India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగను జరుపుకుంటారని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని గాంధీభవన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్నగర్ MLA వీర్లపల్లి శంకర్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోదర బంధం విలువ వెలకట్టలేనిదన్నారు.
ప్రజావాణికి వచ్చే సమస్యలను శాఖల వారీగా అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి ప్రజావాణికి వచ్చిన సమస్యలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ‘హైడ్రా’ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం కౌన్సిల్ అధ్యక్షుడు రంగయ్య మీడియాతో మాట్లాడారు. నెల కింద ఏర్పాటైన హైడ్రా అద్భుతాలు చేస్తోందని, పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు.
HYD నగరంలోని రాచకొండ ట్రాఫిక్ మహిళా పోలీసులు వివిధ ప్రాంతాలలో రాఖీ పండుగ సందర్భంగా వాహనదారులకు రాఖీ కట్టారు. రాఖీ రక్షణకు గుర్తింపు అని మహిళా పోలీసులన్నారు. అనంతరం ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. వాహనదారులందరూ సంతోషంగా, క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని కోరుకున్నట్టు తెలిపారు.
HYD గచ్చిబౌలి స్టేడియంలో AP, TG క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి అభినందన వేడుకల్లో పాల్లొన్నారు. తాపేశ్వరం సురుచి బాహుబలి ఖాజాను కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ఆయనకు అందజేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తర్వాత తన ప్రసంగంలో సీఎం ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారదతో ఉస్మానియా, గాంధీ జూడాలు సమావేశమయ్యారు. వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం అందించారు. రాత్రి విధుల్లో ఉండే మహిళా వైద్య సిబ్బందికి, ప్రత్యేక విశ్రాంతి గదులు, టాయిలెట్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జూడాల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
హైదరాబాద్ ఓఆర్ఆర్ అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్)ను కేంద్రం ప్రాధాన్యం ఇవ్వనుంది. కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ కార్యాచరణ-2047లో RRRను అందులో చేర్చారు. వికసిత్ భారత్లో భాగంగా విస్తరించాల్సిన రహదారుల ప్రణాళికను కేంద్రం ఇటీవల రూపొందించింది. అందులో ప్రాంతీయ RRR చేర్చడంతో దీని నిర్మాణ ప్రక్రియ వేగం అందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఇప్పడు కొత్త సమస్యలకు తెర లేపుతుంది. భూసేకరణకు భిన్నమైన పరిస్థితులే ఎంఆర్డీసీఎల్కు ఎదురవుతున్నాయి. మూసీ బఫర్ జోన్గా నదికి ఇరువైపులా 50 మీటర్లు ఖరారు చేసే యోచనలో ఉండగా.. ఇదే అన్ని సమస్యలకు ప్రధాన కారణం కానుంది. 13వేలకు పైగా ప్రాపర్టీలు గుర్తించింది. దాంట్లో ఆలయాలు, వక్ఫ్ ఆస్తులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ఉన్నాయి. వీటిని తొలగించడం క్లిష్ట ప్రక్రయే అనిపిస్తుంది.
తెలంగాణలో పర్యాటకశాఖకు చెందిన ఆస్తులన్నీ నిర్వీర్యమైపోయాయని, వాటి నుంచి ఆదాయాన్ని రాబట్టేందుకు కృషిచేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో మాట్లాడుతూ.. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లోని పర్యాటక రంగం కంటే పర్యాటకుల్ని ఆకర్షించేందుకు తెలంగాణలో ఎక్కువగా అవకాశాలున్నాయని తెలిపారు. ఏ పర్యాటక ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి వేయాలనే కోణంలో అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా ఆన్లైన్లో నకిలీ ఉద్యోగ సంస్థల వలలో చిక్కి మోసపోవద్దని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ‘X’ వేదికగా ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టబద్ధమైన సంస్థలు ఉద్యోగ ఆఫర్ కోసం అభ్యర్థుల నుంచి డబ్బు అడగవని, ఎవరైనా డబ్బులు అడిగితే మోసమని గుర్తించాలన్నారు. ఫిర్యాదుల కోసం 1930కి లేదా డయల్ 100కి కాల్ చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.