RangaReddy

News January 11, 2025

శంషాబాద్: ప్రయాణికులు 2,3 గంటల ముందే చేరుకోవాలి

image

శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే దేశీయ,అంతర్జాతీయ ప్రయాణికులు తమ ప్రయాణ సమయానికి 2,3 గంటల ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని సకాలంలో విమానాశ్రయానికి చేరుకోవాలన్నారు. తనిఖీల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా డీజీ యంత్రం సేవలను వినియోగించుకోవాలన్నారు.

News January 11, 2025

ఫార్ములా ఈ-రేస్‌ HYD ఇమేజ్ పెంచింది: దానం

image

ఫార్ములా ఈ-రేస్‌ HYD ఇమేజ్ పెంచిందని అనటంలో ఎలాంటి అనుమానం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గతంలోనే ఫార్ములా-1 కోసం మాజీ సీఎం చంద్రబాబు హయాంలో భూసేకరణ జరిగి, అంతా సిద్ధమైనా కొన్ని కారణాలతో అప్పుడు అది జరగలేదన్నారు. అంతర్జాతీయ దృష్టిని కేంద్రీకరించడంలో ఫార్ములా ఈ-రేస్ దోహద పడిందన్నారు. అవినీతి జరిగిందా? లేదా? అన్నది ACB, ED, కోర్టు చెప్పే వరకు స్పందించడం కరెక్ట్ కాదన్నారు.

News January 11, 2025

HYD: KTRపై మరో కేసు.. మాజీ ఛైర్మన్ ఆగ్రహం!

image

KTRపై మరో కేసు నమోదు కావటంపై HYD కూకట్‌పల్లి BRS నేత, TSTS మాజీ ఛైర్మన్ జగన్ ఆగ్రహించారు. ACB ఆఫీసు నుంచి తెలంగాణ భవన్‌కు 330 మీటర్లకు ర్యాలీగా వెళ్లారని KTRపై కేసు పెట్టారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు అక్కడ ర్యాలీ జరగలేదని ACB ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక, పోలీసు బలగాల నడుమ 10 నిమిషాల్లో KTR తెలంగాణ భవన్ చేరుకున్నారని తెలిపారు. KTR లక్ష్యంగా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందన్నారు.

News January 11, 2025

HYD: డేటింగ్ పేరుతో పిలిచి.. చివరికీ ఇలా..!

image

డేటింగ్ యాప్ పేరుతో యువకులు మోసపోతున్నారు. డేటింగ్ యాప్ ద్వారా యువకులను బుట్టలో వేసుకుంటున్న కొందరు, అర్ధరాత్రి యువకులకు ఫోన్ చేసి, నిర్మానుష్య ప్రాంతాలకు పిలిచి, డబ్బులు డిమాండ్ చేస్తూ అవసరమైతే బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు HYDలో 10కి పైగా జరిగాయి. ఇటీవలే అత్తాపూర్‌లోనూ ఇలాంటి ఘటనలు జరగగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. # SHARE IT

News January 10, 2025

HYD: 2030 నాటికి 10వేల ఛార్జింగ్ స్టేషన్లు..50% అక్కడే!

image

2030 నాటికి 10వేల EV ఛార్జింగ్ స్టేషన్లను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటికోసం ప్రణాళికలు సిద్ధం చేయగా, దాదాపు 50% హైదరాబాద్ మహానగరంలోనే ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. 2024 నవంబర్ నెలలో నూతనంగా తెచ్చిన ఈవీ పాలసీ మేలు చేయనుంది. మరోవైపు HYD నగరంలో మొత్తం ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సులను తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

News January 10, 2025

HYD: ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం’

image

వైకుంఠ ఏకాదశి వేడుకలను అన్ని ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్‌కు భక్తులు పోటెత్తారు. ‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం’ మంత్రం పఠిస్తూ భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజధాని ప్రజలు పెద్ద ఎత్తున చీర్యాలకు క్యూ కట్టారు. దీంతో ECIL-నాగారం-రాంపల్లి చౌరస్తా- చీర్యాల రూట్‌లో వాహనాల రద్దీ నెలకొంది. SHARE IT

News January 10, 2025

HYD: రేపటి నుంచి విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్

image

20 కోచుల సామర్థ్యం కలిగిన ఆరెంజ్ వందే భారత్ రైలు రేపు విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య సేవలు ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు వివిధ ప్రాంతాల్లో ట్రయల్ రన్స్ పూర్తి చేసినట్లుగా తెలిపారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో భువనేశ్వర్, విశాఖపట్నం, పూనే మార్గాల్లోనూ వందే భారత్ రైల్వే సేవలు అందిస్తున్నారు.

News January 10, 2025

తిరుపతికి క్యూ కట్టిన ప్రజాప్రతినిధులు

image

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. రాష్ట్ర టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, డోర్నకల్ MLA రామ చంద్రనాయక్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మల్కాజ్గిరి నాయకులు రాము, ఇతర నేతలందరూ కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు సైతం తిరుమల తిరుపతికి చేరుకున్నారు.

News January 10, 2025

HYD: కుంభమేళాకు వెళ్తున్నారా..? ఇది మీకోసమే!

image

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లే వారికి IRCTC రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. కుంభమేళా వద్ద ఉండటం కోసం ప్రయాగ్ రాజ్ కుంభమేళలో టెంట్ బుక్ చేసుకోవచ్చని, సూపర్ డీలక్స్ అండ్ విల్లా సదుపాయం ఉందని, IRCTC టెంట్ సిటీ ఏర్పాటు చేసినట్లు HYD అధికారులు తెలిపారు. ఆసక్తి గలవారు 1800110139కు కాల్ చేసి, irctctourism.com వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

News January 10, 2025

జీహెచ్ఎంసీ గ్రౌండ్లను సిద్ధం చేయడంపై FOCUS

image

HYD మహానగరానికి క్రీడలపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మొదటి దశలో 3 మైదానాలను నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్‌తో అభివృద్ధి చేయనుంది. అంబర్‌పేట, గోల్కొండ, విజయనగర్ కాలనీలోని మైదానాలను దీనికి అధికారులు ఎంపిక చేశారు. త్వరలోనే డిజైన్లు సిద్ధం కానున్నాయి. ఎంపికైన గ్రౌండ్లలో అంబర్‌పేట మైదానం 3.153 ఎకరాలు, గోల్కొండ ఒవైసీ ప్లేగ్రౌండ్ 1.878 ఎకరాలు, విజయనగర్ కాలనీలో 1.853 ఎకరాల్లో ఉంది.