RangaReddy

News January 7, 2025

RR జిల్లాలో 36,62,221 మంది ఓటర్లు

image

రంగారెడ్డి జిల్లా ముసాయిదా ఓటరు జాబితాను కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్లు, ఓటర్ల వివరాలను ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 36,62,221 మంది ఉన్నారు. వీరిలో 18,88,270 మంది పురుషులు, 1,887,782 మంది మహిళలు, 488 మంది ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 8,501 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.

News January 7, 2025

HYD: ఒంటరి పోరాటంతో.. బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ!

image

HYD వేదికగా నిర్మల్ వాసి నరిమెట్ల వంశీ, TSPLRB-2018 పోలీస్ కానిస్టేబుల్ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల కోసం పోలీస్ బోర్డుపై చేసిన న్యాయ పోరాటం ఫలించింది. నోటిఫికేషన్లో 1370 పోస్టుల్లో ఎవరు చేరక పోవటంతో, ఆ ఖాళీలను తదుపరి లిస్ట్ అభ్యర్థులకు ఇవ్వాలని హైకోర్టు, సుప్రీంకోర్టు కోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు మెట్లెక్కిన దాదాపు 100 మందికి 2024లో ఉద్యోగాలు వచ్చాయన్నారు. తన 6 ఏళ్ల ఒంటరి పోరాటాన్ని అభినందిస్తున్నారు.

News January 7, 2025

HYDలో భారీగా పెరిగిన ఓటర్లు

image

రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటరు జాబితా విడుదలైంది. రంగారెడ్డి, HYD, మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 1.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధికంగా 7.65 లక్షల మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా.. 2.32 లక్షలమంది ఓటర్లతో చివరి స్థానంలో చార్మినార్ ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

News January 7, 2025

HYD: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20ఏళ్ల జైలు

image

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష, రూ.15వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పు ఇచ్చింది. 2018లో వనస్థలిపురం PS పరిధిలో తాపీ మేస్త్రిగా పనిచేసే కార్తిక్(22) ఓ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు వెల్లడించారు.

News January 7, 2025

సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు: మంత్రి తుమ్మల

image

రైతు భరోసా డబ్బులను సంక్రాంతి పండగ తర్వాత రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం చేవెళ్ల మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ దుకాణాల సముదాయం గోదాములను స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. రైతుల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని చెప్పారు.

News January 7, 2025

HYD: భారీగా పట్టుబడ్డ నకిలీ పన్నీరు

image

హైదరాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిసరి ఎంక్లేవ్‌లో నకిలీ పన్నీరు భారీ మొత్తంలో పట్టుబడింది. విశ్వసనీయ సమాచారంతో నకిలీ పన్నీరు తయారు కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేపట్టారు. నిందితులను పట్టుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. అక్కడ సుమారు 600 కిలోల పన్నీరు, కొన్ని రకాల కెమికల్స్ సీజ్ చేసినట్లు  పోలీసులు తెలిపారు. బేగం బజార్‌కు  చెందిన ఓ వ్యాపారి దీన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం.

News January 6, 2025

HYD: హైడ్రా ఆధ్వర్యంలో ప్రజావాణి

image

ప్రతి సోమవారం ఉదయం 11 గం. నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి నిర్వహణ జరుగుతుందని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

News January 6, 2025

HYD: రాచకొండ పోలీసుల ఆపరేషన్ స్మైల్- XI

image

రాచకొండ పోలీసులు ఆపరేషన్ స్మైల్- XI కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చర్యతో బాల కార్మికతను నిర్మూలించడం, బాలలకు విద్యను హక్కుగా పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్య హక్కు, ప్రత్యేక హక్కు కాదనే నినాదంతో, ఈ ప్రచారంలో బాలలకు విద్యను అందించేందుకు చర్యలు చేపట్టారు. పౌర సమాజం సహకారంతో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న రాచకొండ పోలీస్ శాఖ, ప్రజలను భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తోంది.

News January 6, 2025

చర్లపల్లి టర్మినల్ సేవలకు ఇదే కీలకం..! 

image

చర్లపల్లి రైల్వే టర్మినల్ చుట్టూ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. ఆయా ప్రాంతాల్లో పదేపదే అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. కిక్కిరిసిన రోడ్లతో ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అద్భుతంగా నిర్మించిన చర్లపల్లి టర్మినల్, మెరుగైన సేవలు అందించాలంటే, చుట్టూ ఉన్న రోడ్ల అభివృద్ధితో పాటు, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

News January 5, 2025

HYDలో పరిగి కానిస్టేబుల్ సూసైడ్

image

HYDలో మరో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఆదివారం HYD అంబర్‌పేటలోని తన నివాసంలో భాను శంకర్‌ ఉరి వేసుకున్నాడు. అయితే, భానుశంకర్‌ వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గత వారం వ్యవధిలోనే ముగ్గురు పోలీసులు HYDలోనే సూసైడ్ చేసుకోవడం గమనార్హం. అయితే, భాను శంకర్‌ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.