RangaReddy

News February 9, 2025

UPDATE: HYD: ఆస్తి కోసమే తాత హత్య!

image

ఆస్తి గొడవల కారణంగా వ్యాపారవేత్త జనార్దన్ రావును మనవడు హత్య చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వెల్జాన్ గ్రూప్‌లో ఓ మనవడికి జనార్దన్ డైరెక్టర్ పోస్టును ఇచ్చాడు. తనకు ఏం ఇవ్వలేదని కోపం పెంచుకున్న కీర్తి తేజ తాతపై 73 సార్లు కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లిపై కూడా అటాక్ చేసి ఏలూరుకు పారిపోయాడు. పోలీసులు నిందితుడిని ఏలూరులో అరెస్ట్ చేశారు. 

News February 9, 2025

HYD: జాతీయ క్రీడల్లో విద్యార్థిని ప్రతిభ

image

జాతీయ క్రీడల్లో షాద్ నగర్ పట్టణానికి చెందిన నిత్య రజత పతకాన్ని సాధించింది. 38వ జాతీయ క్రీడల్లో పరుగు పందెంలో 100 మీటర్లను 11.79 సెకండ్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచి రజత మెడల్ గెలిచింది. తన కూతురు జాతీయ క్రీడల్లో రాణించడం సంతోషంగా ఉందని నిత్య తండ్రి రవికుమార్ అన్నారు. 

News February 9, 2025

HYD: బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు!

image

నార్సింగి PS పరిధిలో బాలికపై అత్యాచారం జరిగిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికను మధుసూదన్, జయంత్, సాయి, తరుణ్ అత్యాచారం చేసి ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆమె రూ.10వేలు వారికి ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడీగా ఉంటున్న బాలికను తల్లి నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిని శుక్రవారం రిమాండ్‌ చేశారు. 

News February 9, 2025

HYD: గురుమూర్తిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

image

మీర్ పేట్‌లో భార్యను అతికిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ మేరకు మీర్ పేట పోలీసులు కష్టపడి పిటిషన్ వేసి విచారణ నిమిత్తం గురుమూర్తిని శనివారం 4రోజులు కస్టడీలోకి తీసుకోగా సరూర్ నగర్ సీసీఎల్ లేదా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది.

News February 9, 2025

HYD: నుమాయిష్@15.10 లక్షలు

image

HYD నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తారు. శనివారం వీకెండ్ కావడంతో సందర్శకులు పెద్దఎత్తున తరలిరావడంతో ఎగ్జిబిషన్ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. దాదాపు 80 వేల మంది సందర్శకులు శనివారం వచ్చారని నిర్వాహకులు తెలిపారు. జనవరి 3 నుంచి నిన్నటి వరకు ఎగ్జిబిషన్‌కు 15.10 లక్షల మంది సందర్శకులు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

News February 9, 2025

హైదరాబాద్‌ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

image

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం జరిగింది. మీరాలం చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో బ్రిడ్జి డీపీఆర్ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి పరిసరాలను రూపొందించాలని సీఎం అన్నారు. రోడ్ల వెడల్పుపైనా పలు సూచనలు చేశారు.

News February 8, 2025

HYD: ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి: MLC కవిత

image

అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని MLC కవిత అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో BRS ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ, విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.

News February 8, 2025

గండిపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

image

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని RR జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. గండిపేట మండలం నార్సింగిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు స్వచ్ఛమైన రుచికరమైన ఆహారం అందించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

News February 8, 2025

UPDATE: బాలికపై లైంగిక దాడి..రిమాండ్

image

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇన్‌ఫ్రంట్ జీసస్ ఇంటర్నేషనల్ <<15393818>>స్కూల్ డ్రైవర్ <<>>6ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, జోసఫ్ రెడ్డిపై పోక్సో యాక్ట్ కింద మంచాల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన మంచాల పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

News February 8, 2025

అబిడ్స్ DIపై భార్య ఫిర్యాదు

image

అబిడ్స్ పోలీస్ స్టేషన్ డీఐ నరసింహపై ఆయన భార్య సంధ్య హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. పెళ్లై 12 ఏళ్లు అవుతుందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే రెండో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.