India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి తెలంగాణ గురుకుల పాఠశాలలో 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఫిబ్రవరి 23వ తేదీ లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.
✓జీడిపప్పు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది✓చర్మ సంరక్షణకు దోహదపడుతుంది✓మెదడు పనితీరును సైతం మెరుగుపరుస్తుంది ✓కంటి చూపును సైతం మెరుగుపరిచే శక్తి ఉంది✓ఎముకలు బలంగా ఉండటానికి సహకరిస్తుంది✓రక్తంలోని చక్కర స్థాయిలను సైతం కంట్రోల్ చేస్తుంది. •జీడిపప్పు తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని TGFPS-RR అనేక తెలిపారు.
HYD మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో 1,500 నుంచి 2,000 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో పలు దఫల్లో వేలం వేసినా మిగిలిపోయాయి. అయితే తాజాగా..మరోసారి వేరే వేయాలని నిర్ణయించారు. 8-14 అంతస్తుల అపార్ట్మెంట్ టవర్ల నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది. దీంతో రాజీవ్ స్వగృహ ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
HIV/AIDS వచ్చిన వారిపై ఉద్యోగ స్థలంలో వివక్ష చూపి, వెలివేస్తే చట్టపరకారంగా జైలు శిక్ష ఉంటుందని HYD, MDCL TGSACS అధికారులు హెచ్చరించారు. HIV/AIDS నివారణ, నియంత్రణ చట్టం 2017 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. AIDS ఉన్నవారితో మాట్లాడడం, కలిసి భోజనం చేయడం, కలిసి ఉద్యోగం చేయడం వల్ల మరొకరికి సోకదని, కేవలం అసురక్షితమైన లైంగిక కలయికతో మాత్రమే వస్తుందని తెలిపారు.
HYD శివారు ORR బయట RRR ఉత్తర భాగాన్ని 5 ప్యాకేజీలుగా 160 కిలోమీటర్లను నిర్మించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. రూ.7104 కోట్లతో ఈ నిర్మాణం జరగనుంది. ఇప్పటికే మార్కింగ్ పనులు జరిగాయి. టెండర్ బిడ్ల దాఖలు గడువు ఫిబ్రవరి 14 వరకు ఉన్నట్లుగా తెలిపారు. 17వ తేదీన టెండర్లను తెరువనున్నారు. మరోవైపు దక్షిణ భాగంపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
✓పొగమంచులో వేగం తగ్గించి వాహనం నడపండి
✓హై బీమ్ బదులు,లో బీమ్ హెడ్ లైట్ వాడండి
✓కార్లలో ఏసీ ఆన్ చేసి ఉంచుకోండి
✓ఓవర్ టేక్ చేయడం బంద్ చేయండి
✓జంక్షన్లు, టర్నింగ్ పాయింట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలి
✓సైకిలిస్టులు, పాదచారులను గమనించండి
✓పొగమంచు అధికంగా ఉన్నప్పుడు ప్రయాణానికి దూరంగా ఉండటం మంచిది
✓పొగమంచులో డ్రైవింగ్ చేసినప్పుడు ఈ సూచనలు పాటించాలని రాచకొండ పోలీసులన్నారు.
మాదాపూర్లోని శిల్పారామంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నాట్య గురువు నిర్మల విశ్వేశ్వర్ రావు శిష్యబృందం చేసిన నృత్యాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కళాకారులు సనాతన నర్తన గీతం, పుష్పాంజలి, భజమానస, గీతం, చక్కని తల్లికి, రామ గీతం, తాండవ నృత్యకారి, తరంగం, మంగళం తదితర అంశాలను ప్రదర్శించి అలరించారు.
గ్రేటర్ HYD నగర వ్యాప్తంగా దుకాణ,వ్యాపార సముదాయాలు ఉన్నవారు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ తెలిపింది. జనవరి 31వ తేదీ వరకు మీసేవ, ఆన్లైన్ పద్ధతుల్లో దరఖాస్తు చేసుకుని పొందొచ్చన్నారు. అంతేకాక ఫీజు పెండింగ్ సైతం 31 తేదీలోపు చెల్లించాలని, లేదంటే తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించడంలేదని సర్పంచుల సంఘం JAC నిరసన తెలిపింది. అనంతరం నాంపల్లిలోని TG ఎన్నికల కమిషనర్కి వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య, కార్యదర్శి నాగయ్య పాల్గొన్నారు.
HYDలో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ వార్షిక రిపోర్టులో కీలక విషయాలు తెలిపింది. 2024లో రాష్ట్రంలో జైలుకెళ్లిన వారిలో 750 మంది గ్రాడ్యుయేషన్, 225 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేసినట్లుగా పేర్కొంది. జైళ్లలో ఉండి చదువుకోవాలనుకున్న వారికి చెంగిచెర్ల, చర్లపల్లి, సంగారెడ్డి జిల్లాలోని జైళ్లలోనూ అవకాశం కల్పించారు.
Sorry, no posts matched your criteria.