RangaReddy

News April 20, 2024

HYD: కండక్టర్ నుంచి చిల్లర తీసుకోవడం మరిచారా? ఇలా చేయండి!

image

RTC బస్సులో ఒక్కోసారి కండక్టర్ టికెట్ ఇచ్చిన తర్వాత వెనక రాసిన చిల్లర తీసుకోవడం మర్చిపోతుంటారు. అలాంటి సంఘటన RR జిల్లా హయత్ నగర్ పరిధిలో జరిగింది. రూ.500 నోటును కండక్టర్‌కు ఇవ్వగా రూ.60 టికెట్ ఇచ్చి, మిగితా రూ.440 బస్ దిగేటప్పుడు ఇస్తానని టికెట్ వెనుక రాశాడు. అయితే సదరు ప్రయాణికుడు మర్చిపోయి RTC ఉన్నతాధికారులను సంప్రదించగా.. రూ.440 ఫోన్ పే చేశారు. మీకు ఇలా జరిగితే 040-69440000 సంప్రదించండి.

News April 20, 2024

HYD: నగ్నంగా వీడియో కాల్.. రూ.30వేలు వసూలు

image

నగ్నంగా వీడియో కాల్ చేసి నగదు దోచుకున్న ఘటన కందుకూరు PSలో జరిగింది. పోలీసుల ప్రకారం.. కిరాణా షాపు యజమానికి ఈనెల 17న వాట్సాప్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగా యువతి నగ్నంగా మాట్లాడింది. 18న మరోసారి ఓ అజ్ఞాత వ్యక్తి నేను పోలీస్‌నని చెప్పి.. నగ్నంగా ఉన్న మహిళతో నువ్వు మాట్లాడిన వీడియో యూట్యూబ్‌లో పెడతానని బెదిరించడంతో రూ.30వేల నగదు పంపాడు. తర్వాత మరి కొంతమంది బ్లాక్ మెయిల్ చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు.

News April 20, 2024

HYD: పది రోజుల్లో పెళ్లి.. యువతి అదృశ్యం

image

మరో పది రోజుల్లో వివాహం ఉండగా ఓ యువతి అదృశ్యమైన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై శ్రీరాములు ప్రకారం.. రసూల్‌పురాకు చెందిన విఠల్ సింగ్ కుమార్తె గంగాబాయి(25) మెడికోవర్ హాస్పటల్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. మే 1న గంగాబాయికి వివాహం నిశ్చయించారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

News April 20, 2024

నగరంలో పలు చోట్ల వర్షం

image

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్‌సిటీ, కేబీహెచ్బీ, నారాయణగూడ, హిమాయత్నగర్, లంగర్‌హౌజ్, మెహదీపట్నం, గచ్చిబౌలీ, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతోంది. అకాల వర్షంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. కాగా, కొన్ని రోజులుగా ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తాజా వాతావరణం ఉపశమనం కలిగిస్తోంది

News April 20, 2024

షకీల్ కొడుకు రాహిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. అధికారులు సస్పెండ్

image

బోధన్ మాజీ MLA షకీల్ కొడుకు రాహిల్ యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45లో జరిగిన యాక్సిడెంట్ నివేదికపై ఉన్నతాధికారులు స్పందించారు. రూ.లక్షలు వసూలు చేసి షకీల్ కొడుకు బదులుగా మరొకరు డ్రైవింగ్ చేస్తున్నట్లు FIR నమోదు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో పాత బంజారాహిల్స్ ACP సుదర్శన్, CI రాజ్ శేఖర్ రెడ్డి, SI చంద్ర శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ DGP ఉత్తర్వులు జారీ చేశారు.

News April 20, 2024

HYD: డిగ్రీ పరీక్షలో ఫెయిల్.. రివాల్యుయేషన్లో 90% పైగా మార్కులు!

image

HYD నగరంలోని ఓ ప్రముఖ డిగ్రీ కళాశాలలో పది మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం తొలి సెమిస్టర్లో ఒక్కో సబ్జెక్టులో ఫెయిలయ్యారు. రీవాల్యుయేషన్లో వారే తొంభై శాతానికి పైగా మార్కులతో పాసయ్యారు. ఉస్మానియా వర్సిటీ అనుబంధ కళాశాలల్లో కొందరు ఫస్టియర్ విద్యార్థుల అనుభవమిది. రెగ్యులర్ పరీక్షలో ఫెయిలై రీవాల్యుయేషన్లో పాసయ్యారంటే మూల్యాంకనంలోనే లోపాలున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News April 20, 2024

మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ బోణి కొట్టనుందా?

image

మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టనుందా? ఇప్పటివరకు BRS పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేదు. 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ, 2014లో బీజేపీ+టీడీపీ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి, 2019లో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటివరకు ఈ స్థానంలో బీఆర్ఎస్ గెలవలేదు. 2024లో గెలుస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

News April 20, 2024

HYD: ఫోన్ వాడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

సెల్ ఫోన్ అతిగా వాడొద్దన్నందుకు విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బహదూర్పురా ఇన్స్పెక్టర్ ఆర్.రఘునాథ్ వివరాల ప్రకారం.. కిషన్ బాగ్‌కు చెందిన అశుతోష్ జాదవ్(17) ఇంటర్ చదువుతున్నాడు. రోజూ గంటల కొద్దీ ఫోన్లో గడుపుతుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన అతడు.. గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేశారు.

News April 20, 2024

మల్కాజ్గిరి: 897 మంది లైసెన్స్ ఆయుధాల డిపాజిట్

image

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల పై బెదిరింపులకు పాల్పడకుండా ఉండేందుకు లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారికి నోటీసులు జారీ చేసే డిపాజిట్ చేయాలని సూచించినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. దీంతో 897 మంది లైసెన్స్ ఆయుధాల డిపాజిట్ చేసినట్లుగా పేర్కొన్నారు.

News April 20, 2024

HYD: దీర్ఘకాలిక సెలవులు రద్దు: రోనాల్డ్‌ రాస్‌

image

వచ్చేనెల 13న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది కొరత ఏర్పడటంతో దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వారిని వెంటనే ఎన్నికల విధులకు రిపోర్టు
చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక సెలవులతో పాటు విదేశీ ప్రయాణాలకు శాఖల అనుమతులు తీసుకున్న వారు కూడా ఎన్నికల విధుల్లోకి రావాలని ఆదేశించారు.