RangaReddy

News August 19, 2024

మారేడ్‌పల్లి: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

బీఈడీ, ఎంఈడీ కోర్సులకు వివిధ సబ్జెక్టులు గెస్ట్ లెక్చరర్లుగా బోధించడానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గవర్నమెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీ ఇన్ ఎడ్యుకేషన్, మాసబ్ ట్యాంక్ ప్రిన్సిపల్ ఉషారాణి తెలిపారు. విద్యార్హత ఉన్నవారు జిరాక్స్ కాపీలతో ఈనెల 21 వరకు దరఖాస్తులు అందించాలని ఆమె సూచించారు. ఇతర వివరాలకు 9963119534లో సంప్రదించాలన్నారు.

News August 19, 2024

బహదూర్‌పుర: త్వరలో ZOOలోని జంతువుల కోసం యాప్

image

సిటీలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో సందర్శకులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ సరికొత్త మార్పులు చేస్తున్నారు. జూపార్క్, జంతువుల పూర్తి వివరాలను తెలియజేసేలా అధికారులు జూ పీడియా యాప్‌ను తీసుకురాబోతున్నారు. దీని ద్వారా జూపార్కులో ఏయే జంతువు ఏ ప్లేస్‌లో ఉందో సందర్శకులు ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికోసం జంతువులకు చిప్స్ అతికించనున్నారు.

News August 19, 2024

నాంపల్లి: హజ్ యాత్ర దరఖాస్తులకు కౌంటర్లు

image

కేంద్ర ప్రభుత్వం 2025 హజ్ యాత్ర షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఈ నెల 19వ తేదీ నుంచి హజ్ యాత్రకు ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. యాత్రికుల సౌకర్యార్థం నాంపల్లి హజ్‌హౌస్‌లోని రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో సోమవారం నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారిని హజ్ యాత్రకు నేరుగా ఎంపిక చేయనున్నారు.

News August 19, 2024

HYD: KTRతో శ్రీలంక మంత్రి సమావేశం

image

శ్రీలంక మంత్రి వియలేంద్రన్‌తో HYD నగరంలో సమావేశం జరిగినట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గత పది ఏళ్లలో తెలంగాణలో జరిగిన వేగవంతమైన అభివృద్ధిపై మంత్రి చెప్పిన మాటలు తనకు ఎంతో గర్వంగా అనిపించిందని కేటీఆర్ అన్నారు. గత పది ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సంపదను సృష్టించడంతో పాటు, సంక్షేమానికి ఖర్చు చేశామని తెలిపారు.

News August 19, 2024

కామన్‌వెల్త్‌ పోటీలకు HYD నుంచి వైష్ణవి

image

పట్టుదల ముందు పేదరికం బలాదూర్‌ అనిపిస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన యువ పవర్‌ లిఫ్టర్‌ వైష్ణవి. అక్టోబరు 4 నుంచి 14 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే కామన్‌వెల్త్‌ పోటీల్లో రాష్ట్రం నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. అందులో హైదరాబాద్‌ నుంచి వైష్ణవి ఉన్నారు. ఆర్థికస్తోమత లేక గతంలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేదు. శిక్షకుడు కౌశిక్, దాతల సహకారంతో విజేతగా నిలిచి దేశానికి పేరు తెస్తానని చెబుతున్నారు.

News August 19, 2024

HYD: సీఎంకు ఓవైపు రాఖీ.. మరోవైపు నిరసన

image

గురుకుల పోస్టుల భర్తీలో డౌన్‌మెరిట్‌ను అమలు చేయాలని కోరుతూ 1:2 అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటి ఎదుట ఆదివారం శాంతియుత నిరసన చేపట్టారు. సీఎం రేవంతన్నకు 1:2 ఆడపడుచుల రాఖీ పండుగ శుభాకాంక్షలని తెలుపుతూనే, మరోవైపు గురుకుల పోస్టుల భర్తీలో డౌన్‌మెరిట్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నరేందర్‌, శ్రీనివాస్‌, సునీత, మహేశ్‌, రేణుక, సాయికుమార్‌ పాల్గొన్నారు.

News August 19, 2024

మహిళలపై దాడులను అడ్డుకోవాలి: డీజీ శిఖాగోయెల్‌

image

సురక్షిత సమాజం కోసం రాష్ట్ర ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు తెలుపాలని, మహిళల రక్షణలో బాధ్యులు కావాలని వింగ్‌ డీజీ శిఖాగోయెల్‌ ఎక్స్‌ వేదికగా కోరారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలపై స్వీయ అవగాహన అవసరమని తెలిపారు. మహిళలకు రక్షణ కల్పించే విషయాల గురించి తెలుసుకోవాలని సూచించారు. గృహహింస, లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

News August 19, 2024

HYD: ఇందిర మహిళా శక్తికి GHMC శ్రీకారం

image

ఇందిర మహిళా శక్తి కార్యక్రమానికి GHMC శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలోని మహిళలతో మార్చి 31, 2025లోపు 7 వేల సంస్థలను ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. ఆధునిక మార్కెట్‌కు తగ్గట్టు లాభాలను ఆర్జించే వ్యాపారాలతో అధికారులు జాబితా రూపొందించారు. స్వయం సహాయక బృందాల మహిళలను కోటీశ్వరులను చేయడమే ఈ పథక ముఖ్యోద్దేశం. ఆ మేరకు ప్రభుత్వం ఇచ్చిన ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని అధికారులు చెప్పారు.

News August 19, 2024

HYD: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ

image

సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో అర్హులకు శిక్షణ ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 30లోపు www.nacsindia.org సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 19, 2024

HYD: GREAT తాను మరణించి.. ముగ్గురికి వెలుగు

image

తాను మరణిస్తూ ముగ్గురు జీవితాల్లో ఓ గృహిణి వెలుగులు నింపారు. ఎల్బీనగర్ శాతవాహన నగర్ కాలనీకి చెందిన కాంతబెన్ పటేల్ 16న కళ్లు తిరిగి ఆకస్మాత్తుగా పడిపోయింది. కుటుంబ సభ్యులు ఎల్బీనగర్‌లో ఓ ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న జీవన్ దాన్ ప్రతినిధులు ఆమె భర్త, కుమారులకు అవయవదానంపై అవగాహన కల్పించి కిడ్నీలు, లివర్‌ను ముగ్గిరికి ట్రాన్స్‌ప్లెంట్ చేశారు.