RangaReddy

News January 13, 2025

HYD: మాజీ ఎంపీ భౌతికకాయానికి మంత్రి నివాళులు

image

నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం భౌతికకాయానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈరోజు నివాళులు అర్పించారు. HYDచంపాపేట్‌లోని ఆయన నివాసానికి వెళ్లి జగన్నాథం కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. జగన్నాథంతో తనకున్న అనుబంధాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి బాధాకరమని, ఎంపీగా ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఓ సీనియర్ నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

News January 13, 2025

HYD: చైనా మాంజా.. జర జాగ్రత్త గురూ!

image

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద తేడా లేకుండా, ఈలలతో గోల చేస్తూ పోటాపోటీగా పతంగులు ఎగరేస్తారు. చైనా మాంజా అమ్మినా.. కొన్నా.. జైలు శిక్షే అని ఇప్పటికే HYD,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. చైనా మాంజా కారణంగా పక్షులతో పాటు మనుషులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నారు. పంతంగులను ఎగురవేసేందుకు మాంజాను విక్రయించినా, ఎగురవేసినా అరెస్టులు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.

News January 13, 2025

HYD: కాస్త ఆగండి.. 4 నెలల్లో సమస్యలు తీరతాయి

image

HYD దుర్గంచెరువు FTL వివాదాలకు 4 నెలల్లో శాశ్వ‌త‌ ప‌రిష్కారం చూపుతామ‌ని లేక్ ప్రొటెక్ష‌న్ క‌మిటీ ఛైర్మెన్‌, హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ తెలిపారు. HYD రాయదుర్గం చెరువు FTL నిర్ధార‌ణ‌లో సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌ల‌తో పాటు, ఐఐటీ, బిట్స్‌పిలానీ, జేఎన్‌టీయూ వంటి విద్యా సంస్థ‌ల ఇంజినీర్ల‌ను కూడా భాగ‌స్వామ్యం చేస్తామ‌న్నారు. వాస్త‌వానికి 65.12 ఎక‌రాలు కాగా, ఒక్కో శాఖ ఒక్కో లెక్క చెబుతోంద‌ని స్థానికులన్నారు.

News January 13, 2025

రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో చందనవెల్లిలో 13.8℃, రెడ్డిపల్లె, తాళ్లపల్లి 14.2, కాసులాబాద్ 14.3, ఎలిమినేడు, రాచులూరు 14.4, షాబాద్ 14.5, రాజేంద్రనగర్, మీర్‌ఖాన్‌పేట 14.6, ఇబ్రహీంపట్నం వైట్‌గోల్డ్ ప్రాంతం, మంగళపల్లె 14.9, అమీర్‌పేట, కేతిరెడ్డిపల్లిలో 15℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News January 13, 2025

HYD: నుమాయిష్‌కు ఇప్పటివరకు 2.75 లక్షల మంది

image

HYDలో జరుగుతున్న 84వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల నుమాయిష్‌కు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. దాదాపు 75 వేల మంది సందర్శించారని పేర్కొన్నారు. 80 సీసీ కెమెరాలతో ఎగ్జిబిషన్‌లో నిఘాను ముమ్మరం చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 2.75 లక్షల మంది ఎగ్జిబిషన్‌కు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

News January 13, 2025

HYDలో విదేశీయులు.. అందు కోసమే..!

image

HYDలో నేటి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనున్న నేపథ్యంలో, 3 రోజులకు ముందుగానే విదేశీయులు హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట లాంటి చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించిన కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశస్థులు మన సంస్కృతిని కొనియాడారు.

News January 13, 2025

HYD: మొగిలిగిద్దకు సీఎం రాక

image

HYD శివారు షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్ మండలంలో మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని గ్రామానికి చెందిన ప్రొఫెసర్ గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. మొగిలిగిద్దలో పాఠశాలను ప్రారంభించి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలను ప్రారంభించడానికి రావాలని సీఎంను ఆహ్వానించారు.

News January 12, 2025

HYD: ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది: దానం

image

ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని MLA దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్ రేసుతో HYD ఇమేజ్ పెరిగిందన్నాను.. కానీ అవినీతి జరగలేదని చెప్పలేదన్నారు. కంటి తుడుపు చర్యల్లా మూసీ వద్ద నాయకులు ఒక్కరోజు నిద్ర చేశారన్నారు. అక్కడికి వెళ్లే ముందే ACలు పెట్టించుకుని పడుకున్నారన్నారు. అక్కడివారు చేసిన జొన్న రెట్టేలు కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకున్నారని ఆరోపించారు.

News January 12, 2025

HYD: భువనగిరి టోల్ గేట్ వద్ద ఇదీ పరిస్థితి..!

image

HYD నగరం ఉప్పల్ నుంచి బోడుప్పల్, ఘట్కేసర్ మీదుగా వరంగల్ వైపు వెళ్తున్న మార్గ మధ్యమంలో ఉన్న భువనగిరి టోల్ గేట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచాయి. టోల్ గేట్ నుంచి దాదాపు అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పలువురు వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోకపోవడంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఏదేమైనప్పటికీ ఇదే మార్గంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

News January 12, 2025

HYD: సంక్రాంతి స్పెషల్ బోర్డులు.!

image

బోడుప్పల్, KPHB, MGBS, JBS, కూకట్‌పల్లి కుషాయిగూడ ప్రాంతాల్లో సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు సైతం ముందస్తుగానే సంక్రాంతి స్పెషల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో రద్దీ పెరిగితే వెంటనే సిటీ బస్సులను జిల్లా బస్సులుగా మార్చి, ప్రయాణికులను తరలిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సిటీలో తిరిగే సర్వీసులకు అదనపు ఛార్జీలు లేవని, కేవలం జిల్లా స్పెషల్ సర్వీసులకే ఉన్నట్లు పేర్కొన్నారు.