India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYDలో ఓవైపు చలి పెరుగుతూ వస్తుంటే దానికి తగ్గట్టుగానే విద్యుత్ వినియోగం పెరుగుతూ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. HYDలో 3 వేల మెగావాట్లకుపైగా విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు పేర్కొంది. దాదాపు 56 యూనిట్లకు పైగా రికార్డులు నమోదు కాగా.. విద్యుత్ కనెక్షన్లు పెరగడం, పరిశ్రమల వాడకం, ఉదయం పూట ఇళ్లలో గీజర్లు వినియోగించడం కారణాలుగా అధికారులు చెప్పుకొచ్చారు.
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, HYD జిల్లాల పరిధిలో దాదాపుగా 24 చెరువులు పూర్తిగా కబ్జాకు గురై కనుమరుగైనట్లు TGRAC తెలిపింది. 2014కు ముందు ఈ ఆక్రమణలు జరిగినట్లుగా పేర్కొంది. రాష్ట్రం ఏర్పడ్డాక మేడ్చల్ జిల్లాలో 28, రంగారెడ్డి జిల్లాలో 22, సంగారెడ్డి జిల్లాలో 7 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురయ్యాయని వెల్లడించింది.
రాష్ట్రంలోనే అతిపెద్ద పూల మార్కెట్గా పేరొందిన గుడిమల్కాపూర్లో వ్యాపారులకు స్థలం సరిపోటం లేదని ఆవేవదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలుదారులూ ఇక్కడ అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్కు సుమారు రూ.2.79 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ, వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదని వ్యాపారస్థులు చెబుతున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి, మార్కెట్ను విస్తరించాలని కోరుతున్నారు.
న్యూఇయర్ వేడుకలకు భద్రతలో భాగంగా పోలీసులు నగరంలోని ఫ్లైఓవర్లను బంద్ చేస్తున్నారు. బైక్ రేసులు, అతివేగంతో దూసుకెళ్లే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత బైక్లు, వాణిజ్య వాహనాలకు ఫ్లైఓవర్ల మీదకు అనుమతి ఉండదు. ఎయిర్పోర్ట్కు వెళ్లే ప్రయాణికులకు మాత్రం తగిన ఆధారాలు చూపిస్తే పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ మీదికి అనుమతి ఇస్తారు.
HMDA పరిధిలో మొత్తం 3,532 చెరువులు ఉండగా.. 3,498 చెరువుల సర్వే పూర్తయింది. ఇంకా 34 చెరువుల సర్వే జరగాల్సి ఉంది. ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రం 2,836 చెరువులకు మాత్రమే వెలువరించినట్లు అధికారులు తెలిపారు. ఫైనల్ నోటిఫికేషన్ వేసిన చెరువుల సంఖ్య 464 ఉన్నట్లుగా పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల నాటి రికార్డులను పరిశీలిస్తున్నారు.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే శరవేగంగా కొనసాగుతుంది. ఈ నెల 31లోగా పరిశీలన చేసి, వివరాలను యాప్లో నమోదు చేయాలని ఇప్పటికే అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఏ గ్రామంలో సర్వే చేస్తారో ముందు రోజే చాటింపు చేయాలని, ఏ ఒక్క దరఖాస్తును వదిలిపెట్టొద్దు అంటూ ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. అధికారులు సర్వే కోసం మీ ఇంటికి వచ్చారా..? కామెంట్ చేయండి.
పచ్చదనమే మనకు సంతోషం, ఆరోగ్యాన్ని అందిస్తుందని IFS అధికారి మోహన్ అన్నారు. HYDలో బిజీ బిజీగా గడిపే ప్రజలు, వారానికి ఒకసారైనా పచ్చని వాతావరణంలో సేద తీరితే, మనసు నిశ్చలంగా ఉండటమే కాక, శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి మార్గమన్నారు. పట్టణాలకు, పల్లెలకు తేడా మనం గమనిస్తూనే ఉంటామని, అందుకే అందరూ మొక్కలు నాటడానికి ముందుకు రావాలన్నారు. మరి మీ ప్రాంతంలో ప్రకృతి అందాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకునే రైళ్లు ఏ ఫ్లాట్ ఫాం వైపు వస్తాయనేది కేవలం 15 నుంచి 20 నిమిషాల ముందు మాత్రమే ప్రకటిస్తున్నారు. అప్పటి దాకా ప్రయాణికులు ఆగాల్సిందే. ఎటు వస్తుందో..? తెలియక ప్రయాణికులు ఎంట్రన్స్ బోర్డు వద్దకు వచ్చి గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఒక్కోసారి చివరి క్షణంలో ఫ్లాట్ ఫాం నంబర్ మారుతోంది. పునరాభివృద్ధి పనులు జోరుగా సాగుతున్న వేళ, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
చినిగిన చొక్కా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక మంచి పుస్తకం కొనకుంటే, నీ జీవితమంతా అజ్ఞానమే అన్నారు మరికొందరు మేధావులు. అందుకేనేమో హైదరాబాద్లో ఏర్పాటుచేసిన బుక్ ఫెయిర్ – 2024 నిరంతరం పుస్తక ప్రియులతో నిండుగా కనిపిస్తోంది. ఈ నెల 19న ప్రారంభమైన బుక్ ఫెయిర్ నేటితో ముగియనుంది. మరి మీరు బుక్ ఫెయిర్కు వెళ్లారా..? అక్కడ ఏ పుస్తకం కొన్నారో కామెంట్ ప్లీజ్..!
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. జూబ్లీహిల్స్లో మొత్తం 36 పబ్ లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్లలో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.