RangaReddy

News January 30, 2025

Politics: నేడు దద్దరిల్లనున్న GHMC!

image

నేటి GHMC కౌన్సిల్ మీటింగ్‌తో హాల్ దద్దరిల్లనుంది. 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆమోదించడం ఎజెండా. అయితే, FEB 11న గవర్నింగ్ బాడీకి 4 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సమయంలో మేయర్‌పై BRS అవిశ్వాసానికి ప్లాన్ చేయగా, కౌన్సిల్ మీటింగ్‌లో BJP గళం వినిపించాలని ఆ పార్టీ అగ్రనేతలు కార్పొరేటర్లకు సూచించారు. ఇక HYDలో బలం పెంచుకున్న INC వీటిని తిప్పికొట్టే యోచనలో ఉంది. దీంతో ఈ కౌన్సిల్ మీటింగ్‌ పొలిటికల్ హీట్‌ పెంచింది.

News January 30, 2025

హుస్సేన్‌సాగర్‌ చుట్టూ టూరిజం సర్క్యూట్‌!: CM

image

హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, NTR గార్డెన్, ఇందిరా పార్క్‌ను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం టూరిజం పాలసీపై మంత్రి జూపల్లి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్, CS శాంతి కుమారి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందించాలని CM సూచించారు.

News January 29, 2025

అమెరికాలో HYD వాసి మృతి.. పూర్తి వివరాలు

image

USలో జరిగిన యాక్సిడెంట్‌లో HYD వాసి వాజిద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. వాజిద్ ఖైరతాబాద్ మం. MSమక్తా వాసి. SEC వెస్లీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. రాజకీయాల్లో ఆసక్తి ఉండడంతో యూత్‌ కాంగ్రెస్‌లో చేరాడు. హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పని చేశాడు. NRI కాంగ్రెస్ కమిటీ మెంబర్‌గాను ఉన్నాడు. హయ్యర్ స్టడీస్ కోసం US వెళ్లి అక్కడే జాబ్ చేస్తున్నాడు. బుధవారం ఉ. రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరం.

News January 29, 2025

HYD: మెట్రో సేవల అంతరాయంపై క్లారిటీ

image

సేవల అంతరాయంపై హైదరాబాద్ మెట్రో స్పందించింది. సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్యల కారణంగానే మెట్రో సేవలకు అంతరాయం కలిగిందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సేవలు యథావిధిగా కొనసాగిస్తున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. సేవలకు అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నామన్నారు.

News January 29, 2025

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..

image

రంగారెడ్డి జిల్లా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. చుక్కాపూర్లో 11℃, చందనవెల్లి 12.6, రాచలూరు 12.8, మీర్‌ఖాన్‌పేట 12.8, ఎలిమినేడు 13.1, మద్గుల్ 13.4, సంగెం 13.5, రాజేంద్రనగర్ 13.4, వెల్జాల 13.5, విమానాశ్రయం 13.7, దండుమైలారం 13.8, తాళ్లపల్లి 13.9, కొందుర్గ్ 14.3, ముద్విన్ 14.2, మొగలిగిద్ద 14.4, మంగళపల్లి 14.5, వైట్‌గోల్డ్ 14.6, కాసులాబాద్ 14.6, కేశంపేట 14.6 కందవాడ 14.7, కడ్తాల్లో 14.8℃గా నమోదైంది.

News January 29, 2025

HYD: MURDERకు గురుమూర్తి వాడిన 16 వస్తువులు!

image

మాధవి హత్య కేసులో భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్‌కు ఉపయోగించిన 16 వస్తువులను సీజ్ చేశారు.
1.స్టవ్, 2.కత్తి, 3.రోలర్, 4.రోలర్ స్టోన్, 5.బకెట్, 6.వాటర్ హీటర్, 7.క్లాత్స్ (చుడీదార్ & లెగ్గింగ్), 8. నిందితుడి Short, 9.ఫినాయిల్ బాటిల్, 10.రూమ్ ఫ్రెష్నర్, 11.సర్ఫ్ ప్యాకెట్, 12.యాసిడ్ బాటిల్, 13.డోర్ మ్యాట్, 14.చెత్త బాకెట్, 15.మోటర్ సైకిల్ 16. 2 మొబైల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు.

News January 29, 2025

HYD: కోలుకున్న కిడ్నీ దాతలు, గ్రహీతలు

image

అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ కేసు గుట్టురట్టైన విషయం తెలిసిందే. అయితే కిడ్నీ దానం చేసిన తమిళనాడుకు చెందిన మహిళలు భాను, ఫిర్దోస్‌తో పాటు కిడ్నీ గ్రహీతలు రాజశేఖర్, కృపాలతలకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా.. చికిత్స తీసుకుంటున్న కిడ్నీ దాతలు, గ్రహీతలు కోలుకొని డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News January 29, 2025

HYD: బీఆర్ఎస్‌కు సంఖ్యాబలం లేదు: మేయర్

image

ఫిబ్రవరి 11 వరకు అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టర్‌కు నోటీసు ఇవ్వాలన్నా 98 మంది మద్దతు అవసరమని, అంత సంఖ్యాబలం బీఆర్ఎస్‌కు లేదన్నారు. మేయర్, ఉపమేయర్‌పై అవిశ్వాసం పెట్టే హక్కు ప్రతిపక్షాలకు ఉందని.. అయితే వారికి అవిశ్వాసం పెట్టే విధానం తెలియదన్నారు.

News January 29, 2025

ECILలో జాబ్స్.. రూ. 2.80 లక్షల జీతం

image

కాంట్రాక్ట్ బేసిక్ కింద జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 పోస్టులను ECIL భర్తీ చేస్తోంది. MBA, PG, PG డిప్లొమా ఉత్తీర్ణులై, అనుభవం ఉన్నవారు అర్హులు. ఫైనాన్స్, HR, డిఫెన్స్ సిస్టమ్ తదితర విభాగాల్లో GM పోస్టులకు నెలకు రూ. 1.20 లక్షల నుంచి 2.80 లక్షల జీతం ఉంటుంది. సీనియర్ మేనేజర్లకు రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షల జీతం చెల్లిస్తారు. అప్లే చేసేందుకు JAN 31 చివరి తేదీ. LINK: www.ecil.co.in
SHARE IT

News January 29, 2025

HYD బ్రాండ్ ఇమేజ్ పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు

image

HYD, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దావోస్ పెట్టుబడులపై ఆయన మంగళవారం వివరాలు వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళన, నిరుద్యోగ యువతి యువకుల నైపుణ్యం పెంచేలా సింగపూర్‌లో CM చర్చలు జరిపారన్నారు. HYD ప్రజలకు మెరుగైన జీవనం కల్పించేలా ప్రస్తావించామన్నారు. సింగపూర్ మంత్రులు దీనిపై ఆసక్తి చూపించారన్నారు. యువత భవిష్యత్తు కోసమే యంగ్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చామన్నారు.