India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పోలీసుల వివరాలు.. భార్యాభర్తల మధ్య విబేధాలు రావడంతో ఆర్తి 2వ పెళ్లి చేసుకుంది. కోపం పెంచుకున్న సాయి(మాజీ భర్త) 2022లో నారాయణగూడలో 2వ భర్త నాగరాజు, ఆర్తి(గర్భిణి), విష్ణు(కుమారుడు)పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గర్భిణితో పాటు తండ్రి, కుమారుడు చికిత్స పొందుతూ చనిపోయారు. ఈకేసులో నిందితుడు సాయికి మరణ శిక్ష, సహకరించిన రాహుల్కు యావజ్జీవ కారగార శిక్ష పడింది.
ఈ-ఫార్ములా కేసులో సీఎం రేవంత్రెడ్డి A-1అని.. KTR కాదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ‘X’ వేదికగా అన్నారు. కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడంపై ఆయన స్పందించారు. నేను క్రైమ్ డీసీపీగా పనిచేశా.. నా అనుభవంలో ఎఫ్ఐఆర్ కాపీ చూశా.. అందులో ఎక్కడా రూ.55 కోట్ల నుంచి ఒక్క పైసా కేటీఆర్ జేబులోకి వెళ్లినట్లు లేదన్నారు. కానీ.. కేటీఆర్పై కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.
రంగారెడ్డి జిల్లా కనిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. కాసులాబాద్లో 18.1℃, మొగలిద్ద, కొందుర్గ్ 19.6, షాబాద్ 20.3, తాళ్లపల్లి 20.4, చందనవెల్లి 20.6, సంగం 20.6, కేశంపేట, బోడకొండ 20.7, కడ్తాల్ 20.8, తొమ్మిదిరేకుల, పసుమాముల 20.9, ఎలిమినేడు, యాచారం 21, మీర్ఖాన్పేట, వెల్జాల, నల్లవెల్లి 21.1, చుక్కాపూర్, కందువాడ, అమీర్పేట, విమానాశ్రయం, గునగల్ 21.2, రాచూలూరు, కందుకూరు, కేతిరెడ్డిపల్లిలో 21.3℃గా నమోదైంది.
ఫార్మా ఈ రేసింగ్లో తాను ఏ తప్పు చేయలేదని KTR అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. కేవలం హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ను పెంచేందుకే రేసింగ్ నిర్వహించామని స్పష్టం చేశారు. EVని నగరానికి రప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో కుంభకోణం ఏమీ లేదన్నారు. పైగా HYDకు రూ. వందల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. GHMCకి ప్రచారం, ఆదాయం సమకూరినట్లు KTR వెల్లడించారు. మీ కామెంట్?
VKB జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యపు కొనుగోలు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 699 మంది రైతులు మాత్రమే సన్న వరి ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల వద్ద విక్రయించినట్లు అధికారులు తెలిపారు. సన్న వరి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తున్నప్పటికీ, బయట మార్కెట్లలో ప్రస్తుత రేటు ఎక్కువగా ఉండటంతో అటువైపు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారి మల్లేశంతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ విద్యార్థులను అడిగి భోజనం టిఫిన్ ఎలా ఇస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
త్వరలో తెలంగాణ రాష్ట్ర క్యాడర్ చెందిన ఐపీఎస్ అధికారులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ జాబితాలో ముగ్గురు డీజీపీలు ఉన్నారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్ విశ్వప్రసాద్ ఉన్నారు. 2025లో వీరు పదవి విరమణ పొందనున్నారు.
మూసీ, ఈసా నదుల కలయిక అయిన బాపుఘాట్ నుంచి ఎప్పుడైతే మూసి HYDలోకి ప్రవేశిస్తుందో అక్కడి నుంచి మూసీ కలుషితం ప్రారంభమవుతుంది. బాపుఘాట్ ప్రాంతంలో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ స్థాయి అమాంతం పడిపోతుంది. ఈ విషయాన్ని స్వయాన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా తెలిపింది. గండిపేటలో-6 ఉండగా బాపుఘాట్ నుంచి ముసారంబాగ్, నాగోల్, నల్లచెరువు పీర్జాదిగూడ, ప్రతాపసింగారం ప్రాంతాల్లోనూ 0.3గా నమోదైంది.
HYD శివారు హిమాయత్సాగర్ పక్కన కొత్వాల్గూడ ఏకో పార్కు సందర్శకుల కోసం సిద్ధమవుతోంది. దాదాపు 85 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రెండేళ్ల క్రితం హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టి రూ.300 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నట్లు తెలిపింది. పక్షుల గ్యాలరీ సహా ఏకో పార్కులో మరెన్నో అనుభూతి కలిగించేవి ఉన్నాయి. రెండో దశలో కింద ఆక్వేరియం, థీమ్ పార్కులు సైతం అందుబాటులోకి రానున్నాయి.
HYDలో వైదేహినగర్ బస్స్టాప్, శేరిలింగంపల్లి జోనల్ ఆఫిస్, అల్విన్కాలనీ క్రాస్ రోడ్డు, డీఎల్ఎఫ్ భవనం ఎదురుగా స్వామి వివేకానంద పార్కు, సచివాలయ నగర్ కమ్యూనిటీ హాల్, డిలైట్ మీనాక్షి ఎదురుగా నాగోల్ సర్వీస్ రోడ్డుపై మెట్రో పిల్లర్ C819, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వెనకాల సచివాలయ నగర్, ఇంపీరియల్ హోటల్, హబ్సిగూడ మెట్రో పిల్లర్ 929, చర్లపల్లి బస్స్టాప్ వద్ద ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.