RangaReddy

News January 2, 2025

ఎల్బీనగర్: ట్రాఫిక్ ఉల్లంఘన జరిగింది ఇక్కడే!

image

HYD, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనల్లో +80.53 శాతం ఓవర్ లోడు, అధిక ప్యాసింజర్లను తీసుకెళ్లడమే అని వార్షిక రిపోర్టు తెలిపింది. +58.47 శాతం మైనర్ల డ్రైవింగ్ చేసి, ట్రాఫిక్ నియమ నిబంధనలను వాహనదారులు ఉల్లంఘించినట్లుగా వెళ్లడైంది. ఓవర్ లోడింగ్ వద్దని, అత్యధిక ప్యాసింజర్లను వాహనాలు ఎక్కించుకోవద్దని తద్వారా ప్రమాదాలు జరిగా అవకాశం ఉందని పోలీసులన్నారు.

News January 2, 2025

HYD: 50 శాతానికి పైగా పిల్లల్లో ఐరన్ లోపం

image

HYD, RR, MDCL జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 50% పైగా ఐరన్ లోపంతో అనీమియా బాధితులుగా ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. హిమోగ్లోబిన్ సైతం సంపూర్ణంగా లేదని, విద్యార్థుల్లో రక్తహీనత ఉన్నట్లుగా గుర్తించినట్లు డా.ఉషా తెలిపారు. 5 నుంచి 8వ తరగతి మధ్య ఉన్న పిల్లలకు సైతం ఐరన్ లోపం ఉన్నట్లు తెలిపారు.

News January 2, 2025

HYD: 16 లక్షలకు పైగా ట్యాంకర్లతో నీటి సరఫరా!

image

గ్రేటర్ HYDలో జలమండలి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. ట్యాంకర్లు, డ్రైవర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, పాయింట్లు ఇచ్చినట్లు పేర్కొంది. జల మండలి పరిధిలో దాదాపు 733కి పైగా ట్యాంకర్లు, 78 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. 2024 జనవరి 1 నుంచి మొత్తం 16,43,660 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశారు. ఎప్పటికప్పుడు లీకేజీలను పరిశీలిస్తున్నారు.

News January 2, 2025

HYD: JAN-3 నుంచి నుమాయిష్.. చరిత్ర ఇదే!

image

HYD నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈనెల 3న 84వ నుమాయిష్ ప్రారంభం కానుంది. రాష్ట్ర ఎకనామిక్ సర్వే నిర్వహించడం కోసం ఉస్మానియా విద్యార్థుల ఆధ్వర్యంలో 1938లో దీన్ని ప్రారంభించారు. ఆనాటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సైతం సపోర్ట్ చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఆనాడు ప్రారంభమైన నుమాయిష్, ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా పేరొందింది.

News January 2, 2025

ALERT హైదరాబాద్.. పెరుగుతున్న క్యాన్సర్!

image

HYD నగరం సహ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రి డాక్టర్ల ఆదేశాల మేరకు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాల్లో వచ్చి పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. RR, MDCL, VKB జిల్లాల్లోనూ ఇప్పటికే పలువురికి పరీక్షలు నిర్వహించారు. మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.

News January 2, 2025

HYD: రూ.3,805 కోట్ల మద్యం తాగేశారు..!

image

హైదరాబాద్‌లో డిసెంబర్ 30, 31న వైన్స్ వద్ద మద్యం ప్రియులు భారీ క్యూ లైన్లలో నిలుచుని ఉండగా చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో రూ.3,805 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. డిసెంబర్ 23 నుంచి 31 మధ్య రూ.1700 కోట్ల ఆదాయం వచ్చిందని, గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లు అధికమని తెలిపింది. అధికంగా డిసెంబర్ 30న రూ.402 కోట్లు, 31న రూ.282 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొంది.

News January 2, 2025

తార్నాక: NIN డైరెక్టర్‌గా డా.భారతి కులకర్ణి బాధ్యతలు

image

తార్నాకలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(NIN) కొత్త డైరెక్టర్‌గా డా.భారతీ కులకర్ణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె 20 సంవత్సరాలపైగా ఐసీఎంఆర్లో సైంటిస్ట్‌గా పనిచేశారు. గత మూడు సంవత్సరాలుగా న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో శిశు ఆరోగ్యం, పోషకాహార విభాగానికి అధిపతిగా  పనిచేస్తున్నారు. ఈమె పూణే విశ్వవిద్యాలయం నుంచి పీడియాట్రిక్స్ పట్టా పొందారు.

News January 2, 2025

HYD: MNJ ఆస్పత్రికి రోగుల తాకిడి

image

రెడ్ హిల్స్‌లోని MNJ క్యాన్సర్ ఆస్పత్రికి రోజురోజుకు రోగుల తాకిడి పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏటా సుమారు 1500 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, మరో 1200 వరకు గర్భాశయ క్యాన్సర్ వచ్చిన వారు సంప్రదిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఎక్కువమంది వ్యాధి ముదిరే దశలో వస్తున్నారని, మొదటి దశలో వస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు.

News January 2, 2025

హైదరాబాద్‌లో 81 లక్షల చలాన్లు..!

image

HYD, CYB, RCK ట్రై కమిషనరేట్ల పరిధిలో 2024లో ట్రాఫిక్ చల్లాన్ల సంఖ్య 81,19,743గా నమోదయింది. ఇందులో వివిధ ఉల్లంఘనల్లో పెరుగుదల గుర్తించారు. మొబైల్ ఫోన్ డ్రైవింగ్ 34.54%, సిగ్నల్ జంపింగ్ 25.34%, మద్యం సేవించి డ్రైవింగ్ 18.53%, నో హెల్మెట్ డ్రైవింగ్ 17.88%, ట్రిపుల్ బైక్ రైడింగ్ 7.84% పెరిగాయని వార్షిక రిపోర్టులో వెళ్లడైంది.

News January 2, 2025

సికింద్రాబాద్: 2024లో 1,194 కిలోల గంజాయి పట్టివేత

image

2024లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పరిధిలో 1,194 కిలోల గంజా‌ను పట్టుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసు(GRP) అధికారులు రూ.2.98 కోట్ల విలువైన గంజాయిగా గుర్తించారు. 38 కేసులలో 53 వ్యాపారులు అరెస్టయ్యారని SP చందన తెలిపారు. జీఆర్పీ పోలీస్ స్టేషన్ గంజాయి రవాణాపై నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది.