India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్, నిజామాబాద్కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.
ఈ నెల 25న హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని HYDలోని 3 కమిషనరేట్ల పరిధి పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
SHARE IT
నగరంలో నీటి వనరుల ఆక్రమణలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. బుద్ధభవన్లోని EVDM కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. GHMC పరిధి చెరువుల వద్ద FTC, బఫర్ జోన్ బౌండరీలకు సంబంధించిన మ్యాపులను ప్రదర్శించాలని సూచించారు. చెరువు బఫర్ జోన్లో నిర్మించే భవనాలను గుర్తించి తక్షణమే నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పోలీసులు RAIDS కొనసాగిస్తున్నారు. మధురానగర్ PS పరిధి ఇంజినీర్స్ కాలనీలో నివాసాల మధ్య రమేశ్ గుప్తా అనే వ్యక్తి ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. టాస్క్ఫోర్స్ మెరుపు దాడులు చేశారు. స్పాట్లో సబ్ఆర్గనైజర్ అనిత, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వ్యభిచారకూపంలో మగ్గుతున్న ఇద్దరు మహిళలను రెస్క్యూ చేశారు.
GHMC మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమెతో పాటు మరో 10 మంది కార్పొరేటర్లు కూడా హస్తం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. 2020 ఎన్నికల్లో BRS 56 స్థానాలు గెలుచుకోగా.. అధికారం కోల్పోయిన 100 రోజుల్లోనే 10 మంది పార్టీని వీడారు. మరో 15 మంది కార్పొరేటర్లను ఆకర్షించాలని INC భావిస్తోందట. ఇదిలా ఉంటే ఒక్కొక్కరుగా పార్టీని వీడడం HYD BRSలో అలజడి రేపుతోంది.
HYD, RRలో రాజకీయం రసవత్తరంగా మారింది. మల్కాజిగిరి నుంచి వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల అధికార పార్టీలోకి చేరగా వీరికే అధిష్ఠానం MP టికెట్లు ఇచ్చింది. వీరిలో గెలిచేది ఎవరు.. మీ కామెంట్..?
హైదరాబాద్లో 144 సెక్షన్ విధించినట్లు CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున EC సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇవి నిషేధం:
*లైసెన్స్ ఆయుధాలు తీసుకెళ్లడం
*ఆయుధాలకు కొత్త లైసెన్స్ జారీ చేయడం
ఇప్పటికే వెపన్స్ కలిగి ఉన్నవారు డిపాజిట్ చేయాలని.. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
SHARE IT
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను ఏప్రిల్ రెండో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ గురువారం 72.88 లీటర్ల అక్రమ లిక్కర్, రూ.38,150/- విలువైన ఇతర వస్తువులు జప్తు చేసినట్లు HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. పోలీస్, ఎస్.ఎస్.టీ., ఎఫ్.ఎస్.టీ. బృందాలు క్షేత్ర స్థాయిలో 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. HYDలో ఇప్పటి వరకు మొత్తం రూ.47,18,300 నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఖైరతాబాద్ MLA దానం నాగేందర్కు అధిష్ఠానం టికెట్ ప్రకటించింది. ఇటీవల BRS నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఒక దశలో ఆయనకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం సైతం జరిగింది. ఆయన అనుచరులు ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అధిష్ఠానం మాత్రం టికెట్ను దానం నాగేందర్కు కేటాయించింది.
Sorry, no posts matched your criteria.