India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థులు రోడ్డు ప్రమాదాలు గురికాకుండా పాఠశాలలు, కళాశాలల వద్ద సైన్ బోర్డులు, రంబుల్ స్టిక్స్ ఏర్పాటు చేయాలని HYD జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డీఈవోను ఆదేశించారు. ఈమేరకు రవాణా, డీఈఓ, జీహెచ్ఎంసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ శాఖల అధికారులతో రోడ్డు భద్రత మాసోత్సవాలపై సమీక్షించి తగు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత పై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. రాణిగంజ్లోని బుద్ధ భవన్లో ఉన్న హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు.. మధ్యాహ్నం 3 గం. నుంచి సాయంత్రం 5:30 గం. వరకు నేరుగా లేదా, 040-29565758, 29560596 నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సంబంధిత కోర్సుల శిక్షణకు అమీర్పేట అడ్డాగా మారింది. 1992 నుంచి ఇక్కడ ఐటీ శిక్షణ కొనసాగుతోంది. పైథాన్, డాట్ నెట్, డిజిటల్ మార్కెటింగ్, జావా, సీ ప్లస్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్ వంటి విభిన్న కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన ఎంతో మంది ఐటీ కొలువుల్లో రాణిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
HYDలో మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డీజీపీ జితేందర్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిశారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైడ్రా తీసుకోబోయే చర్యలపై విస్తృతంగా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. చట్టపరంగానే చెరువులు, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పిస్తామన్నారు.
నగరానికి ప్రస్తుతం మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి నీటి సరఫరా జరుగుతోందని జలమండలి తెలిపింది. గోదావరి ఫేజ్-2 ద్వారా మరిన్ని నీటిని తరలించి ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టు రూపు దిద్దుకుంటుందని పేర్కొంది. మరోవైపు జలమండలి నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఆదాయం పెంచడంపై దృష్టి సారించనుంది.
ప్రస్తుతం HYD జనాభాకు సరిపడేలా తాగునీటి సరఫరా చేస్తున్నామని జలమండలి అధికారులు తెలిపారు. నీటి సరఫరాకు నగరంలో మొత్తం 9,800 కిలోమీటర్ల మేర డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో 13.79 లక్షల కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్టు సీఎం సమావేశంలో అధికారులు వివరించారు. పలు అంశాలపై ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం జరిపించనున్నారు.
HYD ORR చుట్టూ నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్ర మణిహారంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. RRR భూ సేకరణలో అటవీ భూముల్లో ఉన్న సమస్యలపై సంబంధిత మంత్రితో సమన్వయంతో ముందుకెళ్లాలని, ప్రత్యేక సమావేశంలో సీఎం తెలిపారు.
2050 నాటికి HYDలో పెరిగే జనాభాకు తగ్గట్టు తాగు వాటర్, సీవరేజ్ ప్లానింగ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. HYDకు తాగునీటి సరఫరాలో భాగంగా రిపోర్టు ప్రకారం.. మల్లన్నసాగర్ నుంచి గోదావరి ఫేజ్-2 ద్వారా గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులుగా, 20 టీఎంసీల నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు.
స్టేడియంలో వీల్ చైర్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్, సిట్టింగ్ వాలీబాల్ క్రీడోత్సవాలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. పారా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి ప్రతిభను బయటకు తీసి, దేశవ్యాప్తంగా జరిగే పోటీల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. మాదాపూర్లో డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో సుమారు 1,800 మందికి ఉపాధి కల్పిస్తున్న సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.