India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చర్లపల్లి రైల్వే టర్మినల్ చుట్టూ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఆయా ప్రాంతాల్లో పదేపదే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కిక్కిరిసిన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అద్భుతంగా నిర్మించిన చర్లపల్లి టర్మినల్, మెరుగైన సేవలు అందించాలంటే, చుట్టూ ఉన్న రోడ్ల అభివృద్ధితో పాటు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
HYDలో మరో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం HYD అంబర్పేటలోని తన నివాసంలో భాను శంకర్ ఉరి వేసుకున్నాడు. అయితే, భానుశంకర్ వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత వారం వ్యవధిలోనే ముగ్గురు పోలీసులు HYDలోనే సూసైడ్ చేసుకోవడం గమనార్హం. అయితే, భాను శంకర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్ చెక్ పోస్టు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. TVS వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్ సాయంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీఎంఆర్ కళాశాల హాస్టల్ బాత్రూంలో వీడియోల చిత్రీకరణ కేసులో మేడ్చల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కళాశాల నిర్వాహకులతో పాటు హాస్టల్ వార్డెన్లపై పోక్సో చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విద్యార్థినులు బాత్రూంలో స్నానం చేస్తుండగా చూసేందుకు ప్రయత్నించామని నందకిషోర్ (A1), గోవింద్ కుమార్(A2) ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
RR,MDCL,VKB జిల్లాల్లో 10 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ప్రభుత్వ పథకాల కోసం భూమిని ముక్కలుగా చేసి కొడుకు, బిడ్డ, భార్య, పేర్ల మీద భూ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. దీంతో రాష్ట్ర జనాభా సరాసరి 2015లో ఒక్కో వ్యక్తికి ఒక హెక్టారు భూమి ఉండాల్సి ఉండగా 2022 నాటికి అది 0.89 హెక్టార్లకు తగ్గింది. ప్రభుత్వ పథకాలకు కట్ ఆఫ్ పెట్టినా, డోకా లేకుండా చూసుకుంటున్నారు.
HYD సహా శివారులోని కొన్ని చెరువులను కబ్జాకోరులు కనీసం చెరువు జాడ దొరకకుండా మింగేశారు. NRSC ద్వారా 2014 తర్వాత అంతకు ముందు ఉన్న శాటిలైట్ చిత్రాలతో పలు విషయాలను వెల్లడించింది. 2014 వరకు ఆక్రమణ కాకుండా పుప్పాలగూడ చెరువు-9.25 ఎకరాలు, బుద్వేల్ 6.39, బాచుపల్లి 2.1, కుంట్లూరు 1.62 ఎకరాల చెరువులు ఉన్నాయని, కానీ.. 2014 తర్వాత పూర్తిగా జాడ లేకుండా కనుమరుగైనట్లు తెలిపింది.
HYD నగరంలోని OU, JNTUH, జయశంకర్ యూనివర్సిటీ, IIITH, IITH, HCU యూనివర్సిటీలో రీసెర్చ్పై విశ్వవిద్యాలయాల ఫోకస్ పెట్టాయి. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 2022-23 నుంచి ఇందుకు బాటలు పడ్డాయి. IITH-79.77 కోట్లు, HCU-65.09, IIITH-33.55, అగ్రికల్చర్ యూనివర్సిటీ-21.36, OU-24.75, JNTUH-28.83 కోట్ల సెర్చ్ గ్రాంట్లే ఇందుకు నిదర్శనం.
మాజీమంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై Xలో మండిపడ్డారు. అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా, రైతు భరోసాలో ప్రభుత్వం రైతునే కాంగ్రెస్ మాయం చేసిందన్నారు. మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్.. మోసానికి మారు పేరని పేర్కొన్నారు. ఢోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్ అని రైతుద్రోహి సీఎం రేవంత్ అని రాసుకొచ్చారు.
ప్రజా సమస్యలను సమర్థంగా పరిష్కరించేలా ప్రమాణాలు రూపొందించాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మరింత ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ప్రజలు సురక్షితంగా నివసించే ప్రాంతంగా సైబరాబాద్ను మార్చాలన్నారు.
ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. పీయూఎన్ వర్మ, అమరవాణి ఫౌండర్ డాక్టర్ మదన్ మహరాజ్ గోసావి ఆధ్వర్యంలో రాజభవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ భారతీయ సంస్కృతి సమ్మేళన్ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సనతాన ధర్మం అంటే ఎప్పటికప్పుడు తమలోని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ కాలంతో పాటు ధర్మాన్ని ఆచరించడమేనని అన్నారు.
Sorry, no posts matched your criteria.