RangaReddy

News March 25, 2024

HYD: అందుకే ప్రణీత్‌ను చంపాడు..!

image

HYD బాలానగర్ PS పరిధిలో నిన్న <<12919309>>యువకుడు ప్రణీత్ తేజ(20)ను<<>> అతడి స్నేహితుడు చంపిన విషయం తెలిసిందే. సీఐ నవీన్ తెలిపిన వివరాలు.. ప్రణీత్, సమీర్(20) చిన్న నాటి స్నేహితులు. వీరిద్దరూ కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ జులాయిగా తిరుగుతూ గంజాయి, మద్యానికి బానిసలయ్యారు. ఈక్రమంలో తన తల్లిని ప్రణీత్ బూతులు తిట్టాడని కోపం పెంచుకున్న సమీర్.. స్థానికంగా పార్కింగ్ చేసిన బస్సులోకి ప్రణీత్‌ను తీసుకెళ్లి దారుణంగా చంపాడు.

News March 25, 2024

HYD: హోలీ పండుగ రోజే విషాదం..!

image

హోలీ పండుగ రోజు HYD శివారులో విషాదం నెలకొంది. చెరువులో మునిగి ఇద్దరు యువకులు చనిపోయారు. మహేశ్వరం మం. నందిపల్లిలో రంగులు చల్లుకున్న అనంతరం యువత పక్కనే ఉన్న పెద్దచెరువు వైపు వెళ్లారు. ఈత కోసం నీటిలోకి దిగిన సంఘం జగన్ (29), కొమ్ము సురేందర్ (30) ప్రమాదవశాత్తు మునిగిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 25, 2024

HYD: ఆ రోజు సెలవు.. జీతం కూడా..!

image

MP ఎన్నికలు, కంటోన్మెంట్ ఉపఎన్నిక సందర్భంగా ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మే 13(సోమవారం)న వేతనంతో కూడిన సెలవును కార్మికశాఖ ప్రకటించిందని మేడ్చల్ జిల్లా అధికారులు గుర్తు చేశారు. సోమవారం నాచారంలో కార్మిక ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, తెలంగాణ కర్మాగారాలు, దుకాణాలు, సముదాయాల చట్టాల కింద సెలవు ఇచ్చారన్నారు. భవిష్యత్తు కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు.

News March 25, 2024

RR: హోలీ రోజు దారుణం.. BRS నేతపై కత్తితో దాడి..!

image

వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. BRS వికారాబాద్ మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డిపై కొంతమంది వ్యక్తులు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో గాయపడిన ఆయణ్ని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్స పొందుతున్న కమలాకర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పరామర్శించారు.

News March 25, 2024

HYD: రైల్వే స్టేషన్ వెళ్తున్నారా..? జర జాగ్రత్త.!

image

✓రైలు బయలుదేరే సమయంలో, స్టేషన్ చేరుకునేటప్పుడు రైళ్లు ఎక్కొద్దు, దిగే ప్రయత్నం చేయొద్దు
✓నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ప్రవేశించొద్దు
✓ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలను వాడాలి
✓ట్రాక్ దగ్గర నడిచే సమయంలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించొద్దు
✓రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో సెల్ఫీ, ఫొటో గ్రఫీ తీసుకోవడంపై నిషేధం ఉంది. •వీటిని పాటించాలని SCR ట్వీట్ చేసింది.

News March 25, 2024

HYD: అగ్రికల్చర్ స్టడీ చేయాలని ఉందా..? మీ కోసమే!

image

అగ్రికల్చర్ స్టడీ చేయాలనుకునే వారికి HYD రాజేంద్రనగర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, PGD ఇన్ అగ్రి వేర్ హౌసింగ్ మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడువు మార్చి 31న ముగుస్తుందని తెలిపారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ www.manage.gov.in చూడండి.

News March 25, 2024

HYDలో పోలీసుల భారీ బందోబస్తు

image

రాష్ట్ర రాజధానిలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా హోలీ పండుగ జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. బ్లాక్‌లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ సందర్భంగా పోలీసులు ప్రతి వీధిలో రెక్కీ నిర్వహిస్తున్నారు.

News March 25, 2024

HYD: పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం

image

బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు..HYDయూసుఫ్‌గూడ పరిధి కార్మికనగర్ వాసి సాయిఈశ్వర్ కారు డ్రైవర్. ఓ బాలికను పెళ్లిచేసుకుంటానని చెప్పి తన తల్లితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో బాలిక తల్లి తిరస్కరించింది. అయినప్పటికీ బాలిక వెంట పడుతూ నమ్మించి అత్యాచారం చేయగా ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News March 25, 2024

HYD: ఆహార కల్తీలపై ఫిర్యాదు చేయవచ్చు..

image

ఆహార కల్తీలపై ఫిర్యాదులు సులభతరం చేసేందుకు GHMC అధికారులు టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీతో పాటు కల్తీ విషయమై గ్రేటర్ పరిధిలోని వినియోగదారులు 040-21111111 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత రేటింగ్ ఇచ్చే ఆప్షన్ పక్కనే ఫిర్యాదు నంబర్‌తో పాటు ఫీడ్ బ్యాక్ బాక్స్ ఉండేలా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చారు.

News March 25, 2024

HYD: యాక్సిడెంట్.. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దుర్మరణం

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. HYD కుషాయిగూడ ఠాణా ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాలు.. మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన బద్రి శివకోటయ్య(48) మాజీ సైనికోద్యోగి. ఆదివారం ద్విచక్ర వాహనంపై మౌలాలి పరిధి హెచ్‌బీ కాలనీ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది.