India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు బంద్ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్స్టేషన్లోని 132 KV బల్క్ లోడ్ ఫీడర్ పీటీఆర్ మరమ్మతులకు గురైంది. దీంతో నాగార్జున్సాగర్లోని కోదండాపూర్లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీనికి TG ట్రాన్స్కో అధికారులు శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గం. వరకు మరమ్మతులు చేయనున్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో నేడు కీలకం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. గోషామహల్లో ఉదయం 11.40 గంటలకు CM రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో గోషామహల్లోని పోలీస్ గ్రౌండ్స్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు.
‘ప్యాలెస్ CM KCR.. ప్రజల CM రేవంతన్న అని TGలో ఏ గల్లీలో తిరిగే చిన్న పోరణ్ని అడిగినా చెబుతాడు.. ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టింది ఎవరో.. గడీల పాలన చేసింది ఎవరో ప్రజలకు తెలుసు.. ప్యాలెస్ CM అని హరీశ్రావు రేవంతన్నను అనడం విడ్డూరం.. ఆయన పనితీరు చూసి BRS వాళ్లకు కడుపు మంట.. అహంకారంతో ఉన్న BRS గురించి ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోండి..’ అని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి నేడు ఫైరయ్యారు.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ జోయల్ డేవిస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. అత్యల్పంగా చందనవెల్లిలో 11.4℃, రాచలూరు 11.7, ఎలిమినేడు 11.8, రెడ్డిపల్లె 12.3, తొమ్మిదిరేకుల 12.6, మీర్ఖాన్పేట 12.8, రాజేంద్రనగర్ 12.8, వెల్జాల 13.2, తాళ్లపల్లి 13.3, మంగళపల్లె 13.4, కందవాడ 13.6, దండుమైలారం 13.6, వైట్గోల్డ్ SS 13.6, కేతిరెడ్డిపల్లి 13.7, యాచారం 13.7, నల్లవెల్లి 13.8, విమానాశ్రయం 14, మొగలిగిద్ద 14.1, కేశంపేటలో 14.2℃గా నమోదైంది.
మీర్పేట్ PS పరిధిలో భార్యను అతికిరాతకంగా హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే హత్య చేసిన అనంతరం పిల్లలను ఇంటికి తీసుకొచ్చే క్రమంలో వారికి అల్పాహారం తినిపించాడు. ఇల్లంతా దుర్వాసన వస్తుందని పిల్లలు అనగా ఎయిర్ ఫ్రెషనర్తో దుర్వాసన పోగొట్టేందుకు ప్రయత్నించాడు. అనంతరం వారికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. ప్రస్తుతం పిల్లలు అమ్మమ్మ వద్ద ఉంటున్నట్లు సమాచారం.
మరో ఏడాదిలో GHMCకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు నేటి సర్వసభ్య సమావేశాన్ని సవాల్గా తీసుకున్నాయి. నేటి సమావేశంలో అవిశ్వాసం, రూ.8వేల కోట్ల బడ్జెట్పై చర్చకు పార్టీలు సిద్ధమయ్యాయి. వీటన్నింటిని యుక్తితో ఎదుర్కోవాలని కాంగ్రెస్ కౌన్సిలర్లకు సూచించింది. అవిశ్వాసానికి BRSకు సంఖ్యాబలం లేదని మేయర్ విజయలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన ఫండ్ కోసం కార్పొరేటర్లు పట్టుబట్టనున్నారు
నేటి GHMC కౌన్సిల్ మీటింగ్తో హాల్ దద్దరిల్లనుంది. 2025-26 వార్షిక బడ్జెట్ను ఆమోదించడం ఎజెండా. అయితే, FEB 11న గవర్నింగ్ బాడీకి 4 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సమయంలో మేయర్పై BRS అవిశ్వాసానికి ప్లాన్ చేయగా, కౌన్సిల్ మీటింగ్లో BJP గళం వినిపించాలని ఆ పార్టీ అగ్రనేతలు కార్పొరేటర్లకు సూచించారు. ఇక HYDలో బలం పెంచుకున్న INC వీటిని తిప్పికొట్టే యోచనలో ఉంది. దీంతో ఈ కౌన్సిల్ మీటింగ్ పొలిటికల్ హీట్ పెంచింది.
హుస్సేన్సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, NTR గార్డెన్, ఇందిరా పార్క్ను కలుపుతూ టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని CM సూచించారు.
USలో జరిగిన యాక్సిడెంట్లో HYD వాసి వాజిద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. వాజిద్ ఖైరతాబాద్ మం. MSమక్తా వాసి. SEC వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. రాజకీయాల్లో ఆసక్తి ఉండడంతో యూత్ కాంగ్రెస్లో చేరాడు. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పని చేశాడు. NRI కాంగ్రెస్ కమిటీ మెంబర్గాను ఉన్నాడు. హయ్యర్ స్టడీస్ కోసం US వెళ్లి అక్కడే జాబ్ చేస్తున్నాడు. బుధవారం ఉ. రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరం.
Sorry, no posts matched your criteria.