India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలో భారీ స్థాయిలో నేరాలు పెరుగుతున్నాయి. సైబరాబాద్ పరిధిలో 2023లో 2,859 కేసులు నమోదు కాగా.. 37,689 కేసులు ఈ ఏడాది నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు హైదరాబాద్లోనూ కేసులు పెరిగాయి. సైబర్ నేరాలతో పాటు, డ్రగ్స్ కేసులు పోలీసులకు రోజు రోజుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రత్యేక బృందలతో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
2024 సంవత్సరంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3207 ప్రమాదాలు జరిగినట్లుగా వార్షిక రిపోర్టులో తెలిపారు. ఈ ప్రమాదాలలో ఏకంగా 653 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాల్లో సైతం పలువురు ప్రాణాలు కోల్పోయారు. న్యూ ఇయర్ వేడుకల వేళ, అనవసరమైన డ్రైవింగ్ వద్దని, ప్రతి ఒక్కరు కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
‘విదేశీ విష సంస్కృతిని విడనాడుదాం. స్వదేశీ సంస్కృతిని కాపాడుదాం. జనవరి ఒకటి వద్దు’ అంటూ BJP నేతలు పిలుపునిస్తున్నారు. అల్లాపూర్లోని గాయత్రీనగర్లో సోమవారం గాంధీ విగ్రహం నుంచి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. జనవరి ఒకటిన తేదీ మారడం తప్పా ఇంకో సంబరం ఏమీ లేదన్నారు. ఉగాది మన కొత్త సంవత్సరం అని గుర్తు చేశారు. దీనిపై మీ కామెంట్?
HYD, ఉమ్మడి RR జిల్లాల ప్రజలు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. రేపు సెలవు కావడంతో ప్రకృతి అందాల మధ్య వేడుకలు చేసేందుకు పర్యావరణ ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. ఓ వైపు అటవీ ప్రాంతం, మరోవైపు అనంత పద్మనాభ స్వామి క్షేత్రం ఉండడంతో వికారాబాద్కు భాగ్యనగర వాసులు క్యూ కట్టారు. టూరిస్టుల రాక దృష్ట్యా అనంతగిరి హిల్స్లో పగడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని SP నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సీరియల్ నటిని వేధించిన వ్యక్తిపై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసుల వివరాలు.. AP వెస్ట్ గోదావరికి చెందిన మహిళ(29) కృష్ణానగర్లో నివాసం ఉంటోంది. ఇటీవల ఓ సీరియల్ షూట్లో ఫణితేజతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో అతడు అసభ్యకరమైన వీడియోలు పంపాడు. ఇతరులతో దిగిన ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. వేధింపులు తాళలేక బాధితురాలు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నగరంలో ఈ రోజు రాత్రి సంబరాలు నిర్వహిస్తున్నారు. మ్యూజికల్ ఈవెంట్లకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. స్నేహితులతో కలిసి యువత సెలబ్రేషన్స్కు సిద్ధమైంది. బార్లు, పబ్లు, హోటళ్లు, ఫామ్ హౌస్లు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12.30 వరకు సందడిగా మారనున్నాయి. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని బీఈ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈ(ఏఐసీటీఈ), బీఈ (సీబీసీఎస్), బీఈ(నాన్ సీబీసీఎస్) కోర్సుల మెయిన్, బ్యాక్ లాగ్, సప్లమెంటరీ పరీక్షా ఫీజును వచ్చే నెల 3వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో CP సుధీర్ బాబు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. 31 DEC రాత్రి 11 నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్(ORR)లో లైట్ వాహనాలకు నిషేధం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. డ్రంక్ & డ్రైవింగ్ నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామన్నారు. మద్యం తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్షతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు.
నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్లు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని డాక్టర్ల బృందానికి మంత్రులు సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
న్యూ ఇయర్ వేడుకలకు రిసార్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. రేపు రాత్రి నుంచి 2025 న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు HYD శివారులోని మొయినాబాద్, చేవెళ్ల, కోటిపల్లి, శామీర్పేట, భువనగిరి, పాకాల, శ్రీశైలం, గోల్కొండ, మోకిలా ప్రాంతాల్లో రిసార్టులను బుక్ చేసుకున్నారు. ప్రేమ జంటల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్టుల్లో ఒక్క రోజుకు రూ.10-40 వేలుగా ఛార్జీలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.