India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు పల్లెటూర్లకు తరలివెళ్లారు. దీంతో గృహాలతో పాటు కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పడిపోయింది. ఉత్పత్తులు, రోజువారి కార్యకలాపాలు నిలిచిపోవడంతో వినియోగం గణనీయంగా తగ్గింది. సోమవారం 2,500 మెగావాట్లకు పడిపోయింది. సాధారణ రోజులతో పోలిస్తే 700 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారలు తెలిపారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడంపై మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోకాపేటలోని తన నివాసంలో మాట్లాడుతూ.. బెయిలబుల్ సెక్షన్స్లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం అన్నారు. పండగపూట డెకాయిట్ని, టెర్రరిస్ట్ని అరెస్టు చేసినట్లు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
రంగారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాచులూరు, ఎలిమినేడులో 13.1℃, రెడ్డిపల్లె 13.3, మీర్ఖాన్పేట 13.5, చందనవెల్లి 13.6, తాళ్లపల్లి, అమీర్పేట, మంగళపల్లె 13.7, వైట్గోల్డ్ SS, కేతిరెడ్డిపల్లి 13.9, కందువాడ 14, షాబాద్ 14.3, రాజేంద్రనగర్, గునగల్ 14.4, కొత్తూరు 14.5, ప్రొద్దుటూరు, యాచారం, తొమ్మిదిరేకుల, ఆరుట్ల 14.6, కాసులాబాద్, నందిగామలో 14.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
HYDలోని గచ్చిబౌలి, జేబీఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో ఇప్పటికీ పలువురు గ్రామాలకు వెళ్తున్నారు. నేడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో కొంత మంది నేడు ఉదయం ప్రయాణాలు మొదలుపెట్టారు. దీంతో బస్ స్టేషన్లలో కొద్దిమేర రద్దీ నొలకొంది. నేడు ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు అమలులో ఉండదని అధికారులు తెలిపారు. సాధారణంగా ఉండే బస్సుల్లోనే తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
HYD సీపీ ఆదేశాలతో ప్రమాదకరమైన చైనా మాంజా అమ్మకాలను అరికట్టినట్లు DCP సుదీంద్ర తెలిపారు. గాలిపటాలకు వాడే సింథటిక్ తీగ మానవ, వన్యప్రాణుల జీవితానికి ముప్పు అని తెలిపారు. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. OCT- JAN మధ్య ఈ దారాలకు సంబంధించి 107 కేసులు నమోదు చేసి 148 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రూ.88లక్షల బాబిన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.
HYD నాంపల్లి పరిధిలో నిర్మించిన ఆటోమేటిక్ పార్కింగ్ సిస్టం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. దీంతో నాంపల్లి పరిధిలో రోడ్డుపై పార్కింగ్ సమస్యలు తగ్గనున్నాయి. ఈ పార్కింగ్ను 15 అంతస్తులు మేర, జర్మన్ టెక్నాలజీతో నిర్మించారు. దేశంలో ఇదే మొట్ట మొదటి పెద్ద ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్ కానుంది.
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 9100153883 నంబర్కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
హైదరాబాద్ వేదికగా నిర్వహించిన మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణకు చెందిన మిథాలీ అగర్వాల్.. మిసెస్ ఇండియా తెలంగాణగా నిలిచారు. అండర్ 40లో 3వ స్థానంలో నిలిచి ఆమె రన్నరప్లో నిలిచారు. మిసెస్ మమత త్రివేది నిర్వహించిన ఈ ఈవెంట్లో వివిధ వయసు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. మిథాలీ అగర్వాల్ గతంలో ఐఐటీ హైదరాబాద్ PROగా విధులు నిర్వహించారు. ఆమె విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.
హైదరాబాద్లోని ఉప్పల్, KPHB, ఎల్బీనగర్ క్రాస్ రోడ్, గచ్చిబౌలి, JBS, MGBS నుంచి హనుమకొండ, వరంగల్, తొర్రూరు, కరీంనగర్, సిద్దిపేట వెళ్లే రోడ్డు మార్గంలో RTC ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్ మంటూ.. తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో 3,200 ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వారం క్రితమే నూతన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించారు.
హైదరాబాద్లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి, తినే వారికి GHMC, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు సూచనలు చేశారు. శుభ్రమైన నీటితో మొదట కడగాలన్నారు. కడగటానికి ఉపయోగించే నీటిలో ఏవైనా విష పదార్థాలు ఉంటే, మనం తినే ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉందన్నారు. తద్వారా ఫుడ్ పాయిజనింగ్ జరగటం, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందన్నారు. నీటిలో కాస్తంత ఉప్పు వేసి, కడిగితే మరింత మేలని సూచించారు.
Sorry, no posts matched your criteria.