India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎనిమిదో ఎడిషన్ తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్షిప్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఘనంగా ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు 6 విభాగాల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్సాగర్ జలాల్లో సెయిలర్లు రంగురంగుల బోట్లలో ప్రాక్టీస్తో సందడి చేశారు. ఈ ఏడాది హర్యానాకు చెందిన ఆరుగురు సెయిలర్లు ఓపెన్ విభాగంలో పాల్గొంటున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. HYD విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో ఆయన సహకారం కీలకంగా ఉంది. కాగా.. 2013లో దిల్సుఖ్నగర్లోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఆయన ఇక్కడ పర్యటించి ‘భయపడకండి’ అని బాధితులు, నగరవాసులకు ధైర్యం కల్పించారు. ఈ పర్యటనతో ఆయన హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు.
HYD,RR,MDCL,VKB జిల్లాల వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచి అనేకచోట్ల చిరుజల్లులు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాయత్రినగర్లో-21 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. HYD షేక్పేట-7, ఓయూలో-6, హిమాయత్నగర్-5.8, ఫిలింనగర్-5, ఉప్పల్-4.8, ఆసిఫ్నగర్-4.8, అంబర్పేట-4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేటి నుంచి వర్షం పడకపోవచ్చని తెలిపింది.
ఆడపిల్లలు, చిన్నారులను గౌరవించకున్నా పర్వాలేదు కానీ అగౌరవపరిచి హింసకు గురిచేస్తే చట్ట ప్రకారం జైలుకెళ్లడం ఖాయమని HYDలోని శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈరోజు ఓ గార్డెన్లో మహిళల మానసిక హింస, పలు అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆడపిల్లలు నేటి సమాజంలో ధైర్యంగా ఉండాలంటే చదువుకోవాలని తద్వారా చట్టాల గురించి తెలుస్తుందన్నారు.
బంజారాహిల్స్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో రేపు బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి నాయకులు, 40కి పైగా బీసీ సంఘాలు పాల్గొననున్నారు. కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం 10 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.
BRS రాష్ట్ర నేత <<14984793>>ఎర్రోళ్ల శ్రీనివాస్ను<<>> పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. BRS పార్టీకి కేసులేమి కొత్త కాదన్నారు.
ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావాలని 2025, ఫిబ్రవరి 3న HYDలో జరిగే వెయ్యి గొంతులు, లక్ష డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని గురువారం MRPS, MSF, MSP అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యులు కోరారు. దీనికి సంబంధించిన సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లోతుకుంటలోని శుభశ్రీ గార్డెన్లో జరుగుతుందని, ముఖ్యఅతిథిగా దండోరా దళపతి మందకృష్ణ మాదిగ హాజరువుతారన్నారు.
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. బుధవారం ఆకాశంలో మబ్బులు కమ్మేసి మేఘావృతమైంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గరిష్ఠంగా 28, కనిష్ఠంగా 19.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు పగటిపూట చలిలో మంచుతో పాటు చిరుజల్లులు కురిశాయి. ఒకేసారి వాతావరణ మార్పుతో కొంత ఆహ్లాదకరంగా కనిపించినా.. ప్రజలు చలితో గజగజ వణికిపోయారు.
HYD ఎన్టీఆర్ స్టేడియంలో పండుగలా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనకు పుస్తకాభిమానులు తరలివస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పలు స్టాలు పరిశీలించారు. అనంతరం ఆయన రెంటాల జయదేవ రచించిన మన సినిమా ఫస్ట్ రీల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకం గురించి ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినిమా మొదటి రోజుల గురించి రాసిన పరిశోధనాత్మక పుస్తకమని తెలిపారు.
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, రాజ్యాంగాన్ని సవరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు HYD విద్యానగర్లోని బీసీ భవన్లో రాష్ట్ర బీసీ లెక్చరర్స్ సంఘం సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షుడు కే.సుదర్శన్ అధ్యక్షత వహించగా విఠల్ సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు ఉన్న మాదిరిగా బీసీలకు కూడా అట్రాసిటీ ప్రొటెక్షన్ కల్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.