RangaReddy

News January 22, 2025

HYD: రైల్వే ట్రాక్‌పై అమ్మాయి తల, మొండెం (UPDATE)

image

జామై ఉస్మానియాలో అమ్మాయి సూసైడ్ కేసులో అసలు విషయం వెలుగుచూసింది. కాచిగూడ రైల్వే పోలీసుల వివరాలు.. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది. తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో <<15212047>>రైల్ కింద పడి ఆత్మహత్య<<>> చేసుకుంది. ఉస్మానియా మార్చురీలో బిడ్డను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News January 22, 2025

HYD నుంచి బీదర్ వరకు IAF టీం సైకిల్ యాత్ర

image

HYD బేగంపేట నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు 20 మంది సభ్యులతో కూడిన IAF బృందం సైకిల్ యాత్ర చేసినట్లుగా తెలిపింది. ఇందులో ఇద్దరు మహిళ ఆఫీసర్లు ఉన్నట్లుగా పేర్కొంది. బీదర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయడం పట్ల త్రివిధ దళాల అధికారులు వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. IAF అధికారుల సైకిల్ యాత్రను పలువురు ప్రశంసిస్తున్నారు.

News January 22, 2025

HYD: పజ్జన్నను ఫోన్‌లో పరామర్శించిన కేటీఆర్

image

డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విషయాన్ని తెలుసుకున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పద్మారావుగౌడ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స అనంతరం ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని పద్మారావుగౌడ్ కేటీఆర్‌కు తెలిపారు. తగిన విశ్రాంతి తీసుకొని మళ్లీ కార్యక్షేత్రంలోకి రావాలని కేటీఆర్ ఆయనకు సూచించారు.

News January 22, 2025

జనవరి 25న నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తాం: CEO

image

జనవరి 25వ తేదీన HYDలో భారీ ఎత్తున నేషనల్ ఓటర్స్ డే నిర్వహిస్తామని తెలంగాణ స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొంటారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించి ఓటు హక్కుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎలక్షన్ అధికారులకు సమావేశంలో ఆదేశించారు.

News January 21, 2025

AISF రంగారెడ్డి జిల్లా గర్ల్స్ కన్వీనర్‌గా శ్రావణి

image

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్, వంశి అధ్యక్షతన శంషాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో జిల్లా గర్ల్స్ కన్వీనర్‌గా కే శ్రావణిని నియమించారు. ఈ సమావేశనికి ముఖ్య అతిథులుగా జిల్లా నిర్మాణ బాధ్యుడు పానుగంటి పర్వతాలు, AISF రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణికంఠ రెడ్డి, లక్ష్మణ్, ఉపాధ్యక్షులు క్రాంతి పాల్గొన్నారు.

News January 21, 2025

శంషాబాద్: రికార్డు బ్రేక్ చేసిన ఎయిర్ పోర్ట్

image

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2025 జనవరి 18వ తేదీన ఒకే రోజు 94,630 మంది ప్రయాణికులను 607 విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చి గత రికార్డును బ్రేక్ చేసినట్లుగా RGIA బృందం తెలిపింది. గత రికార్డు 2024 డిసెంబర్ 22వ తేదీన ఒకేరోజు 92,000 మంది శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణించారు. గత డిసెంబర్ నెలలో 27 లక్షల మంది ప్రయాణించగా అందులో 23 లక్షల మంది స్వదేశీయులే అని తెలిపింది.

News January 21, 2025

HYD: రైల్వే ట్రాక్‌పై అమ్మాయి తల, మొండెం (UPDATE)

image

జామై ఉస్మానియాలో ట్రాక్‌ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(19)గా గుర్తించారు. OU ఆంధ్ర మహిళ సభలోని హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నట్లు వెల్లడించారు. <<15212047>>ఆత్మహత్య<<>>కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

HYD: జామై ఉస్మానియా ట్రాక్‌పై అమ్మాయి మృతదేహం

image

సికింద్రాబాద్ జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌ మీద అమ్మాయి మృతదేహం కలకలం రేపింది. స్థానికుడు రాజు తెలిపిన వివరాలు.. ‘ఉదయం వాకింగ్‌కు వెళ్లగా రైల్వే ట్రాక్ మీద జనాలు గుమిగూడారు. ఏంటని వెళ్లి చూడగా ఓ అమ్మాయి తల, మొండెం వేరుగా పడి ఉంది. పోలీసులు వచ్చి దర్యాప్తు చేపట్టారు. సదరు యువతి ఓయూలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు తెలిసింది.’ అని రాజు పేర్కొన్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది

News January 21, 2025

పెరిగిన చలి: హైదరాబాద్‌లో సింగిల్ డిజిట్

image

HYDలో చలి మరింత పెరిగింది. మంగళవారం HCU వద్ద అత్యల్పంగా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మౌలాలి-9.3, BHEL-9.4, రాజేంద్రనగర్‌లో 9.7 సింగిల్ డిజిట్ నమోదు కావడం గమనార్హం. మరో 5 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. KBR పార్క్, ఇందిరా పార్క్, ఓయూ తదితర ప్రాంతాల్లో ఉదయం చలిగాలులు వీచాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్త వహించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

News January 21, 2025

ECILలో జాబ్స్.. నెలకు రూ. 2,80,000

image

కాంట్రాక్ట్ బేసిక్ కింద ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 పోస్టులను ECIL భర్తీ చేస్తోంది. MBA, PG, PG డిప్లొమా ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్నవారు అర్హులు. ఫైనాన్స్, HR, డిఫెన్స్ సిస్టమ్ తదితర విభాగాల్లో GM పోస్టులకు నెలకు రూ. 1.20 లక్షల నుంచి 2.80 లక్షల Pay Scale ఉంటుంది. సీనియర్ మేనేజర్‌కు Pay Scale రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షలు చెల్లిస్తారు. అప్లై చేసేందుకు జనవరి 31 చివరి తేదీ.
SHARE IT