RangaReddy

News August 9, 2024

HYD: అర్హులకే అసైన్డ్ భూములు: భట్టి విక్రమార్క

image

ఇందిరాగాంధీ కాలంలో భూమి లేని పేదలకు పంచిన ఆసైన్డ్ భూములు తిరిగి అర్హులకే చెందేలా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసానిచ్చారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాదర్‌గుల్ రైతులు ప్రగతిభవన్‌లో డిప్యూటీ సీఎంను కలిసి తమకు కేటాయించిన భూములను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.

News August 9, 2024

HYD: ఫుడ్ కోర్టులు, రిసార్ట్స్ ప్రైవేటీకరణ!

image

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏటా కోట్లాది నిధులను సమకూరుస్తున్న పర్యాటక సంస్థ రిసార్ట్స్, ఫుడ్ కోర్టులను ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధమైంది. మొదటగా గోల్కొండ ఇబ్రహీంబాగ్ సమీపంలోని తారామతి బారాదరి ఫుడ్ కోర్టు నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా సుమారు కోటికి పైగా పర్యాటక సంస్థకు ఆదాయాన్నిచ్చే ఫుడ్ కోర్టును ప్రైవేట్ పరం చేయడాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.

News August 9, 2024

HYD: 5 లక్షల మంది మహిళలకు AIలో శిక్షణ

image

ఏఐ రంగంలో మహిళా సాధికారత సాధించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), సౌత్ ఏషియన్ ఉమెన్ ఇన్ టెక్నాలజీ (ఎస్ఏడబ్ల్యు ఐటీ), ఎడ్యుటెక్ కంపెనీ గువీ సంయుక్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచంలోకెల్లా మహిళలకు అతిపెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నాయి. జెన్ ఏఐ లెర్నింగ్ ఛాలెంజ్ పేరిట సెప్టెంబర్ 21న ఏకంగా 5 లక్షల మంది మహిళలకు శిక్షణ అందించనున్నాయి.

News August 9, 2024

HYD: కుక్కల దాడిలో మరో బాలుడి మృతి

image

జవహర్‌నగర్‌లో కుక్కల దాడికి బాలుడు మృతిచెందిన ఘటన మరువకముందే HYD శివారులో మరో ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన శివ-మాధురి దంపతుల కుమారుడు క్రియాన్ష్(4) ఇటీవల స్కూల్‌కు వెళ్లి వస్తుండగా అతడిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో బాలుడికి తీవ్ర గాయాలవగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తాజాగా బాలుడు మృతిచెందాడు.

News August 9, 2024

HYD: HCA లీగ్ మ్యాచ్లు నిర్వహించొద్దు: హైకోర్టు

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్ మ్యాచ్లు నిర్వహించొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. HCA అపెక్స్ కౌన్సిల్ రిలీజ్ చేసిన ప్రకటన ఆధారంగా ఎలాంటి మ్యాచ్లు నిర్వహించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్లను నిర్వహించేందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటనను సవాలు చేస్తూ హైదరాబాద్ చార్మినార్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించింది.

News August 9, 2024

నాంపల్లి: భూదాన్ యజ్ఞ బోర్డు రద్దు కరెక్టే: హైకోర్టు

image

భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్టబద్ధమైనదని హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బోర్డు ఛైర్మన్, మెంబర్స్ దాఖలు చేసిన అప్పీలును డిస్మిస్ చేసింది. అంతేకాకుండా ప్రత్యేక అధికారిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నియామకాన్ని సమర్థించింది. బోర్డు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.

News August 9, 2024

శంషాబాద్: ఆగస్ట్ 15 తర్వాత విమానాశ్రయంలో రద్దీ!

image

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు ముఖ్య సూచిక చేసింది. ఆగస్ట్ 15 నుంచి వారం రోజులపాటు ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అందుకే విమాన ప్రయాణాలు చేసే వారు ఎయిర్ పోర్ట్‌కు ముందుగానే చేరుకోవాని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రకటించింది. రాఖీ పండుగ కారణంగా ప్యాసింజర్లు రద్దీ పెరుగుతుందని ఎయిర్ పోర్ట్ అంచనా వేసింది. ఈమేరకు ఫ్లైట్ సమయానికంటే ముందే బయలుదేరాలని సూచించింది.

News August 9, 2024

HYD: పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ రీషెడ్యూల్

image

ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానున్నాయి. టీజీపీజీఈసీ/టీజీపీజీఈసెట్-2024 ప్రవేశాల రీషెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం 25న అర్హుల జాబితా ప్రకటిస్తారు. 29న వెబ్ ఆప్షన్ల సవరణ, సెప్టెంబర్ 1న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

News August 9, 2024

16న శంకర్‌పల్లికి సీఎం రేవంత్ రెడ్డి

image

ఈ నెల 16న శంకర్‌పల్లికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. మున్సిపాలిటీలో కేంద్ర పథకం అమృత్ 2.0 కింద రూ. 32 కోట్లతో నిర్మించే వాటర్ ట్యాంకు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. టీయూఎఫ్ ఐడీసీ నిధులు రూ.21 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారని కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు.

News August 9, 2024

HYD: ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కొత్త ప్రయోగం

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సంయుక్త ఆధ్వర్యంలో ఐటీ కంపెనీల భవనాలకు హై రేంజ్‌ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 70 ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. వీటి ద్వారా ట్రాఫిక్ జామ్‌ను గుర్తించి క్లియర్ చేయనున్నారు.