India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బోరబండలో న్యాయవాది సంతోష్ను పోలీసులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని సీపీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 16న బోరబండలో న్యాయవాది నివాసం వద్ద, ఠాణాలో పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారన్నారు. బోరబండ, మధురానగర్ ప్రాంతాల్లో రౌడీల చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించటానికి పోలీసులు చట్టప్రకారమే ప్రవర్తిస్తున్నారన్నారు.
ఓపీ చీటి కోసం రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద లైన్లో గంటలకొద్ది నిలబడతాం. ఉస్మానియా, గాంధీ, ఎంఎన్జే, నిలోఫర్ వంటి ఆసుపత్రుల్లో 2 నిమిషాల్లోనే ఓపీ చీటి పొందే అవకాశం అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ రాజేంద్రనాధ్ అన్నారు. ‘అభా’ యాప్తో క్యూలైన్ కష్టాలు తీరనున్నాయి. ఓపీ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభా యాప్లో వివరాలు నమోదు చేస్తే ఓపీ చీటీ వస్తుంది. దీన్ని డాక్టర్లకు చూపించి సేవలు పొందొచ్చు.
జేఎన్టీయూహెచ్లో ఈ ఏడాది(2024-25) నుంచే బీ-ఫార్మసీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు వర్సిటీ ఫార్మసీ విభాగం హెచ్వోడీ డాక్టర్ ఎస్.శోభారాణి తెలిపారు. ఈ కోర్సులో మొత్తం 60 సీట్లు ఉన్నాయని.. ఇప్పటికే వీటి భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్ అధికారులకు వివరాలు పంపినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఎం-ఫార్మసీలో 4 కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఒక్కో కోర్సులో 15సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) విధానంతో వయోజనులు, గృహిణులు కనీస విద్యార్హతలైన పదో తరగతి, ఇంటర్ సాధించేందుకు ఈ విధానం ఎంతో సహకరిస్తుంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అంతర్జాల కేంద్రాల ద్వారా, మీ సేవా కేంద్రాల ద్వారా ప్రవేశాలను నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబరు 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
HYD నగర శివారులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జులైలో 22.6 లక్షల మంది ప్రయాణించారు. గత ఏడాది కంటే 13% ప్రయాణికుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుందని పేర్కొన్నారు. భారీగా ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో, నూతన వసతులను కల్పించడం పై అధికారులు ఫోకస్ పెట్టారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డిలతో కలిసి కమిషనర్ ఆమ్రపాలి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 25 అర్జీలు రాగా, టెలిఫోన్ ద్వారా 4 అర్జీలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.
డెలివరీ చేసిన కండక్టర్ జి.భారతిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. RTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి మానవత్వం చాటుకున్న వనపర్తి డిపోనకు చెందిన మహిళా కండక్టర్ జి.భారతికి తన అభినందనలు అంటూ కొనియాడారు. సమయస్పూర్తితో వ్యవహారించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. సోమవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.
రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ MLA గడ్డం ప్రసాద్ కుమార్కు మంత్రి సీతక్క సోమవారం రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. మంత్రి సీతక్కతో పాటు నారాయణపేట, సత్తుపల్లి శాసనసభ్యులు చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయిలు తదితరులు రాఖీలు కట్టారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగానగర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సోదరుడిలా అన్నివేళలా తనకు అండగా ఉంటానన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని మహిళలకు అన్నివేళలా రక్షణగా ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.