India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దోస్త్ ద్వారా ఆయా డిగ్రీ కళాశాలల్లో చేరిన విద్యార్థులు అదే కళాశాలలో గ్రూపు మారేందుకు ఇంట్రా కాలేజ్ రెండో విడతను చేపడుతున్నామని, ఈనెల 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కన్వీనర్ ఆచార్య ఆర్.లింబాద్రి తెలిపారు. గ్రూపు మారేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 24న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.
నగరం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. నార్సింగిలో హరే కృష్ణ మూమెంట్ సంస్థ ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పేరుతో భారీ ఆలయాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 23న అనంతశేష స్థాపన ద్వారా ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. హరేకృష్ణ మూమెంట్ ఛైర్మన్, అక్షయపాత్ర ఫౌండేషన్ ఛైర్మన్ మధు పండిట్ దాస్ ప్రభూజీ తదితరులు హాజరుకానున్నారు.
KTR రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పొలిటికల్ కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. ‘రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడితే తీసేస్తాం అంటారా? మీరు తీసేస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండాలని లోపల ప్రతిష్ఠిస్తున్నాం. BRS ఎప్పటికీ గెలవదు. మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే’ అని అన్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భూమ్ రాబోతుందని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. HYD ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ సదస్సు 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు హాజరై మాట్లాడారు. స్థిరాస్తి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 23న కోకాపేటకు వస్తున్నారని హరేరామ హరేకృష్ణ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కోకాపేట హరేరామ హరేకృష్ణ స్థలం ప్రాంగణంలో 430 అడుగుల ఎత్తుతో శ్రీకృష్ణ ఆలయం(హరేకృష్ణ హెరిటేజ్ టవర్) నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేషస్థాపన పూజా కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా పాల్గొంటారని వారు తెలిపారు.
రానున్న 5 రోజులు HYDలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం భారీ వర్షాల ప్రభావంపై రెవెన్యూ, విద్య, వైద్య, అగ్ని, పోలీసు శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పరిస్థితులను బట్టి ఆయా ప్రాంతాల అధికారులు పాఠశాలలకు ముందస్తు సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.
HYD నగరం నుంచి కటక్ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. HYD నుంచి కటక్కు ప్రతి మంగళవారం (ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 17 వరకు) ట్రైన్ ఉంటుంది. కటక్ నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు ప్రతి బుధవారం (ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 18 వరకు) సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
రానున్న వినాయకచవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మహంకాళి ఏసీపీ సర్దార్ సింగ్ అన్నారు. గణేశ్ మండప నిర్వాహకులతో మంగళవారం హర్యానాభవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. తప్పనిసరిగా పోలీసు నిబంధనలు పాటించాలన్నారు. అందుకు వినాయక మండప నిర్వాహకులు తమకు సహకరించాలన్నారు. సీసీ కెమెరాలు మండపంలో ఏర్పాటు చేసుకోవాలని, పోలీసుల అనుమతితోనే మండపాలు పెట్టుకోవాలన్నారు. సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. SHARE IT
SC వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆనందదాయకమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సనత్నగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆలోచనా విధానం అమలయ్యేలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని, వయసులో నేను పెద్దవాడిని అయిన సీఎంకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా అన్నారు.
కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన యడవల్లి వెంకటస్వామిని AICC నియమించడంపై తెలంగాణ విద్యార్థి నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖాస్త్రాలు సంధించారు. వెంకటస్వామిని తొలగించాలని, తెలంగాణ వ్యక్తికే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని డిమండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.