India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ.. రూ.17 కోట్లతో ఐదు డిపోల్లో EV బస్సుల ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే కంటోన్మెంట్లో రూ.కోటీ 24 లక్షలు, మియాపూర్లో రూ.34 లక్షల వ్యయంతో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పూర్తయింది. బీహెచ్ఈఎల్లో రూ.3.9 కోట్లు, HCUలో రూ.2.49 కోట్లు, జేబీఎస్ రూ.9 కోట్లతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పనులు జరుగుతున్నాయి.
GHMC ఆధ్వర్యంలో మొత్తం 521 క్రీడా మైదానాలు,29 స్పోర్ట్స్ కాంప్లెక్సులు,13 ఈత కొలనులు, 5 టెన్నిస్ కోర్టులు, 11 స్కేటింగ్ రింక్స్, 135 వ్యాయామశాలలు పని చేస్తున్నాయి.ఆయా వ్యాయామశాలల్లోని పరికరాలన్నీ తుప్పు పట్టి ఉన్నాయి.కొత్త పరికరాలను కొనుగోలు చేస్తున్నట్టు లెక్కలు చెబుతుంటే..వ్యాయామశాలల్లో మాత్రం అలాంటి వస్తువులేవి కనిపించచడం లేదు.GHMC కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ పట్టాలని ప్రజల కోరారు.
గ్రేటర్ HYD నగరంలో GHMC పరిధిలో క్రీడలను తేలికగా తీసుకుంటుంది.క్రీడల్లో పేద, మధ్య తరగతి యువతకు సరైన ప్రోత్సాహకం కరవవుతోంది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో క్రీడల కోసం కేటాయించిన నిధులను సగం మేర కూడా అధికారులు ఖర్చు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.2021-22 ఆర్థిక సంవత్సరంలో 32.78, 2022-235 64.48, 2023-24లో 38.48శాతం నిధులు ఖర్చయ్యాయి. సమ్మర్ క్యాంపులు సైతం అంతంత మాత్రంగానే జరిగాయి.
✓HYD, RR, MDCL జిల్లాల్లో ఘనంగా జరిగిన బోనాలు
✓సికింద్రాబాద్: క్యూఆర్ కోడ్ ద్వారా గాంధీలో ఓపి
✓కల్వకుర్తి అసెంబ్లీకి రూ.309 కోట్ల నిధుల ప్రకటన
✓సికింద్రాబాద్: TGSRTC ప్రకటనల పై టెండర్లకు ఆహ్వానం
✓అబ్దుల్లాపూర్మెట్: గంజాయి మత్తులో బైకులు తగలబెట్టారు
✓అసదుద్దీన్ కొడంగల్లో పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేస్తాం: బండి
ఢిల్లీ రాజేంద్రనగర్లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా సికింద్రాబాద్కు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
HYD సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. ZPHS యూటర్న్ నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వరకు దాదాపుగా జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు 5 రోజుల పాటు SRDP శిల్ప లేఅవుట్ ఫేజ్-2 వంతెన పనులు జరుగుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పును 3 మీటర్లకు కుదిస్తామన్నారు.కావునా.. కొత్తగూడ నుంచి వచ్చేవారు రోలింగ్ హిల్స్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వైపు వెళ్లాలన్నారు.
కల్వకుర్తి అభివృద్ధికి రూ.309 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కల్వకుర్తి అసెంబ్లీ RR జిల్లా పరిధి మండలాలైన ఆమనగల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు రూ.10కోట్లు, మాడ్గుల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.3కోట్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.7.75 కోట్లు ప్రకటించారు. కల్వకుర్తిలో 50 పడకల మెటర్నిటీ అండ్ చైల్డ్ (MCH) ఆసుపత్రిని రూ.22 కోట్లతో నిర్మిస్తామన్నారు.
HYD నగరం సహా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోగులు, సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వచ్చి వైద్యం తీసుకుంటారు. వైద్యం కోసం వచ్చిన వారు ఓపీ లైన్లో గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది. అలాంటి వారికి అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు.ఇక.. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే ఓపీ టోకెన్ నంబర్ వస్తుందని, తద్వారా కౌంటర్లో ఓపీ రిజిస్ట్రేషన్ ఫామ్ అందిస్తారన్నారు. అనంతరం వెంటనే వైద్యం చేయించుకోవచ్చన్నారు.
హరేరామ, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చ జరిగింది. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
HYD మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువులు కొత్తరూపు దాల్చనున్నాయి. విడతల వారీగా అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇది వరకే 15 చెరువు లను ఎంపిక చేసి కొన్ని పనులు చేపట్టింది.తాజాగా ఏడు జిల్లాల పరిధిలో మరో 45 చెరువులను అభివృద్ధి చేసేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది.HMDA పరిధిలోని అనేక చెరువు ఆక్రమణలు, కలుషిత జలాలు,పూడికతో నిండిపొగా..సర్వేలతో ముందడుగు వేస్తోంది.
Sorry, no posts matched your criteria.