India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD కమిషనరేట్ పరిధి సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్లో పాతబస్తీ బోనాల సందర్భంగా ఈ నెల 28 ఉ.6 గంటల నుంచి 29 ఉ.6 గంటల వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసి ఉంటాయని HYD సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. HYD కోర్ సిటీ సౌత్ జోన్ ప్రాంతంలో మాత్రం ఈ నెల 28 ఉ.6 నుంచి 30 ఉ.6 వరకు బంద్ కొనసాగుతుందని చెప్పారు.
గ్రేటర్ HYDలో చిన్నారుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కుక్కలు దాడి చేస్తుండగా మరోవైపు కామాంధులు అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారం చేస్తున్నారు. ఇటీవల పిల్లలపై కుక్కల దాడులు, అత్యాచారాల ఘటనలు పెరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. తమ పిల్లలను బయటకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వికారాబాద్ రైతుబజార్ దగ్గర ఓ రైతు పరిస్థితి కన్నీరు తెప్పిస్తోంది. కొత్తిమీర మూట తీసుకొని రోడ్డు మీద కూర్చొన్న ఆ పెద్దాయన.. నాలుగు రూపాయలు వస్తాయేమోనని ఆశతో వర్షంలోనే ఉండిపోయాడు. తాను పండించి, తెంపుకొచ్చిన ఆకు కూర వృథా అయితే నష్టపోతానని కష్టమైనా భరించాడు. ఓ వైపు తడుస్తూనే తన చిరు వ్యాపారం కొనసాగించాడు. సదరు రైతుకు కనీసం గొడుగు కూడా లేదు. అతడి కష్టం చూసిన స్థానికులు చలించిపోయారు.
HYD శంషాబాద్లో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెస్ట్ బెంగాల్కు చెందిన నారాయణ్, రిమి దంపతులకు 8 నెలల కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో ఆ శిశువు బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం పట్నా నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్తున్నారు. శిశువు అస్వస్థతకు గురికాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే చనిపోయాడని చెప్పడంతో తల్లి బోరున విలపించింది.
HYD శంషాబాద్లో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెస్ట్ బెంగాల్కు చెందిన నారాయణ్, రిమి దంపతులకు 8 నెలల కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో ఆ శిశువు బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం పట్నా నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్తున్నారు. శిశువు అస్వస్థతకు గురికాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే చనిపోయాడని చెప్పడంతో తల్లి బోరున విలపించింది.
గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పుడున్న ఛార్జింగ్ స్టేషన్లకు అదనంగా మరో 100 స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వివరాలు, వాటి వినియోగం కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. సంప్రదాయేతర, కాలుష్య రహిత విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన విద్యుత్ విధానాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం వెల్లడించింది.
HYDలోని మెట్రో రైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి, 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం రూ.24,042 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం రెండోదశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్లో ప్రసంగంలో పేర్కొన్నారు.
విధి నిర్వహణలో చర్యలు తీసుకోవడమే కాదు.. ఆపద వస్తే చలించిపోతామని అల్వాల్ ట్రాఫిక్ ACP వెంకటరెడ్డి నిరూపించారు. ఇటీవల సుచిత్ర వద్ద రాంగ్ రూట్లో వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ సిబ్బంది చలానాలు వేస్తున్నారు. ఓ డెలివరీ బాయ్ తప్పించుకునేందుకు హడావుడిగా వెళ్తూ మరో వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇతర వాహనదారుడు కింద పడిపోయాడు. క్షతగాత్రుడికి ACP సపర్యలు చేశారు. ఆయన సేవల పట్ల ప్రశంసలు వెల్లువెత్తాయి.
HYDలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ వద్ద పని చేసే ముత్తుస్వామి(35)తో ఓ గుర్తుతెలియని వ్యక్తి గొడవపడ్డాడు. మాటామాట పెరగగా క్షణికావేశంలో ఆ వ్యక్తి ముత్తుస్వామి తలపై బండరాయితో కొట్టి చంపాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి పరిశీలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అగ్నిమాపక శాఖలో కొత్తగా చేరి శిక్షణ పూర్తి చేసుకున్న 483 ఫైర్ మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్ నేడు జరగనుంది. వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక శాఖ శిక్షణ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఇటీవల డ్రైవర్, ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన 157 మంది అభ్యర్థులు కూడా సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకుంటారని అగ్నిమాపక శాఖ డీజీ వై.నాగిరెడ్డి తెలిపారు.
Sorry, no posts matched your criteria.