RangaReddy

News January 13, 2025

HYD: నుమాయిష్‌కు ఇప్పటివరకు 2.75 లక్షల మంది

image

HYDలో జరుగుతున్న 84వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల నుమాయిష్‌కు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. దాదాపు 75 వేల మంది సందర్శించారని పేర్కొన్నారు. 80 సీసీ కెమెరాలతో ఎగ్జిబిషన్‌లో నిఘాను ముమ్మరం చేసినట్లు అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్, సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 2.75 లక్షల మంది ఎగ్జిబిషన్‌కు వచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

News January 13, 2025

HYDలో విదేశీయులు.. అందు కోసమే..!

image

HYDలో నేటి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనున్న నేపథ్యంలో, 3 రోజులకు ముందుగానే విదేశీయులు హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ కోట లాంటి చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించిన కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశస్థులు మన సంస్కృతిని కొనియాడారు.

News January 13, 2025

HYD: మొగిలిగిద్దకు సీఎం రాక

image

HYD శివారు షాద్‌నగర్‌లోని ఫరూఖ్‌నగర్ మండలంలో మొగిలిగిద్ద గ్రామ ప్రభుత్వ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిని గ్రామానికి చెందిన ప్రొఫెసర్ గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. మొగిలిగిద్దలో పాఠశాలను ప్రారంభించి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలను ప్రారంభించడానికి రావాలని సీఎంను ఆహ్వానించారు.

News January 12, 2025

HYD: ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది: దానం

image

ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని MLA దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్ రేసుతో HYD ఇమేజ్ పెరిగిందన్నాను.. కానీ అవినీతి జరగలేదని చెప్పలేదన్నారు. కంటి తుడుపు చర్యల్లా మూసీ వద్ద నాయకులు ఒక్కరోజు నిద్ర చేశారన్నారు. అక్కడికి వెళ్లే ముందే ACలు పెట్టించుకుని పడుకున్నారన్నారు. అక్కడివారు చేసిన జొన్న రెట్టేలు కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకున్నారని ఆరోపించారు.

News January 12, 2025

HYD: భువనగిరి టోల్ గేట్ వద్ద ఇదీ పరిస్థితి..!

image

HYD నగరం ఉప్పల్ నుంచి బోడుప్పల్, ఘట్కేసర్ మీదుగా వరంగల్ వైపు వెళ్తున్న మార్గ మధ్యమంలో ఉన్న భువనగిరి టోల్ గేట్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచాయి. టోల్ గేట్ నుంచి దాదాపు అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం ఏర్పడింది. పలువురు వాహనదారులు ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోకపోవడంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఏదేమైనప్పటికీ ఇదే మార్గంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

News January 12, 2025

HYD: సంక్రాంతి స్పెషల్ బోర్డులు.!

image

బోడుప్పల్, KPHB, MGBS, JBS, కూకట్‌పల్లి కుషాయిగూడ ప్రాంతాల్లో సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సులకు సైతం ముందస్తుగానే సంక్రాంతి స్పెషల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో రద్దీ పెరిగితే వెంటనే సిటీ బస్సులను జిల్లా బస్సులుగా మార్చి, ప్రయాణికులను తరలిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సిటీలో తిరిగే సర్వీసులకు అదనపు ఛార్జీలు లేవని, కేవలం జిల్లా స్పెషల్ సర్వీసులకే ఉన్నట్లు పేర్కొన్నారు. 

News January 12, 2025

HYD: హైడ్రాకు ప్రజావాణిలో 83 ఫిర్యాదులు

image

చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రోడ్లు, పుట్‌పాత్‌లను పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటు హైడ్రా దూకుడు పెంచింది. ఈ సంస్థ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల కబ్జా, లేఅవుట్లు, ప్లాట్ల తగాదాలు, రోడ్డు ఆక్రమణల వంటి 10వేల ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 83ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

News January 12, 2025

హైదరాబాద్‌లో కిక్కిరిసిన వాహనాలు

image

సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని రోడ్లు ప్రయాణీకుల రద్దీ నెలకొంది. తెలంగాణలోని వివిధ జిల్లాలతోపాటు, ఏపీకి వెళ్లే వారితో కూకట్‌పల్లి, MGBS, JBS, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్లు రద్దీగా మారాయి. LB నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్- విజయవాడ హైవేపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

News January 11, 2025

HYD: కిక్కిరిసిన మెట్రో స్టేషన్లు

image

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. నేటి నుంచి విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. దీంతో పండగకు వెళ్లే వారితో మెట్రో రైళ్లలో రద్దీ నెలకొంది. మియాపూర్, రాయదుర్గం, అమీర్ పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

News January 11, 2025

HYD: పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్

image

ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపు 50 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్.. 21 దేశాల నుంచి వస్తున్నారు. వీరంతా తమ తమ దేశాలకు సంబంధించిన గాలి పటాన్ని ఎగరవేయనున్నారు.