India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి జూలపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం HYD రవీంద్ర భారతిలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మేలు కలగాలని, ప్రజలందరి కొత్త ఆశయాలు నెరవేరాలన్నారు. సీఎస్ శాంతి కుమారి, షాద్నగర్ MLA వీర్లపల్లి శంకర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
HYDలో ఒవైసీని ఢీకొట్టే సత్తా తనకే ఉందని, కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని కార్యకర్తలు అంటున్నారని ఆ పార్టీ రాష్ట్ర నేత ఫిరోజ్ఖాన్ అన్నారు. తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కార్యకర్తలు నిరుత్సాహపడతారని, కాంగ్రెస్ పరోక్షంగా MIMకు మద్దతిచ్చినట్టేనని పేర్కొన్నారు. బలహీనమైన అభ్యర్థిని నిలబెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఏదేమైనా హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. మీ కామెంట్?
రంజాన్ సమీపిస్తున్న వేళ ఓల్డ్ సిటీ కళకళలాడుతోంది. చార్మినార్, మదీనా, లాడ్బజార్కు సాయంత్రం నుంచే వేలాదిగా జనం తరలివస్తున్నారు. పండగకు మరో రెండ్రోజులే సమయం ఉండడంతో పాషింగ్ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ దుకాణాలు తెరిచి ఉండడంతో చార్మినార్ పరిసరాలు సందడిగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. PIC CRD: Anjum Alam
అమెరికాలో కిడ్నాప్కు గురైన నాచారం వాసి మహమ్మద్ అబ్దుల్ మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. క్లేవ్ ల్యాండ్ పట్టణంలో ఒక సరస్సులో అబ్దుల్ మృతదేహం లభ్యమైందని, అతడి నడుముకి పాస్ పోర్ట్, ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉన్నాయని తెలిపారు. పోలీసులు పరిశీలించి అబ్దుల్ మృతదేహంగా గుర్తించారని వెల్లడించారు. అబ్దుల్ మృతదేహాన్ని HYDకి తీసుకొస్తారా లేదా అక్కడే ఖననం చేసే విషయాన్ని త్వరలో తెలుపుతామన్నారు.
HYDలో BRS లీడర్కు ప్రమాదం తప్పింది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ఖైరతాబాద్లోని ఓ ఆసుపత్రిలో తన మిత్రుడిని పరామర్శించి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో (కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలో) టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి మెట్రో డివైడర్ను ఢీ కొట్టింది. ఎయిర్బెలూన్స్ ఓపెన్ కావడంతో పల్లె రవి, డ్రైవర్ ఖదీర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబర్పేట MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇదంతా హస్తం పార్టీ మైండ్ గేమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. 2 పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించింది కారు గుర్తు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే తాను ఎమ్మెల్యే అయ్యాయని కాలేరు వెల్లడించారు.
HYD నుంచి వరంగల్ NH-163పై వెళ్లే మార్గంలో భువనగిరి వద్ద.. పెంచిన టోల్గేట్ ఛార్జీల పట్టికను అధికారులు ఏర్పాటు చేశారు. కారు, జీపు, LMV వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి రూ.115, 24 గంటల్లో టూ సైడ్ ట్రిప్ రూ.170 ఛార్జి వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాణిజ్య వాహనాలకు వన్ సైడ్ ట్రిప్ రూ.175.. 24 గంటల్లో టూ సైడ్ ట్రిప్ రూ.265గా ఉందని తెలిపారు.
HYD నగరంలోని పలు ప్రయాణ ప్రాంగణాల్లో దుకాణాలు లీజుకు సిద్ధమంటూ ఆర్టీసీ ప్రకటించింది. ఈసీఐఎల్ బస్ స్టేషన్లో 5200 చ.అ.స్థలంలో వసతి, కోచింగ్ సెంటర్, డయాగ్నొస్టిక్ సెంటర్ పెట్టుకోవాలని సూచించింది. ఇలా.. సికింద్రాబాద్ రీజియన్లో మొత్తం 17 దుకాణాలకు, మరో 10 ప్రాంతాల్లో ఐస్క్రీమ్ పార్లర్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. HYD రీజియన్లో 35 దుకాణాల కోసం టెండర్లు పిలిచారు. దరఖాస్తుల స్వీకరణ సైతం పూర్తయింది.
పవిత్ర రంజాన్ మాసానికి పరిమళాలు వెదజల్లే అత్తర్లు మరింత వన్నె తెస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే కొనుగోలుదారులతో హైదరాబాద్ పాతబస్తీలోని దుకాణాలు కళకళలాడుతున్నాయి. గులాబీ రేకులు, మల్లె, మొగలిపూలు, గంధం చెక్కలు మరిగించటం ద్వారా వచ్చే ఆవిరితోనే అత్తర్లను తయారుచేస్తారు. 200లకు పైగా వివిధ రకాల ఫ్లేవర్లు నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.40 నుంచి రూ.600 వరకు దొరుకుతున్నాయి.
HYD మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో నిత్యం దాదాపుగా 1250 నుంచి 1350 మంది రోగులు వస్తుంటారు. అయితే వారిలో రోజు దాదాపు 200 నుంచి 300 మందికి డాక్టర్లు అద్దాలను సిఫార్సు చేస్తున్నారు. దీంతో పేదలు బయటకు వెళ్లి డబ్బు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే అద్దాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.