India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరం నుంచి MGBS, JBS, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ క్రాస్ రోడ్డు, గచ్చిబౌలి, ఆరాంఘర్, బోయిన్పల్లి తదితర ప్రాంతాల నుంచి సంక్రాంతికి నేటి నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. వరంగల్, హనుమకొండ, నల్గొండ, మంచిర్యాల, భూపాలపల్లి లాంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల వివరాలు తెలుసుకునేందుకు 040-69440000, 040-23450033కు కాల్ చేయాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
పరిగి మున్సిపాలిటీలోని ఆరు, నార్సింగిలోని ఒకటి శంషాబాద్లో ఒక గ్రామాన్ని మహబూబ్నగర్ కార్పొరేషన్లో చేర్చనున్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ కార్పొరేషన్ విస్తరణలో RR, VKB జిల్లాకు చెందిన ప్రాంతాలు సైతం కలపనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఆయా మున్సిపాలిటీల్లో గ్రామల సంఖ్య తగ్గనుంది.
రాచకొండ CP సుధీర్ బాబు సూచనల మేరకు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజల ఆస్తి రక్షణకు చిట్కాలను విడుదల చేశారు. ప్రజలు తమ విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి. ఇంటిలో CC కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, అలారమ్ వ్యవస్థలు అమర్చుకోవాలి. అల్మారాలు, లాకర్ల తాళాలు కనిపించని ప్రదేశాల్లో దాచాలి. ఇంట్లో కొన్ని లైట్లు ఆన్లో ఉంచడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని CP తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి RRR రమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ BRS ప్రభుత్వం 6 సంవత్సరాలు మొద్దు నిద్రపోయిందని విమర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని, ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో పనులపై వేగం పెరిగినట్లుగా తెలిపారు. RRR నిర్మాణంతో HYD రూపురేఖలు అద్భుతంగా మారుతాయని పేర్కొన్నారు.
మాదాపూర్లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న గాంధీ శిల్ప బజార్, సంక్రాంతి సంబరాల సందర్భంగా.. డెవలప్మెంట్ అఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ కమిషనర్ ఏర్పాటు చేసిన హస్తకళ ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నిర్వాహకులు మట్టి బొమ్మలు, పాత్రలు, కొండపల్లి బొమ్మలు, గుజరాతి బ్యాగులు, పాలరాయి బొమ్మలు, వెదురు బుట్టలు, పెయింటింగ్స్ హస్తకళ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. స్టాళ్ల వద్ద సందర్శకుల సందడి నెలకొంది.
సంక్రాంతి ఫెస్టివల్ పురస్కరించుకొని సికింద్రాబాద్ జేబీఎస్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించారు. 3 రోజులపాటు జరగనున్న ‘యువర్ టైం ఆన్ మై మెట్రో’ ప్రోగ్రాంలో సంక్రాంతి వేడుకలు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన రైలుకు పచ్చ జెండా ఊపారు. రాష్ట్ర సాంస్కృతి, కళలు కంటి ముందు కనపడేలా మెట్రో క్యాంపెయిన్ జరుగునుంది.
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద పదోన్నతులు కల్పించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అధ్యాపకులు ఈ నెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో కలిసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందేందుకు అవకాశం ఉంటుంది.
HYDలో రూ.3619 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్లు, రూ.1487 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.1,900 కోట్ల భూసేకరణ పరిహారానికి వెచ్చించనున్నారు. మరోవైపు రూ.4,000 కోట్లతో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లకు సంబంధించిన భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసి సర్వే ప్రకారం పూర్తి చేశారు.
రేపటి నుంచి సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపింది. జనవరి 10, 11,12,19,20 తేదీల్లో స్పెషల్ బస్సుల్లో రాష్ట్ర ప్రభుత్వ జీవో 16 ప్రకారం 50% వరకు ఛార్జీల పెంపు అమలులో ఉంటుందని పేర్కొంది. HYDలో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.
ఛార్జింగ్ ట్రై సైకిల్లకు అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగే తెలిపారు. సదరం సర్టీపికేట్ ఉండి, 80% శారీరక వైకల్యం, యూఐడి కార్డు, రేషన్ కార్డు, ఆధార్కార్డు ఉన్న దివ్యాంగులు అర్హులుగా తెలిపారు. 2పాస్ ఫోటోలు వికాలాంగులుగా గుర్తించే పూర్తి డాక్యుమెంట్స్ ఈ నెల 18లోపు 33 జిల్లాల అధ్యక్షులు 10మంది పేర్లు తయారు చేసి పంపించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.