సంస్కరణలకు శ్రీకారం చూడతామన్నారు.
✓సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ: గాల్ బ్లాడర్, క్లోమగ్రంథి, కాలేయం, పేగులు, అన్నవాహిక అవయవాల్లో క్యాన్సర్ ఇతర కణుతులు
✓యురాలజీ
మూత్రకోశం, ప్రొస్టేట్, కిడ్నీ, కిడ్నీ నుంచి వెళ్లే ట్యూబ్ బ్లాకేజ్లు, పెల్విస్, ఆడ్రీనల్ గ్రంథుల్లో క్యాన్సర్ కణుతులు
✓సర్జికల్ అంకాలజీ: గర్భసంచి, అండాశయం, పేగులు ఇతర క్యాన్సర్లు
•పై వాటికి NIMSలో రోబో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో రోబో సహాయంతో ట్రీట్మెంట్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోబో చికిత్సల కోసం రూ.2-6 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, నిమ్స్ ఆసుపత్రిలో 40 శాతం తక్కువకే ఈ సేవలు అందిస్తున్నారు. ఇక ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT
రేపు HYDలో హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. యాత్ర కొనసాగే రూట్ మ్యాప్ను పోలీసులు విడుదల చేశారు. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమై తాడ్బండ్ టెంపుల్ వరకు కొనసాగుతుంది. పుత్లీబౌలి, కోఠి, సుల్తాన్బజార్, కాచిగూడ, నారాయణగూడ, RTC X రోడ్స్, అశోక్నగర్, కవాడిగూడ, బన్సీలాల్పేట, బైబిల్హౌస్, ఉజ్జయిని టెంపుల్, ప్యారడైజ్ మీదుగా తాడ్బండ్కు చేరుకుంటుంది. రేపు 11.30AM నుంచి 8PM వరకు ఈ రూట్లో ఆంక్షలు ఉంటాయి.
శామీర్పేట, మేడ్చల్, కీసర, ఘట్కేసర్, జవహర్ నగర్ ప్రాంతాలలో గంజాయి కేసుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పైన పేర్కొన్న అన్ని ప్రాంతాల్లో కలిపి 2022లో 581 కిలోల గంజాయి పట్టుపడగా.. 2023లో 1,236 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. గంజాయి క్రయవిక్రయాలను తగ్గించడం పై పోలీసులు ఈ ఏడాది స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.