RangaReddy

News March 25, 2024

HYD: పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం

image

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు..HYDయూసుఫ్‌గూడ పరిధి కార్మికనగర్ వాసి సాయిఈశ్వర్ కారు డ్రైవర్. ఓ బాలికను పెళ్లిచేసుకుంటానని చెప్పి తన తల్లితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో బాలిక తల్లి తిరస్కరించింది. అయినప్పటికీ బాలిక వెంట పడుతూ నమ్మించి అత్యాచారం చేయగా ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News March 25, 2024

HYD: ఆహార కల్తీలపై ఫిర్యాదు చేయవచ్చు..

image

ఆహార కల్తీలపై ఫిర్యాదులు సులభతరం చేసేందుకు GHMC అధికారులు టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీతో పాటు కల్తీ విషయమై గ్రేటర్ పరిధిలోని వినియోగదారులు 040-21111111 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత రేటింగ్ ఇచ్చే ఆప్షన్ పక్కనే ఫిర్యాదు నంబర్‌తో పాటు ఫీడ్ బ్యాక్ బాక్స్ ఉండేలా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చారు.

News March 25, 2024

HYD: యాక్సిడెంట్.. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దుర్మరణం

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. HYD కుషాయిగూడ ఠాణా ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాలు.. మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన బద్రి శివకోటయ్య(48) మాజీ సైనికోద్యోగి. ఆదివారం ద్విచక్ర వాహనంపై మౌలాలి పరిధి హెచ్‌బీ కాలనీ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది. 

News March 25, 2024

HYD: మల్లారెడ్డి మార్క్ చూయిస్తారా?

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ గెలవదని, అన్నీ BRSయే గెలిచి చూపిస్తామని గతంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి అన్నారు. అన్నట్టుగానే మొత్తం 7 స్థానాల్లో BRSని గెలిపించి చూయించారు. మల్కాజిగిరి గడ్డ BRS అడ్డా అని చెబుతున్న ఆయన.. మరి పార్లమెంట్ ఎన్నికల్లో BRS అభ్యర్థిని గెలిపించి తన మార్క్ చూయిస్తారా లేదా చూడాలి. మీ కామెంట్?

News March 25, 2024

HYD: శ్వేత అంత్యక్రియలు పూర్తి

image

ఇటీవల ఆస్ట్రేలియాలో హత్యకు గురైన హైదరాబాద్ మహిళ శ్వేత అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఆస్ట్రేలియా నుంచి నగరానికి చేరుకున్న శ్వేత మృతదేహాన్ని ఏఎస్‌రావు నగర్ డివిజన్ బృందావన్ కాలనీలోని ఆమె తల్లిదండ్రులను నివాసానికి తరలించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మల్లాపూర్‌లోని వైకుంఠధామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.

News March 25, 2024

HYD: ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: సజ్జనార్

image

డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ మోసగిస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు సూచిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ X వేదికగా పలు సూచనలు చేశారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని ఫోన్ కాల్స్, ఐవీఆర్ కాల్స్ వస్తే స్పందించొద్దని సజ్జనార్ సూచించారు. ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. కాగా HYDలో ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి.

News March 25, 2024

అమీర్‌పేట్‌లో అమ్మాయి కోసం యువకుల గొడవ

image

ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన అమీర్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్‌ వాసులు నితిన్‌, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వచ్చింది. ఇక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్‌ను పిలిపించి దాడి చేశాడు.

News March 25, 2024

HYD: నేడు హోలీ.. హెచ్చరికలు జారీ!

image

హోలీ పండగను సంప్రదాయాలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని HYD, ఉమ్మడి RR జిల్లా పోలీసులు కోరారు. సోమవారం హోలీ సందర్భంగా జిల్లాలోని పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బందోబస్తు, ప్రధాన రహదారుల్లో పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పరిశీలన నిర్వహిస్తున్నామని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా పండగ జరుపుకోవాలని ఆయా జిల్లాల పోలీసులు కోరారు.

News March 25, 2024

HYD: BRS చతికిల పడింది: ఎంపీ

image

అభివృద్ధికి పాటుపడతానని కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. HYD శేరిలింగంపల్లిలో ఇన్‌ఛార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. BRS పార్టీ చతికిల పడిందని అన్నారు. BJPని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.  

News March 25, 2024

HYD: గాంధీలో గర్భిణులకు కొండంత అండగా వైద్యం!

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని MCH భవనంలో పిల్లలకు, గర్భిణులకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల 600 నుంచి 800 వరకు ప్రసవాలు జరుగుతున్నట్లు డాక్టర్ రాజారావు పేర్కొన్నారు. 300 నుంచి 400 వరకు గైనిక్ సమస్యలు ఉన్నవారు ఓపీ తీసుకుంటున్నారని అన్నారు. గాంధీ ఆసుపత్రి ప్రధాన భవనాలకు మాత శిశు సంరక్షణ భవనాలకు అనుసంధానం చేసేలా స్కైవాక్ వంతెన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!