RangaReddy

News July 24, 2024

హైదరాబాద్‌కు ఎందుకు ఇవ్వరు: CM రేవంత్

image

అమరావతి‌ నిర్మాణం కోసం రూ. వేల కోట్లు ఇస్తున్న కేంద్రం హైదరాబాద్‌‌కు నిధులు ఎందుకు ఇవ్వలేదని CM రేవంత్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. HYD మెట్రో విస్తరణ, మూసీ డెవలప్‌మెంట్, RRR ప్రాజెక్ట్‌కు ఏమీ ఇవ్వలేదన్నారు.‌ కాలుష్యం నుంచి‌ నగరాన్ని కాపాడేందుకు, మెట్రో‌ కోసం బడ్జెట్‌ను సవరించి నిధులు ఇవ్వాలన్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి‌ దీనిపై‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

News July 23, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓తెల్లాపూర్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిరణ్ ఆత్మహత్య
✓OU: IAS స్మిత సబర్వాల్ ఫొటోలు దగ్ధం
✓యువతులు, మహిళలను వేధిస్తే వదిలిపెట్టం:CP
✓సికింద్రాబాద్:గాంధీ ఆసుపత్రికి నూతన సూపరింటెండెంట్ రాజకుమారి
✓8 సీట్లు ఇచ్చినా.. కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసింది: చాడ
✓HYD: దాదాపు 200 ఫోన్ల రికవరీ పూర్తి
✓VKB: అనంతగిరి పచ్చటి అందాల..సొగసులు..!
✓సికింద్రాబాద్:రైల్వే టికెట్ల స్కాం.. బట్టబయలు

News July 23, 2024

HYD: కన్నీరు తెప్పిస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్ నోట్

image

HYD శివారు తెల్లాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిరణ్ (25) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్‌ నోట్‌ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నా చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. <<13690444>>నచ్చిన చదువు చదవలేదు<<>>. నచ్చిన బట్టలు, ఇష్టమైన తిండి తినలేదు. కనీసం నచ్చిన జాబ్ కూడా లేదు. నాకు ఎవరి నుంచి సపోర్ట్ లేదు. ఒక్కడినే ఇలా ఉండలేకపోతున్నాను. గుడ్‌ బై’ అంటూ మధ్యతరగతి యువత కష్టాలను ‌లెటర్‌లో రాసి తనువు చాలించాడు.

News July 23, 2024

HYD: యువతులను వేధించేవారికి హెచ్చరిక

image

యువతులు, మహిళలను వేధించే పోకిరీలను వదిలిపెట్టే ప్రసక్తి లేదని రాచకొండ CP సుధీర్‌ బాబు హెచ్చరించారు. మంగళవారం‌ ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. షీటీమ్స్‌ గత 15 రోజుల్లో‌ 158 మంది ఆకతాయి‌ల ఆట కట్టించినట్లు‌ పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాల్లో‌ డెకాయ్‌ ఆపరేషన్లు చేపట్టామన్నారు. పట్టుబడ్డవారికి నేడు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు‌ వివరించారు. 

News July 23, 2024

గాంధీ ఆస్పత్రికి కొత్త సూపరింటెండెంట్

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా డా.CHN.రాజకుమారి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. పేదలకు కార్పొరేట్​ స్థాయి వైద్యం అందించే ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో పేషంట్లకు మరింత మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నిరంతరం మెడికల్​ టీమ్‌తో కలిసి సమష్టి కృషితో ముందుకు వెళ్తామన్నారు. చక్కటి వైద్యం, మెడికల్ విద్యకు టాప్​ ప్రియారిటీ ఇస్తామన్నారు.

News July 23, 2024

HYD: 3 రోజులు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల పిల్లలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా 3 రోజులు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) హయత్‌నగర్ మండల కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్, గ్రేటర్ HYD నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడారు. ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని కోరారు. నాయకులు ఎన్నపల్లి ఉపేందర్, జిన్నా, బన్నీ, జూనోతల భాను ప్రకాశ్ ఉన్నారు.

News July 23, 2024

RR: రైతులకు GOOD NEWS.. దరఖాస్తు చేసుకోండి..

image

RR,MDCL,VKB జిల్లాల్లో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. నూతనంగా భూమి కొనుగోలు చేసిన వారు, నూతనంగా రైతు పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన వారు రూ.5 లక్షల రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం క్లస్టర్ AEO అధికారిని సంప్రదించాలి.18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. జులై 30లోపు అందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 23, 2024

HYD: IAS స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై నిరసనలు..!

image

HYD అశోక్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో దివ్యాంగులు రోడ్డెక్కారు. సీనియర్ IAS అధికారిణి స్మిత సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్ పై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు. దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పే హక్కు స్మిత సబర్వాల్‌కు లేదని వారు మండిపడ్డారు. తమను ఆమె కించపరిచారని దివ్యాంగుల జాతీయ వేదిక నాయకులు రాము, రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 

News July 23, 2024

HYD: రైల్వే టికెట్ల SCAM.. జర జాగ్రత్త..!

image

సికింద్రాబాద్ RPF బృందం ఆపరేషన్ ఉపలబ్ద్ చేపట్టింది. అక్రమ రైల్వే ఈ-టికెటింగ్ స్కామ్‌ పై ఉక్కుపాదం మోపింది. ఒకరిని అరెస్టు చేసి రూ.1.1 లక్షల విలువైన 37 ఈ-టికెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ టిక్కెట్లను విక్రయించే వారి మాయ మాటలకు బలైపోకండని, ఎల్లప్పుడూ సమాచారాన్ని ధ్రువకరించుకోవాలని పోలీసులు సూచించారు. అంతేకాక అదనపు మొత్తాన్ని చెల్లించకుండా ఉండాలని ప్రజలకు సూచించారు.

News July 23, 2024

HYD: లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు

image

డీజీపీ జితేందర్ రెడ్డి అధ్యక్షతన HYD నగరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని డీజీపీ సూచించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు.