RangaReddy

News July 19, 2024

HYD: ఉజ్జయినీ బోనాలు.. కీలక మార్పులు

image

ఈనెల 21న నిర్వహించనున్న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాలకు అధికారులు కీలక మార్పులు చేశారు. ఈసారి ఆలయంలోకి జోగినీలు, శివసత్తులతో పాటు ఐదుగురినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి సా.4 గంటలలోపు బాట కూడలి నుంచి మాత్రమే వచ్చేలా పక్కా ప్రణాళిక చేశారు. బోనాల అనంతరం నిర్వహించే ఫలారం బండి(తొట్టెల) ఊరేగింపు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

News July 18, 2024

HYD: ఐటం సాంగ్‌లో KCR మాటలు.. డైరెక్టర్‌పై ఫిర్యాదు

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ BRS యువజన నాయకులు గురువారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని ఓ ఐటమ్ సాంగ్‌లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR మాటలను వాడటం ఏంటన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఐటం సాంగ్‌లో ఉన్న KCR మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఉప్పరి విజయ్, మోతే రాజు, వినయ్, రాకేశ్, వినయ్ కలిసి ఈ ఫిర్యాదు చేశారు.

News July 18, 2024

బాలుడి మృతి.. జవహర్‌నగర్ కౌన్సిల్ అత్యవసర సమావేశం

image

జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్ శాంతి కోటేశ్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. 18 నెలల బాలుడు విహాన్ కుక్కల దాడిలో మరణించిన నేపథ్యంలో జవహర్‌నగర్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కుక్కల బెడదను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పలు సూచనలు చేశారు.

News July 18, 2024

HYD: రక్తం మరిగిన కుక్కలు.. కారణం ఇదేనా?

image

గ్రేటర్ HYDలో కుక్కలు రక్తం మరిగాయి. నిత్యం <<13652139>>కుక్క కాటు కేసులు<<>> నమోదవుతూనే ఉన్నాయి. కాగా రాజధాని పరిధిలో కొందరు చికెన్, మటన్ షాపుల నిర్వాహకులు మాంసపు వ్యర్థాలను కుక్కలకు వేయడంతో అవి నాన్ వెజ్‌ తినేందుకు బాగా అలవాటు పడుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. మాంసానికి అలవాటు పడి పిల్లలపై దాడి చేస్తున్నాయని అంటున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News July 18, 2024

HYD: ఇంకా ఎంత మంది ఇలా..?

image

జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో విహాన్ చనిపోయిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.గతంలోనూ సాత్విక్, ప్రదీప్ కూడా ఇలానే చనిపోయారు. తనూశ్రీ అనే చిన్నారిపై కుక్కలు దాడి చేయగా చేతి వేళ్లు తీసేశారు. గ్రేటర్‌ HYDలో 6లక్షలకు పైగా కుక్కలు ఉండగా ఆపరేషన్లు చేసే సంరక్షణ కేంద్రాలు 5, కుక్కలు పట్టే వాహనాలు 30మాత్రమే ఉండడం గమనార్హం. పదేళ్లలో కుక్క కాటు కేసులు3,36,767 నమోదయ్యాయి. నిత్యం చాలా మంది గాయాలపాలవుతున్నారు.

News July 18, 2024

సికింద్రాబాద్: ప్లాట్‌ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వ్యక్తి రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్లాట్ ఫామ్ నంబర్-3లో కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కింద పడటంతో ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 18, 2024

HYD: ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

image

ఇంటి రుణం కట్టలేక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD శివారు అమీన్‌పూర్‌‌ పరిధిలో జరిగింది. సీఐ నాగరాజు వివరాలు.. బీరంగూడలోని ఓ రెసిడెన్సీలో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సుమంత్‌ (30) రుణం తీసుకొని ఇల్లు కొన్నారు. కాగా ఇంటి వాయిదాలు చెల్లించడానికి అతడికి డబ్బులు సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News July 18, 2024

ఉప్పల్: అండర్-16 క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆహ్వానం

image

HCA ఆధ్వర్యంలో నిర్వహించే అండర్-16 స్కూల్, జూనియర్ కాలేజీ క్రికెట్ టోర్నమెంట్ 2024-25లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వారి నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. రూ.1000 ఫీజు చెల్లించి జట్టు పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎంట్రీలను సమర్పించడానికి చివరి తేదీ జులై 20, 2024గా పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం HCA అధికారిక వెబ్‌సైట్ https://www.hycricket.org/ని పరిశీలించాలని సూచించారు. SHARE IT

News July 17, 2024

HYD: బాలుడిని పీక్కుతిన్న కుక్కల పట్టివేత

image

విహాన్ అనే బాలుడిని కుక్కలు పీక్కుతిని చంపేసిన ఘటన‌తో జవహర్‌నగర్‌ మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో <<13645143>>కుక్కలను పట్టుకుని<<>> బర్త్ కంట్రోల్‌ సెంటర్‌కు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి సుమారు 20 కుక్కలు 20 నిమిషాల పాటు దాడి‌ చేసి చిన్నారిని చంపినట్లు‌ స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై CM రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, చర్యలకు ఆదేశించారు.

News July 17, 2024

HYD: ఆస్పత్రిలో ఎల్బీనగర్‌ MLAకు చికిత్స.. KTR పరామర్శ

image

ఎల్బీనగర్ MLA దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గత 3 రోజుల నుంచి తీవ్ర జ్వరంతో HYDలోని AIG హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR బుధవారం ఆస్పత్రికి చేరుకొని MLAను పరామర్శించారు. ఆయన ఆరోగ్య స్థితిగతులపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. MLA కౌశిక్ రెడ్డి, BRS లీడర్ జాన్సన్, సుధీర్ రెడ్డి సతీమణి కమలారెడ్డి ఉన్నారు.