RangaReddy

News July 27, 2024

HYD: మహిళపై అత్యాచారం.. నటుడిపై కేసు

image

పెళ్లి పేరుతో నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడిన నటుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు..శ్యామ్‌లాల్ బిల్డింగ్స్ సమీపంలో నివసించే మహిళ(34)కు నటుడు అమన్ సింగ్(27)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2023OCTలో మహిళను తన ఫ్లాటుకు పిలిచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లిచేసుకోమనగా తప్పించుకొని తిరగడంతో బాధితురాలు శుక్రవారం PSను ఆశ్రయించింది.

News July 27, 2024

HYD: ప్రజావాణికి 681 దరఖాస్తులు

image

HYD ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 681 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూకు సంబంధించినవి 69, పౌరసరఫరాల శాఖవి 132, విద్యుత్‌ 87, హౌసింగ్‌ 232, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి 31, ఇతర శాఖలకు సంబంధించినవి 130 దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య దరఖాస్తులు స్వీకరించారు.

News July 27, 2024

98% చర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తి: కిషన్ రెడ్డి

image

HYD చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రూ.434 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ స్టేషన్ రాష్ట్రంలోనే నాలుగో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా అవతరించబోతుందని వెల్లడించారు. కానీ.. ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేదు. దీంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

News July 27, 2024

HYD: RRR ఉత్తర భాగానికి NH-161AA నంబర్!

image

HYD నగర శివారు RRR ఉత్తర భాగానికి రాష్ట్రంలోని NHAI సంస్థ NH-161AA నంబరును తాత్కాలికంగా కేటాయించినట్లు తెలిపింది. RRR ఉత్తరభాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, జగదేవ్‌పూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఆరు ప్యాకేజీల్లో 161KM మేర కొనసాగునుంది. దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఆమనగల్, షాద్‌నగర్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు 189KM నిర్మాణం కానుంది.

News July 27, 2024

HYD: జీరో అవర్‌లో ఫిర్యాదు చేస్తే.. డబ్బు సేఫ్

image

సైబర్ నేరాన్ని గుర్తించి వెంటనే జీరో అవర్‌లో ఫిర్యాదు చేస్తే డబ్బులు సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని HYD సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇటీవల జీరో అవర్‌లో అందిన ఫిర్యాదుల్లో మొత్తం 5 కేసుల్లో రూ. 46 లక్షలకు పైగా వాపస్ చేశారు. 1930, సైబర్ క్రైమ్ పోర్టల్, సైబర్ PSకు ఫిర్యాదు చేస్తే వెంటనే బ్యాంకుల్లో డబ్బులు సీజ్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

News July 27, 2024

గ్రేటర్ HYD పరిధిలో మ్యాన్ హోల్ లెక్కలు

image

గ్రేటర్ లోతైన మ్యాన్ హోల్స్ 63 వేలకు పైచిలుకు ఉన్నట్లు అధికారిక యంత్రాంగం వెల్లడించింది.HYD పరిధిలో మొత్తం సీవరేజ్ లైన్ వ్యవస్థ 5,767 కిలోమీటర్ల మేర ఉంది. నగర శివారు మున్సిపాలిటీల్లో సుమారుగా 4,200 కిలోమీటర్ల వ్యవస్థ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా మొత్తంగా 6,34,919 మాన్ హోల్స్ ఉన్నాయి.

News July 27, 2024

HYD: త్వరలో రెడ్ కేటగిరీ పరిశ్రమల PCB రిపోర్ట్!

image

రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(PCB) పరిశ్రమల్లో విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలకు చెక్ పెట్టటం కోసం ప్రతినెలా రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో తనిఖీలు చేస్తోంది. జులైకి సంబంధించి తనిఖీ చేయాల్సిన 26 పరిశ్రమలు రాజధాని పరిధిలోనే ఉండగా..వాటిల్లో ప్రభుత్వ పరిశ్రమలు కూడా ఉన్నాయి. మల్కాజ్గిరి-15, HYD-5, RR-6 పరిశ్రమల్లో తనిఖీ జరగనుంది. త్వరలోనే రిపోర్టు విడుదల చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు.

News July 26, 2024

ఉప్పల్: రీసెర్చ్ అంశంపై నోటిఫికేషన్ జారీ..!

image

ఉప్పల్‌లోని రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్ సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. Ph.D పూర్తి చేసిన వారితో పాటు, థీసిస్ సమర్పించిన వారు వీటికి అర్హులు కాగా, ఆగస్టు 7లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మాలిక్యూలార్ మైక్రోబయాలజీ, సెల్ బయాలజీ, మాలిక్యూలార్ సిగ్నలింగ్, మమేలియన్ సెల్ సిగ్నలింగ్, జెనోమిక్ అనాలసిస్ రీసెర్చ్ అంశాలపై అవకాశం ఉందన్నారు.

News July 26, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓రాజేంద్రనగర్: MEIT కాలేజీలో ర్యాగింగ్..ఐదుగురు అరెస్ట్✓వట్టినాగులపల్లి: ఫైర్ మాన్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో సీఎం ✓మొగల్ పుర: యువతిని భయపెట్టి పరారైన యువకుడు పై కేసు ✓HYD: మహిళలకు రూ.2,500 ఇవ్వాలని బీజేపీ నిరసన✓లాల్ దర్వాజా సింహ వాహినికి దీపోత్సవం ✓కూకట్పల్లి కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రమాదం✓HYD కోర్ సిటీ సౌత్ జోన్లో 28, 29న వైన్స్ బంద్

News July 26, 2024

RR: డిజిటల్ క్రాప్ సర్వే.. పంట వివరాలు ఆన్ లైన్లో..!

image

RR, MDCL,VKB జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు కసరత్తు జరుగుతుంది. గతంలో రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద 16 మండలాల్లో డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి చేశారు. పంట ఫొటో, రైతు ఫొటో తీసి యాప్‌లో అప్లోడ్ చేయనున్నారు. తద్వారా ఎవరు ఏ పంట..? ఎంత విస్తీర్ణంలో..? పండించారనేది లెక్క తేలనుంది. కేంద్ర ఆదేశాలతో ఇప్పటికే రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతోంది.