India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న HYD నగరంలోని హైటెక్ సిటీలోని ఓ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలను జరపనున్నారు. కాగా.. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్, ఇండస్ట్రీస్ అసోసియేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం పలికారు.
HYDలోని ఖైరతాబాద్ సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) డైరెక్టర్ జనరల్ బాధ్యతలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం స్టాఫ్ కాలేజీ డైరెక్టర్ బాధ్యతల్లో నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు.
బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాలు.. సైదాబాద్ డివిజన్లోని ఓ బస్తీకి చెందిన వ్యక్తి (58) కేంద్ర ప్రభుత్వ సంస్థలో కింది స్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇంటి పక్కన ఉండే ఏడో తరగతి చదువుతున్న బాలికకు చాక్లెట్ల ఆశ చూపి ఇంట్లోకి పిలిచాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈనెల 11న ఘటన జరగగా.. బాలిక కుటుంబసభ్యులు 13న ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.
హబ్సిగూడలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన బాలికతో పాటు గాయపడిన ఆటోడ్రైవర్ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బాబు డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నో ఎంట్రీ సమయంలో భారీ వాహనాలు నగరంలోకి అనుమతించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
✓HYDలో జోరుగా గణపతుల విక్రయాలు
✓నాచారం:వెజ్ బిర్యానీలో బొద్దింక
✓HYD: అనేక చోట్ల ట్రైనీ డాక్టర్ హత్యపై నిరసనలు
✓మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కన అగ్నిప్రమాదం
✓ఉప్పల్ శిల్పారామంలో ఘనంగా జరిగిన రక్షాబంధన్
✓గోల్కొండ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
✓డ్రగ్స్ పై ఫిర్యాదుకు 8712671111 నంబర్ గుర్తుంచుకోండి:DGP
✓చందానగర్, కూకట్పల్లిలో స్పా సెంటర్లో వ్యభిచారం
✓గండిపేట, మణికొండలో ఆక్రమణల కూల్చివేత
హైదరాబాద్ శివారు పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం తుఫాన్ వాహనాన్ని మరో కారు ఢీ కొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మరణించారు. 10 మందికి పైగా తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం దీక్షిత (13) మృతి చెందింది. మరో ఇద్దరు (అర్చన, కీర్తి) పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరిట సమీకృత క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల్లో క్రీడలకు ఆసక్తి పెంపొందించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ దోహదపడుతుంది. ఇందులో భాగంగా క్రీడలకు సంబంధించిన ఆధునిక మౌలిక వసతులతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రస్తుతం హకీంపేట్లో ఉన్న క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.
విద్యాసంస్థల్లో డ్రగ్స్, ర్యాగింగ్ అరికట్టడానికి పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ డాక్టర్ జితేందర్ HYDలో అన్నారు. తెలంగాణలో ర్యాగింగ్ను ఇప్పటికే నిషేధించామని, ర్యాగింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాంటీ నార్కోటెక్ తెలంగాణలో తప్ప దేశంలో మరెక్కడా లేదన్నారు. డ్రగ్స్, ర్యాగింగ్ పై 87126 71111 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని, ఈ నంబర్ సేవ్ చేసుకోవాలన్నారు.
HYDలో భారీ వర్షం కురుస్తోంది. హయత్నగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డినగర్, బాలాపూర్, అల్మాస్గూడ, నాదర్గుల్, మీర్పేట్, బడంగ్పేట్ తదితర ప్రాంతాల్లో సుమారు అర గంట నుంచి భారీ వర్షం కురుస్తోందని స్థానికులు తెలిపారు. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా కామెంట్ చేయండి.
HYD మెట్రో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇబ్బందులకు గురైతే వాటి వివరాలను వాట్సాప్ ద్వారా తెలపాలని అన్నారు. మెట్రోలో ఏసీ సరిగా రావడం లేదని ఓ వ్యక్తి తెలపగా, ప్రస్తుతం మెట్రోలో ఏసీ 22-24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. వాట్సాప్ నంబర్ 7995999533 ద్వారా సమస్యలు తెలపాలని కోరారు. SHARE IT
Sorry, no posts matched your criteria.