India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి అలర్ట్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్లో 31, సికింద్రాబాద్ డివిజన్లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT
షాద్నగర్ పట్టణంలో పండ్ల మార్కెట్ లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ మామిడి, సీతాఫలం, జామ తోటలు అత్యధికంగా ఉంటాయి. ఇక్కడ దిగుబడులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. కానీ పండ్ల మార్కెట్ లేక రోడ్ల మీదే అమ్మకాలు కొనసాగిస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అమ్మకాల కోసం పట్టణ శివారులో వేసిన షెడ్ శిథిలమైపోయింది. మామిడి సీజన్ వస్తున్నందున వెంటనే పండ్ల మార్కెట్ నిర్మించాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుత విద్యుత్ వినియోగం డిమాండ్ తీరును పరిశీలిస్తే రానున్న వేసవిలో డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. డిమాండ్ ఎంతగా పెరిగినా.. దానికి తగ్గట్టుగా సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో విద్యుత్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ 1912 నంబర్ ద్వారా తక్షణ సేవలను పొందాలని వారు సూచించారు.
14 ఏళ్లు పోరాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్, పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసిన సేవలు, ఆయన వయస్సు, శారీరక స్థితిపై సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ సమాజాన్ని నివ్వెర పరిచాయని బీఆర్ఎస్ Xలో ట్వీట్ చేసింది. కేసీఆర్ ప్రమాదంలో గాయపడితే దాన్ని కూడా రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవాలన్న రేవంత్ రెడ్డి సంకుచిత మనస్తత్వాన్ని కచ్చితంగా నిరసించాల్సిందేనని మండిపడింది.
HYD సిటీ ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ 24 అవర్స్ టికెట్ అప్డేట్ అయింది. QR కోడ్, ఫోన్ నంబర్తో పాటు టికెట్ ప్రింట్ వస్తుంది. ఇంతకుముందు QR కోడ్ లేకపోవడంతో కొంతమంది ప్రయాణికులు చెల్లని డే పాస్లతో ప్రయాణం చేస్తున్నా.. కొన్నిసార్లు కండక్టర్లు గుర్తించడం కష్టంగా ఉండేది. ఫోన్ నంబర్, QR కోడ్ ఉండడంతో నకిలీ టికెట్లు గుర్తించడం తేలిక అని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. చుక్కాపూర్లో 11.9℃, చందనవల్లి, రెడ్డిపల్లె 12, ఎలిమినేడు 12.9, రాచలూరు, మీర్ఖాన్పేట 13, మంగళపల్లె 13.2, వైట్గోల్డ్ SS 13.3, రాజేంద్రనగర్ 13.4, దండుమైలారం, విమానాశ్రయం, అమీర్పేట, మద్గుల్ 13.5, తొమ్మిదిరేకుల 13.7, సంగం, కాసులాబాద్, హైదరాబాద్ యూనివర్సిటీ, వెల్జాల 13.8, కేతిరెడ్డిపల్లి 14, తాళ్లపల్లి 14.1, కొత్తూరులో 14.3℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా నేడు ట్యాంక్బండ్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాను నిర్వహించనుంది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.
మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరంలో ఇంటర్ పరీక్షలపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ..పరీక్షల నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
HYD నగరంలో 85 ఎకరాల్లో విస్తరించి ఉన్న హిమాయత్ సాగర్, కొత్వాల్ గూడ పార్క్ త్వరలో ఓపెన్ కానుంది. దాదాపుగా 1000 రకాల పక్షులతో పక్షిశాలను సైతం సిద్ధం చేయగా.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించేందుకు అధికారిక యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఎక్వేరియం, పిక్నిక్ పార్కు, రిసార్టులు, అడ్వెంచర్లు, ఫుడ్ కోర్టులు, ఓపెన్ థియేటర్లు అందుబాటులో ఉంచారు.
Sorry, no posts matched your criteria.