RangaReddy

News July 23, 2024

JNTUలో ముగిసిన PHD పరీక్షలు

image

HYD కూకట్‌పల్లిలోని JNTUలో జరుగుతున్న PHD పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల్లో కలిపి మొత్తం 675 మంది పరీక్ష రాశారు. మొత్తం 930 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 72.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండోరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 400 మంది పరీక్ష రాసినట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్‌రావు చెప్పారు. నిబంధనలను అనుసరించి పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నారు.

News July 23, 2024

HYD: అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన BRS ఎమ్మెల్యేలు

image

ఈరోజు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా గన్ పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, వివేకానంద తదితరులు హాజరుకానున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో లాస్య నందిత మృతిపై సంతాపం తెలపనున్నారు.

News July 23, 2024

HYD: గుర్రం తన్నింది.. యువకుడి మృతి

image

గుర్రం తన్నడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. HYD పాతబస్తీ పరిధి శాలిబండ PS ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాలు.. చాంద్రాయణగుట్ట వాసి ఇబ్రాహీం(17) ఈనెల 17న మొహర్రం ఊరేగింపు తిలకించడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంజిన్ బౌలి ప్రాంతంలో గుర్రాలు వెళుతుండగా వాటి వెనుక పరిగెత్తాడు. ఒక గుర్రం తన్నడంతో అతడు గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.

News July 23, 2024

HYD: బడ్జెట్ పైనే బల్దియా ఆశలు..!

image

బడ్జెట్ పైనే GHMC ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకు SRDP, SNAP ప్రాజెక్టులతోపాటు రోడ్ల నిర్వహణ కోసం తెరపైకి తెచ్చిన CRMP కార్యక్రమాల కోసం బల్దియా రూ.6,500కోట్ల పైచిలుకు అప్పులు చేసిన సంగతి తెలిసిందే. భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా వస్తున్న ఆదాయం అప్పులు, మిత్తీలు చెల్లించేందుకు కూడా చాలకపోవటంతో అధికారులు ప్రతి నెల జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు తలలు పట్టుకుంటున్నారు.

News July 23, 2024

శంషాబాద్: విమానం ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన!

image

విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. సోమవారం ఉదయం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం సమయానికి బయలుదేరలేదు. ఉదయం 8 గంటల వరకు కూడా విమానం బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఎయిర్ లైన్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.

News July 23, 2024

HYDలో కుక్కల బెడద.. GOOD NEWS

image

HYDలో కుక్కల బెడద కారణంగా పిల్లల ప్రాణాలు పోతున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గుడ్ న్యూస్ తెలిపారు. కుక్కల బెడద నివారించేందుకు ఇకపై ప్రత్యేక అపెక్స్ కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. పలు శాఖల అధికారులు కలిసి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారని తెలిపారు. మరోవైపు HYDలో వీధి కుక్కలకు షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేస్తామని GHMC తెలిపింది. 

News July 23, 2024

రాజేంద్రనగర్: ముర్ర జాతి పశువులతో మేలు!

image

HYD నగరం రాజేంద్రనగర్ వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులు ముర్ర జాతి పశువులతో ఎంతో లాభం జరుగుతుందని తెలిపారు. ముర్ర జాతి పశువులు పొడువైనా మెడ, వెడల్పు కలిగిన మూతిని కలిగి ఉంటాయన్నారు. అత్యధికంగా పాలు సైతం అందిస్తాయని తెలిపారు. మరో జాతికి చెందిన పశువులను పెంచే వారు, యూనివర్సిటీకి వచ్చి తగిన సూచనలు పొందవచ్చన్నారు.

News July 23, 2024

RR: తాము ఎలాంటి జోక్యం చేసుకోలేం: హైకోర్టు

image

RR జిల్లాకు చెందిన సుమారు 40 మందికి పైగా ఉపాధ్యాయులు హైకోర్టులో టీచర్ల బదిలీలు, పదోన్నతులపై కోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. పదోన్నతులు, బదిలీల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని సింగల్ జడ్జి ఉత్తర్వులను సమర్థిస్తూ అప్పీలు కొట్టి వేసింది. ఈ అంశంపై తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిజెప్పింది.

News July 23, 2024

HYD: స్టాక్స్‌లో లాభాలని రూ.16.73 లక్షలు లూటీ

image

స్టాక్స్‌లో లాభాలని సైబర్ నేరగాళ్లు రూ.16.73 లక్షలు లూటీ చేశారు. నగరానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగినికి ‘వీఐపీ53-గ్రో క్యాపిటల్ సెక్యూరిటీస్’ గ్రూప్‌నకు సంబంధించి వాట్సాప్ సందేశం వచ్చింది. దాంట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించడంతో మహిళ రూ.16.73 లక్షలు పంపించారు. ఆ తర్వాత ఆ గ్రూప్ నుంచి ఆమెను తొలగించారు. దీంతో తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 23, 2024

HYD: డెంగ్యూ డేంజర్ బెల్స్.. జాగ్రత్త!

image

HYD మహానగరంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో 90 రోజుల్లో ఏకంగా 200 కు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మే నుంచి పరిశీలిస్తే.. ప్రతి నెలా పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. జ్వరంతో ఆసుపత్రికి 350 మందికి పైగా వస్తుండగా ఓపీ ఇస్తున్నారు. మరోవైపు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లోనూ జ్వరంతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. జాగ్రత్త..!