India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ నడుస్తోంది. భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్పై మరింత ఉత్కంఠ పెరిగింది. జనాలు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్ల మీద జనసంచారం తగ్గింది. సిటీలోని అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్లలోని LED టీవీల్లో మ్యాచ్ ప్రదర్శించగా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉండడంతో మరింత ఆసక్తిగా నగరవాసులు వీక్షిస్తున్నారు.

ఇటీవల అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన విద్యార్థి గంప ప్రవీణ్ మృతదేహం స్వగ్రామం షాద్నగర్లోని కేశంపేటకు చేరుకుంది. తానా సహకారంతో తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు రాగా కుటుంబసభ్యులు స్వగ్రామానికి తరలించారు. గత మంగళవారం విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ప్రవీణ్పై దుండగులు కాల్పులు జరపగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతుండడంతో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.- నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ద్రవదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.- బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, రుమాలు, తలపాగా ధరించాలి.- రోడ్లపై అమ్మే వేడి పదార్థాలను తినడం తగ్గించాలి.- దోస, పుచ్చ, తాటి ముంజలతో పాటు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.- ఎండలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు తిరగకూడదు.

HYD మెట్రో అరుదైన ఘనత సొంత చేసుకుంది. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి మెట్రోలో గుండెను తరలించారు. డయిలేటెడ్ కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్న 44 ఏళ్ల వ్యక్తికి శనివారం ఎమర్జెన్సీ అవ్వగా వారు మెట్రోనే ఎంచుకున్నారు. వైద్యులు నాగోల్లో మెట్రో ఎక్కి జూబ్లీహిల్స్లో దిగారు. ఇలా గుండెను తరలించడాన్ని గ్రీన్ ఛానల్ అంటారు.

గతవారం రూ.193 ఉన్న స్కిన్లెస్ చికెన్ ధర నేడు రూ.140కి పడిపోయింది. ఫిబ్రవరి చివరివారంలో రూ.152 ఉండగా రంజాన్ ప్రారంభంలో ధరలు పెరిగాయి. ఈ వారం ఏకంగా రూ.50కిపైగా చికెన్ ధర పడిపోయింది. రిటైల్లో నేడు గుడ్ల ట్రే రూ.150గా ఉంది. పలు చోట్ల తెల్లవారు జామునుంచే మటన్, చేపల మార్కెట్ల వద్ద ప్రజలు బారులుతీరారు. మటన్ కిలో రూ.850-1000 వరుకు, చేపల రకాలని బట్టి కిలో రూ.200లకుపైగా విక్రయాలు జరుగుతున్నాయి.

తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10జాతీయ రహదారులను పూర్తి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ.. రూ.6,280 కోట్ల వ్యయంతో 285 కి.మీ నూతన జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. అయితే, ఆ రహదారుల ప్రారంభానికి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తారని పేర్కొన్నారు.

పెళ్లైన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలానగర్లో జరిగింది. బాల్రెడ్డినగర్లో నివాసం ఉంటున్న విజయగౌరి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. గత నెల 6వ తేదీన ఈశ్వరరావుతో విజయగౌరికి వివాహం జరిగింది. మృతురాలి స్వస్థలం ఏపీలోని విజయనగరం జిల్లా. ఇష్టం లేని పెళ్లి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.

బైక్ రైడింగ్ అంటే మగవారాకి మాత్రమే అనుకునే ఈ కాలంలో మేము కూడా దేనికి తీసిపోమని నిరుపిస్తున్నారు HYDకు చెందిన జైభారతి. బుల్లెట్ బైక్ వేసుకొని 7 దేశాలు, లక్ష కి.మీ తిరిగొచ్చారు. ఆర్కిటెక్ట్గా విధులు నిర్వహిస్తూ బైక్ రైడింగ్ చేస్తున్న జైభారతి 2013లో ‘బైకర్నీ విమెన్ గ్రూప్ HYD చాప్టర్’ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ అంతా బైకులపై పలు ప్రాంతాలకు వెళ్లేవారు. ఆమె సహసాన్ని ప్రధాని మోదీతో పాటు KCR అభినందించారు.

రావిర్యాల ఓఆర్ఆర్పై గురువారం రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కారు ట్యాంకర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. అయితే కృష్ణారెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. కాగా, కృష్ణారెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడు అమర్ దీప్కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సీజ్ చేశారు. అమర్ దీప్ కుమార్ ఇదే విమానంలో జనవరి 22న దుబాయ్ పారిపోయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే కేసులో ఫిబ్రవరి 15న ఫాల్కన్ డైరెక్టర్స్ పవన్ కుమార్, కావ్య నల్లూరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.