India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంక్షేమ పథకాలు రజక వృత్తిదారులకు అందేలా బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, ABDMS ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల బండలయ్య అన్నారు. బ్యాంకులు షరతులు లేని రుణాలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వాలు తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని HYDలో నేతల సమావేశంలో మాట్లాడారు. రజక సంక్షేమం కోసం కాంగ్రెస్ రూ.1,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, పనిముట్ల కోసం ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలివ్వాలని కోరారు.

ఇన్స్టాలో పరిచయమైన మహిళతో యువకుడు వెళ్లి పోయిన ఘటన KPHB PS పరిధిలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. పవన్ అనే యువకుడు ఈనెల 6వ తేదీన ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. 2 రోజుల క్రితం తాను ఫోన్ చేసి అనారోగ్యంగా ఉందని పుణేలో తెలియని ప్రాంతంలో ఉన్నానని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు కాల్ చేయగా మహిళా ఫోన్ ఎత్తి ‘మీ కుమారుడికి కాల్ చేస్తే చంపేస్తా’అని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మాసబ్ట్యాంక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో ఏసీబీ అధికారుల సోదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం ఆనంద్ కుమార్ రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెండ్గా అధికారులకు పట్టుబడ్డారు. ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ అదుపులోకి తీసుకుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానం చేసుకొని నేటికీ 15ఏళ్లు అయ్యింది. 2010లో నేటి రోజున RR జిల్లా నాగారం ప్రాంతానికి చెందిన యాదయ్య ఓ అనాథ. 19 ఏళ్ల వయస్సులో ఓ హోటల్లో పనిచేసుకుంటూ చదువుకునే రోజుల్లో తెలంగాణ కోసం అమరుడయ్యాడని చంచల్గూడ ఎస్పీ శివకుమార్ అన్నారు. తెలంగాణ ఫలాలు అనుభవిస్తున్నవారిలో ఎంత మందికి గుర్తున్నాడో..? మన యాదయ్య. జై తెలంగాణ!జై జై తెలంగాణ..! అంటూ ట్వీట్ చేశారు.

కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ జాతీయ రహదారి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు యూటర్న్ తీసుకుంటున్న కారును లారీ వచ్చి ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ అప్రమత్తత వల్ల కారును ఢీ కొట్టినప్పటికీ పెను ప్రమాదం తప్పింది. కారు మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదకరమైన మలుపు వద్ద తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

తెలంగాణ భవన్లో బుధవారం KCR అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ కీలక నేతలు రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వదిన దశదినకర్మ నేపథ్యంలో హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాల సమాచారం. కాగా.. మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరుకు గల కారణాలు తెలియాల్సింది ఉంది.

రంగారెడ్డి జిల్లాలో భారీగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం అత్యధికంగా చందనవెల్లిలో
38℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మహేశ్వరం, తట్టిఅన్నారం, యాచారం, కందువాడ, మంగల్పల్లిలో 37.9, తోర్రూర్, అబ్దుల్లాపూర్మెట్, ప్రోద్దటూర్, మొయినాబాద్లో 37.8, కొత్తూరు, షాబాద్లో 37.6, కేతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, కాసులాబాద్లో 37.5, నల్లవెల్లి, మామిడిపల్లిలో 37.4, తుర్కయంజాల్ల్లో 37.3℃గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

KPHB PS పరిధిలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పెళ్లి జరిగిన సంవత్సరం నుంచి వరకట్నం కోసం భర్త వేణుగోపాల్ వేధిస్తూ ఉండేవాడని మృతురాలు దీపిక తల్లిదండ్రులు ఆరోపించారు. వీరికి 13 నెలల బాలుడు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీన ఆమె సోదరుడు దీపిక ఇంటికి రాగా ఇంట్లో ఉరివేసుకుని కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ కరెంట్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తున్నట్లు TGSPDCL తెలిపింది. గ్రేటర్ పరిధిలో ఫిబ్రవరి 16న 60.06 మిలియన్ యూనిట్ల కరెంటు వినియోగించగా, అదే 18వ తేదీన డిమాండ్ కాస్త 70 యూనిట్లకు చేరింది. రాబోయే కొద్ది రోజుల్లో కరెంటు డిమాండ్ భారీ స్థాయిలో పెరగనున్న నేపథ్యంలో అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నారు.

HYDలో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా. దామోదర వెల్లడించారు. దీంతో చికెన్ మార్కెట్ ఊపిరిపీల్చుకుంది. KG రూ. 140కి పడిపోయిన ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. KG స్కిన్లెస్ రూ. 186, విత్ స్కిన్ రూ. 164గా ధరలు నిర్ణయించారు. కోళ్ల నుంచి మనుషులకు సోకిన కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.