India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యువకుడి ఆత్మహత్య కేసులో సూరారం పోలీసులు వివరణ ఇచ్చారు. INSTAలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని శ్రీహరి పట్టుబట్టాడు. పేరెంట్స్ మందలించడంతో ఆమె దూరం పెట్టింది. ఈ విషయమై యువకుడి తల్లి బెదిరించగా.. మనస్తాపం చెందిన యువతి భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. <<13843632>>భయంతో శ్రీహరి<<>> పురుగు మందు తాగేసి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నెల 12న ఆస్పత్రి నుంచి పారిపోయి ‘ప్రియురాలి వద్దకు వెళ్తున్నా అంటూ’ ఉరేసుకొన్నాడు.
HYD నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో నిన్నటి వరకు ఉచితంగా వాహనాలను పార్కింగ్ చేసేవారు. నేటి నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. బైక్లు మినిమం 2 గంటల వరకు నిలిపి ఉంచితే రూ.10, 8 గంటల వరకు రూ.25, 12 గంటల వరకు నిలిపితే రూ. 40 చొప్పున చెల్లించాలి. కారు పార్కింగ్ ధరలు వీటికంటే మూడింతలు ఎక్కువగా నిర్ణయించారు. దీనిపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పంద్రాగస్టు నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆంక్షలు విధించారు. జంటనగరాల్లో కీలకమైన సికింద్రాబాద్లోనూ నిఘా పెంచారు. మంగళవారం రాత్రి మార్కెట్ పోలీసులు పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఆధ్వర్యంలో 31 బస్టాప్ తదితర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులను అపి సోదాలు చేశారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
అపార్ట్మెంట్లో ఉండేవారికి GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట కీలక సూచన చేశారు. మంగళవారం అధికారులతో ఆమె టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. చెత్త కోసం డోర్ టూ డోర్ తిరగకుండా ఒక చోట డస్ట్ బిన్లను ఏర్పాటు చేస్తే సేకరణ సులభతరం అవుతుందన్నారు. అపార్ట్మెంట్ అసోసియేషన్ వారిని సంప్రదించి డస్ట్ బిన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కుల వద్ద కూడా ఇలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు.
HYD నగర శివారు కందుకూరు ప్రాంతంలో నెట్ జీరో సిటీ ఏర్పాటు చేయనుంది. పరిశ్రమల నుంచి వెలువడే కర్బన, రసాయన సమ్మేళనాల కాలుష్యంతో ప్రజా జీవనంపై ప్రభావం పడకుండా, జాతీయ కాలుష్య ప్రమాణాలను పాటించి, జీరో కార్బన్ ఎమిషన్ సిటీగా ఏర్పాటు చేయనున్నారు. ఈ సిటీలో 33% పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. పచ్చదనంతో HYD పరిసరాల్లో ఉష్ణోగ్రత కంటే 2-3 డిగ్రీలు సెంటీగ్రేడ్లు తక్కువగా ఉండనున్నాయి.
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (HRRR) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. మంగళవారం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతిష్ఠాత్మక RRR ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకుందని, భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు.
గ్రేటర్ HYD పరిధిలో దాదాపుగా 75 లక్షల వాహనాలు ఉన్నట్లుగా అధికారుల లెక్కల్లో తేలింది. రూ.170 కోట్ల లీటర్ల పెట్రోలు, రూ.150 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే..15 ఏళ్లకు పైబడిన వాహనాలు దాదాపుగా 15 లక్షలకు పైగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వాహనాల వల్ల గాలి కాలుష్యం పెరిగి, ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.
GHMC గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ ప్రాంతంలో జేసీ నగర్, వలావర్ నగర్, కాప్రా ఛత్రపతి శివాజీ గ్రౌండ్, శేర్లింగంపల్లి గోపనపల్లి తండా, మియాపూర్ బస్ డిపో వెనుక, కూకట్పల్లి ఎస్ఆర్ నాయక్ నగర్, అల్వాల్, ఖైరతాబాద్ లంగర్ హౌస్, సికింద్రాబాద్ తిరుమలగిరి, ప్రాంతాల్లో ఫుట్ బాల్ మైదానాల కోసం స్థలాలను అధికారులు గుర్తించారు.
వాహన కొనుగోలులో షోరూమ్లు ఇచ్చిన డిస్కౌంట్కు కూడా పన్ను చెల్లించాల్సిందేనని, పూర్తి ట్యాక్స్ కడితేనే ఆ వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాహన ధర ఆర్టీఏ డేటాబేస్లో ఉంటుందని, డిస్కౌంట్ అనేది పన్ను మినహాయింపునకు కాదని కస్టమర్లు గుర్తించాలని సూచించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం వాహనం ఏ ధరకు కొనుగోలు చేసినా పూర్తి పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నారు.
రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఐఐటీ సీట్ల కోసం శిక్షణ అందిస్తున్న సీనియర్ ఫ్యాకల్టీ, సీనియర్ సబ్జెక్టు అసోసియేట్లు 2 నెలలుగా వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వేతనాలు ఇచ్చేవరకు పాఠాలు బోధించబోమంటూ గౌలిదొడ్డి సీఈవో సహా అన్ని కేంద్రాల్లో సబ్జెక్టు అసోసియేట్లు సోమవారం నుంచి ‘చాక్ డౌన్’ చేపట్టారు. ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.