RangaReddy

News April 14, 2025

జూబ్లీహిల్స్ పెద్దమ్మను దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి

image

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

News April 14, 2025

BREAKING.. కుషాయిగూడలో మర్డర్

image

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2025

HYD: పెళ్లి అయిన 3 రోజులకే హత్య (UPDATE)

image

రెయిన్‌బజార్ PS పరిధిలో జరిగిన రౌడీషీటర్ మసీయుద్దీన్‌ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను గుర్తించేందుకు హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ హత్య ఘటనతో ఫలక్‌నుమా ఉలిక్కిపడింది. మసీయుద్దీన్‌కు <<16091246>>3 రోజుల క్రితమే వివాహం<<>> జరిగినట్లు తెలుస్తోంది. నూతన జీవితంలో అడుగుపెట్టిన అతడు హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

News April 14, 2025

HYD: ఇంజినీరింగ్ కాలేజీల్లో రైడ్స్.. టెన్షన్!

image

సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలల నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొంది. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 2 వరకు JNTUH నిజ నిర్ధారణ కమిటీ (FFC) తనిఖీలు నిర్వహించనుంది. ఆయా కళాశాలల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. 120 మంది ప్రొఫెసర్లతో తనిఖీల కోసం 25 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసింది. JNTUH పరిధిలో 137 ఇంజినీరింగ్, 72 ఫార్మసీ, 6 ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News April 14, 2025

సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు.. జూపార్క్ ఓపెన్

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా సాలార్ జంగ్ మ్యూజియానికి అధికారులు సెలవు ప్రకటించారు. యథావిధిగా రేపు ఉదయం టూరిస్టులకు అనుమతి ఉంటుందని అడ్మినిస్ట్రేటివ్, అకౌంట్స్ అధికారి ఘన్ శ్యామ్ కుసుమ్ తెలిపారు. ఇదిలా ఉంటే సాధారణంగా ప్రతి సోమవారం జూపార్క్‌కు సెలవు ఉంటుంది. కానీ, నేడు తెరిచే ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. సందర్శకులు గమనించాలని సూచించారు.

News April 13, 2025

బాలానగర్‌ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

image

బాలానగర్‌లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్‌లో ఉన్న వెహికిల్‌ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 13, 2025

మ్యాచ్ చూడటం ఆనందంగా ఉంది: GHMC మేయర్

image

శనివారం ఉప్పల్ స్టేడియంలో పంజాబ్‌తో SRH మ్యాచ్‌ను చూడటం ఆనందంగా ఉందని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఆ మ్యాచులో అభిషేక్‌శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఎంతో మందికి గుర్తుండిపోతుందన్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు మేయర్‌తో పాటు కే.కేశవరావు వచ్చారు.

News April 13, 2025

HYD: 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్

image

వర్షాలకు ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాన్ని నివారించవచ్చనే ఆలోచనతో ఉన్న GHMC వాతావరణ శాఖ, TGDPSలతో కలిసి సమన్వయంతో పని చేయాలని భావిస్తోంది. వర్షాకాలంలో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు వర్షాకాలంలో సమస్యల పరిష్కారానికి మరికొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలనే యోచనలో అధికారులున్నారు.

News April 13, 2025

HYD: అశ్లీల చిత్రాలు చూస్తున్నారా? జాగ్రత్త..!

image

సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూసినా, ఇతరులకు షేర్ చేసినా శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని HYD టప్పాచబుత్రా పోలీసులు Xలో పోస్ట్ చేశారు. ఇటీవల HYD శివారు మిరుదొడ్డిలో యువకుడు అశ్లీల చిత్రాలు చూస్తూ SMలో పోస్ట్ చేశాడు. గుర్తించిన సైబర్ సెక్యూరిటీ అధికారులు అతడిని రిమాండ్ చేసి.. ఫోన్, సిమ్ స్వాధీనం చేసుకున్నారని అందులో పేర్కొన్నారు. లైక్‌ల కోసం వీటిని పోస్ట్ చేయొద్దని, SMని మంచికోసం వాడాలని సూచించారు.

News April 13, 2025

Orange: HYDలో సరిపోయింది ఈ శనివారం

image

ఈ శనివారం HYD‌ వాసులకు గుర్తుండిపోయే రోజు. వీర హనుమాన్ విజయయాత్ర జరిగిన నగరంలోనే ఆరెంజ్ ఆర్మీ జైత్ర యాత్ర కొనసాగింది. ఉదయం నుంచి ఓ ఆర్మీ జై శ్రీరామ్ నినాదాలతో HYDను హోరెత్తించగా.. మరో ఆర్మీ ఉప్పల్ స్టేడియంలో చెలరేగిపోయింది. ఎటు చూసినా కాషాయజెండాలే దర్శనమిచ్చాయి. భక్తుల పూజలు, హనుమంతుడి అనుగ్రహంతో ఆరెంజ్ ఆర్మీ ఘన విజయం సాధించిందని హైదరాబాద్ ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?