India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్లో 31, సికింద్రాబాద్ డివిజన్లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 03, 2025.
SHARE IT

సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. HYDలోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎన్టీఆర్ మార్గ్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమానికి ఆయన హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను రక్షించాలన్నారు.

దేశంలో ప్యాలెస్ నుంచి పాలన చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ విమర్శించింది. ‘సీఎం రేవంత్ రెడ్డి ఏనాడు సెక్రటేరియట్కు వచ్చిందే లేదు, ఇక ప్రజలను కలవడం దేవుడెరుగు’ అంటూ Xలో ట్వీట్ చేసింది. సీఎం అధికారిక నివాసం కాదని, పాలనను గాలికొదిలేసి ప్యాలెస్ అడ్డాగా సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారని విమర్శించింది. సీఎం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.

శ్రీరామనామ పారాయణలు కనులవిందుగా ఒకపక్క సాగుతుండగా 108 మంది చిన్నారులు వేషధారణల్లో ప్రదర్శనలు రామ్లల్లా నామరూప వేషధారణ శీర్షికన ప్రదర్శనలతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. రవీంద్రభారతి ప్రధాన మందిరంలో భక్తిపారవశ్యంతో శ్రీరామనామ స్మరణ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. అతిథులుగా విచ్చేసిన ప్రముఖులు వారిని సత్కరించారు.

రంగారెడ్డి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చందనవెల్లిలో 11.4°C, చుక్కాపూర్ 12.1, రెడ్డి పల్లె 12, రాజేంద్రనగర్, తాళ్లపల్లి, కాసులాబాద్ 12.9, ఎలిమినేడు 13, రచలూరు, కొందుర్గ్ 13.1, అమీర్పేట, కేతిరెడ్డిపల్లి, మంగళపల్లె 13.2, కందవాడ 13.3, హెచ్సీయూ, విమానాశ్రయం 13.4, తొమ్మిదిరేకుల 13.5, వైట్గోల్డ్ SS 13.6, కడ్తాల్, వెల్జాల 13.7, దండుమైలారం 13.8, మద్గుల్ 13.9, అరుట్లలో 14℃గా నమోదైంది.

మైత్రీ ఆసుపత్రుల సహకారంతో 16,000 మంది సిబ్బందితో హైదరాబాద్ సిటీ పోలీసులకు CPR శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చామని HYD సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అన్ని వయసుల వారిలోనూ ఆకస్మిక గుండెపోటు కేసులు నమోదవుతున్నాయని అందువల్ల మనందరం కుటుంబ సభ్యుల అందరికీ సీపీఆర్పై అవగాహన అవసరమని తెలిపారు.

దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకట్టుకునేలా హుస్సేన్సాగర్ చుట్టూ స్కైవాక్, సైక్లింగ్, నైట్లైఫ్ షాపింగ్, ఎంటర్టెయిన్మెంట్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ, హుమ్టా ప్రణాళికలు సిద్ధం చేసింది. హుస్సేన్సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో స్కైవాక్, సైకిల్ ట్రాక్ నిర్మించనుంది. పర్యాటకులు ట్యాంక్బండ్ మీదుగా ఇందిరాపార్కుకు వెళ్లేందుకు అనుగుణంగా దీనిని నిర్మించనున్నారు.

HYDలో ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు బంద్ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్స్టేషన్లోని 132 KV బల్క్ లోడ్ ఫీడర్ పీటీఆర్ మరమ్మతులకు గురైంది. దీంతో నాగార్జున్సాగర్లోని కోదండాపూర్లోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీనికి TG ట్రాన్స్కో అధికారులు శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గం. వరకు మరమ్మతులు చేయనున్నారు.

హైదరాబాద్ అభివృద్ధిలో నేడు కీలకం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. గోషామహల్లో ఉదయం 11.40 గంటలకు CM రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో గోషామహల్లోని పోలీస్ గ్రౌండ్స్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు.

‘ప్యాలెస్ CM KCR.. ప్రజల CM రేవంతన్న అని TGలో ఏ గల్లీలో తిరిగే చిన్న పోరణ్ని అడిగినా చెబుతాడు.. ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టింది ఎవరో.. గడీల పాలన చేసింది ఎవరో ప్రజలకు తెలుసు.. ప్యాలెస్ CM అని హరీశ్రావు రేవంతన్నను అనడం విడ్డూరం.. ఆయన పనితీరు చూసి BRS వాళ్లకు కడుపు మంట.. అహంకారంతో ఉన్న BRS గురించి ప్రజలు ఏమంటున్నారో తెలుసుకోండి..’ అని TPCC మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి నేడు ఫైరయ్యారు.
Sorry, no posts matched your criteria.