RangaReddy

News August 16, 2024

HYD: విద్యుత్ మరమ్మతులకు రూ.25 కోట్లు

image

గ్రేటర్ HYD, RR, MDCL జోన్ ప్రాంతాల్లో 33/11KV ఫీడర్లు, LT విద్యుత్తు లైన్ల అభివృద్ధి మరమ్మతులకు రూ.25 కోట్ల నిధులు విద్యుత్ సంస్థ కేటాయించింది.గ్రేటర్ పరిధిలోని బంజారాహిల్స్, సైబర్ సిటీ, హబ్సిగూడ, HYD సెంట్రల్,HYD సౌత్,మేడ్చల్ రాజేంద్రనగర్, సంగారెడ్డి, సరూర్ నగర్,సికింద్రాబాద్ సర్కిల్ ప్రాంతాల్లో 11,770 పాయింట్లు సర్వే నిర్వహించిన అధికారులు ఒరిగిన విద్యుత్ స్తంభాలు, ఇతర సమస్యలు పరిష్కరిస్తారు.

News August 16, 2024

HYD: ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు..!

image

HYD,RR,MDCL,VKB జిల్లాల పరిధిలో ఉన్న గర్భాశయ క్యాన్సర్ నివారించడం చాలా సులువని మేడ్చల్ వైద్య అధికారులు తెలిపారు. క్యాన్సర్ పరీక్షలు చేయించుకుని, క్యాన్సర్‌కు రెండు అడుగుల దూరంలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా సహా వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ప్రత్యేక పోస్టర్లు ఏర్పాటు చేసే అవగాహన కల్పించారు. పరీక్షల కోసం వాట్సప్ 8411803040, మిస్డ్ కాల్ 1800221951 ఇవ్వాలని సూచించారు.

News August 16, 2024

షాద్‌నగర్ ఘటనపై NHRCలో ఫిర్యాదు

image

షాద్‌నగర్ PSలో సునీతపై థర్డ్ డిగ్రీ వ్యవహారంపై NHRCలో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది సమతా సైనిక్ దళ్ న్యాయ సలహాదారు కార్తీక్ నవయాన్ గురువారం ఫిర్యాదు చేశారు. సునీతపై దాడికి పాల్పడిన డీఐ రాంరెడ్డి, నలుగురు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించాలని, అరెస్ట్ చేసి శిక్షించాలని పిటిషన్‌లో కోరారు.కేసు CBIకి అప్పగించి దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని,బాధితురాలికి పరిహారం, ఉపాధి కల్పించాలని కోరారు.

News August 16, 2024

HYD: డీఐ, నలుగురు కానిస్టేబుళ్లపై FIR నమోదు

image

HYD శివారు షాద్‌నగర్‌లో సునీత అనే మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో పోలీసులపై తొలి కేసు నమోదైంది. సస్పెన్షన్‌‌లో ఉన్న షాద్‌నగర్ డీఐ రాంరెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. బాధితురాలు సునీత ఈనెల 11వ తేదీన ఫిర్యాదు చేయగా ఈమేరకు కేసు నమోదైంది.

News August 16, 2024

BREAKING: HYD: హరీశ్‌రావుపై ఫ్లెక్సీల కలకలం

image

HYDలో హరీశ్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీMLA మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్‌రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామ్ చెయ్.. రుణమాఫీ అయిపోయే..నీ రాజీనామా ఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్‌పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

News August 16, 2024

HYD: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు టెండర్ల ఆహ్వానం

image

గ్రేటర్ HYDలో వివిధ కాలనీల్లో లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సదుపాయాలు కల్పించకపోవడంతో వారు వాటిలో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో వాటిని సమకూర్చేందుకు GHMC సిద్ధమైంది. ప్రస్తుతం శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు టెండర్లు పూర్తి చేసి పరికరాలను సమకూర్చుకొని అమర్చనుంది.

News August 16, 2024

HYD: బీఆర్ఎస్‌లో చేరిన NSUI నాయకులు

image

రంగారెడ్డి జిల్లా NSUI ఉపాధ్యక్షుడు అభిశేఖ్ బీఆర్ఎస్‌లో చేరారు. గురువారం రాజేంద్రనగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల నుంచి పలువురు NSUI నాయకులు అభిశేఖ్ ఆధ్వర్యంలో కారెక్కారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో యువనాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ‘ఇక మార్పు మొదలైంది.. వలసలు పెరుగుతాయి’ అంటూ కార్తీక్‌ రెడ్డి పేర్కొన్నారు.

News August 16, 2024

రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ముఖ్యమంత్రి

image

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ దంపతులతో కలిసి సీఎం అతిథులను మర్యాదపూర్వకంగా పలకరించారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్, శాసనసభ స్పీకర్, పలువురు మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు.

News August 15, 2024

HYD: దేశ విశిష్టతపై అవగాహన కల్పించాలి

image

పిల్లలకు బాల్యం నుంచే దేశ విశిష్టత పట్ల అవగాహన కల్పించాలని రాచకొండ సీపీ ఐపీఎస్‌ సుధీర్ బాబు ఐపీఎస్ సూచించారు. రాచకొండ కమిషనరేట్‌, నేరేడ్‌మెట్‌లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సిబ్బందికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు.

News August 15, 2024

తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగనిరతిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.