India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లగచర్ల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రధాన సూత్రధారి సురేష్ ,శివకు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. మిగతా నిందితులకు సంబంధించి మాంగ్యా నాయక్, లోక్యా నాయక్ కస్టడీ విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇద్దరు నిందితుల తరుపున కౌంటర్ ధాఖలు న్యాయవాది వేశారు. కౌంటర్ పై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి.
రాష్ట్రంలో ప్రమాణ పత్రం ఇస్తేనే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. అదేం దిక్కుమాలని రూల్ అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రైతు శాసించేలా కేసీఆర్ చూశారని.. నేడు రైతులు యాచించేలా కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే రైతుబంధు ఒక సీజన్ ఎగ్గొట్టారని.. అది కూడా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులు టీజీఎస్పీలో చేరారని తెలంగాణ డీజీపీ జితేందర్ అన్నారు. ఒకరు నిఖత్ జరీన్, మరొకరు మహమ్మద్ సిరాజ్ అని చెప్పారు. వీళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నామని, పోలీస్ ట్రైనింగ్లో భాగంగా బాక్సింగ్, క్రికెట్పై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆటగాళ్లను కూడా తయారు చేయాలన్నది ఆశయంగా పెట్టుకున్నామన్నారు.
మూసీ పరివాహాక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల ప్రకారం మొత్తం 12 హాట్ స్పాట్ కాలుష్య ప్రాంతాలను గుర్తించింది. HYD-2,MDCL-1,RR-2, యాదాద్రి-3, సూర్యాపేట-2, నల్గొండ-2 ఉన్నట్లుగా తెలిపింది. అంటే HYD బయట నుంచి వచ్చే పరిశ్రమలతో మూసీ కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నట్లు గుర్తించింది. త్వరలోనే లిస్టు విడుదల చేస్తామని పేర్కొంది.
HYD బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో నేడు సావిత్రిబాయి ఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా MLC మధుసూదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్యను బలోపేతం చేసేందుకు ఆమె చేసిన త్యాగాలను గుర్తుచేశారు. BRS నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో రోజురోజుకు పెళ్లిళ్ల ఖర్చు అమాంతం పెరుగుతోంది. ఓ సర్వే ప్రకారం వివాహ ఖర్చు నగరంలో రూ.30 లక్షల నుంచి రూ.కోటికి పైగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఏడాదికి దాదాపు 30% పెరుగుతోందని కాన్ఫరెన్స్ ట్రేడర్స్ సర్వే తెలిపింది. పెళ్లి ఖర్చుకు సంపన్నులు సహా, మధ్యతరగతి వారు సైతం వెనకాడటం లేదని పేర్కొంది.
HYD రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మార్చాలని BJP నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం టెండర్లు పిలవడం శుభపరిణామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం RRR నార్త్ అలైన్మెంట్ మార్పు చేయాలని, లేదంటే బాధితుల పక్షాన ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉండనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జల మండలి బోర్డు మీటింగ్కి హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సెక్రెటేరియట్లో రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం సమీక్ష ఉండనుంది.
గ్రేటర్ హైదరాబాద్లో 2024లో 6 డివిజన్లలో 20 సెక్షన్ల నుంచి అత్యధికంగా ట్యాంకర్లు బుక్ అయ్యాయని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. గత వేసవిలో 100 కుటుంబాలు 31,000 ట్రిప్పులు బుక్ చేయగా, 40,000 కుటుంబాలు 70% ట్యాంకర్లు వినియోగించుకున్నాయి. సర్వే ప్రకారం, 18,000 కుటుంబాలకు ఇంకుడు గుంతలు ఉన్నాయి. నీటి కొరత కారణాలు గుర్తించి పరిష్కారాలు సూచించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్లో జలమండలి ఫిర్యాదులపై విశ్లేషణ జరిపామని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలు చేసేందుకు నిర్వహించిన మూడేళ్ల విశ్లేషణపై రిజల్ట్ వివరించారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లలో లీకేజీ, రోడ్లపై సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే రావడంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
Sorry, no posts matched your criteria.