RangaReddy

News February 12, 2025

HYD: పిల్లాడిని ఎత్తుకెళ్లారు.. ఇద్దరి అరెస్ట్

image

HYD కాచిగూడలో మానవ అక్రమ రవాణా రాకెట్ గుట్టురట్టు అయ్యింది. 2 నెలల మగ శిశువును కాచిగూడ పోలీసులు వారి నుంచి రక్షించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కాచిగూడ డీమార్ట్‌లో బట్టలు కొనడానికి వెళ్లిన తల్లి, బట్టలు సెలెక్ట్ చేయడానికి బాబును పట్టుకొమ్మని నిందితుడికి ఇచ్చింది. దీంతో నిందితుడు అతడి తల్లి, బాబుతో ట్యాక్సీలో పరారవగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

News February 12, 2025

HYD: 9000113667 ఈ నంబర్‌కు కాల్ చేయండి..!

image

చెరువుల్లో మ‌ట్టి పోస్తున్న‌వారి స‌మాచారాన్ని తెలియ‌జేయాల‌ని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఫోను నంబ‌ర్‌ను 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మ‌ట్టి పోస్తున్న లారీలు, టిప్ప‌ర్లు, ట్రాక్ట‌ర్లు, మ‌ట్టిని స‌ర్దుతున్న జేసీబీల‌ వీడియోల‌ను కూడా పంపించాల‌ని కోరింది. ఇప్ప‌టి వ‌ర‌కు 48 కేసులు కాగా రాత్రీప‌గ‌లు నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకున్నామని తెలిపింది.

News February 12, 2025

17వ తేదీ నుంచి ఓయూ సెల్ట్ తరగతులు

image

ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో ఈ నెల 17వ తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సవిన్ సౌడ తెలిపారు. రెండు నెలల ఈ కోర్సుకు ప్రతిరోజూ ఉదయం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న వారు 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 79899 03001, 98497 52655 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News February 11, 2025

HYD: వేధింపులకు గురిచేస్తున్నారా..ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

image

మహిళలు, యువతులు వేధింపులకు గురి అయితే ధైర్యంగా షీ టీమ్‌ని సంప్రదించాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా మీ ప్రాంత షీ టీమ్‌ అధికారుల నంబర్లు: ఇబ్రహీంపట్నం 8712662600, కుషాయిగూడ 8712662601, ఎల్బీనగర్ 8712662602, మల్కాజ్గిరి 8712662603, వనస్థలిపురం 8712662604, నంబర్లకు వాట్సాప్ ద్వారా నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు.  

News February 11, 2025

HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి

image

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

News February 11, 2025

HYD: కన్నీటి ఘటన.. మృతులు వీరే..!

image

ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.ఘటనలో HYD నాచారం కార్తికేయ నగర్ ప్రాంతానికి చెందిన 1.శశికాంత్(38),2.మల్లారెడ్డి (60), 3.రవి రాంపల్లి (56), 4.రాజు నాచారం ఎర్రకుంట, 5.సంతోష్ (47), 6.ఆనంద్ రెడ్డి ముసారంబాగ్,7.టీవీ ప్రసాద్ నాచారం గోకుల్ నగర్ మృత్యువాత పడ్డారు.కాగా.. ప్రమాద ఘటనలో 8.నవీన్ చారి,9.బాలకృష్ణకు స్వల్ప గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.

News February 11, 2025

షాద్‌నగర్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోలిపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. షాద్‌నగర్ పట్టణానికి చెందిన గౌస్ పాషా (45) తండ్రి షేక్ ఖాసిం భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్టేషన్ మాస్టర్ రాహుల్ కుమార్ ఫిర్యాదుతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 11, 2025

నాంపల్లి: జబల్‌పూర్ ప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి

image

జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డుప్రమాద ఘటనలో ఏడుగురు హైదరాబాద్ వ్యక్తులు మృతిచెందిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి.. మృతుల కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని కోరినట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరికి సరైన చికిత్స అందించాలని సూచించామన్నారు.

News February 11, 2025

ఓయూ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఏటా రెండు దఫాలుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రెండో దఫా మార్చి 31వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు 040-27097177, 040-27098350 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News February 11, 2025

BREAKING: HYD: కూకట్‌పల్లిలో భార్యను చంపిన భర్త

image

HYD కూకట్‌పల్లిలో PS పరిధిలో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక రాజీవ్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న అబ్దుల్ రహీం అనే వ్యక్తి తన భార్య నసీమా బేగంను బండ రాయితో మోది దారుణంగా చంపేశాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇంట్లోనే ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.