India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాచకొండ పోలీసులు పాస్వర్డ్ భద్రతపై అవగాహన కల్పిస్తూ ముఖ్య సూచనలు చేశారు. ఇటీవల HYDలో పలు సైబర్ క్రైమ్లు పాస్వర్డ్ల కారణంగా జరిగినట్లు తేల్చారు. తరచూ మార్చడం, సులభమైన పాస్వర్డ్లను (123456) ఉపయోగించకపోవడం, ఇతరులతో పాస్వర్డ్ పంచుకోకపోవడం, ఫ్రీ వైఫై నెట్వర్క్లలో లాగిన్ అవ్వకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. భద్రతను మరింత మెరుగుపర్చేందుకు టూ స్టెప్ వెరిఫికేషన్ ఉపయోగించాలని సూచించారు.
తెలుగు సినిమా ఉన్నంత కాలం మాధవపెద్ది సత్యం అందరి హృదయాల్లో ఉంటారని వక్తలు కీర్తించారు. శతాబ్ది గాయకుడు మాధవపెద్ది సత్యం వర్ధంతి వేడుకలను శ్రీ త్యాగరాయ గానసభలో నిర్వహించారు. పద్మశ్రీ కోటశ్రీనివాస్ రావుకు శ్రీభారతి-మాధవపెద్ది సత్యం స్మారక పురస్కారం-2024తో పాటు విశ్వనట చైతన్యభారతి బిరుదును ప్రదానం చేశారు.
జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా విద్యార్థులకు సరళమైన రీతిలో నాణ్యమైన విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టరేట్లో డిప్యూటీ ఈవో, డిప్యూటీ ఐఓఎస్, కాంప్లెక్స్ హెచ్ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లాస్ రూమ్లో 75% మంది పిల్లలకు చదవడం, రాయడం, అభ్యాస మెరుగుదల కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేయాలన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షల టెంటేటీవ్ తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. M.SC, MA, M.COM, MSW, BLIBSC, BCJ, M.LIBISC, MJ&MC, M.COM (IS) అన్ని సెమిస్టర్ల వన్ టైం చాన్స్ బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 17వ తేదీ నుంచి నిర్వహించనున్నామని చెప్పారు. కాగా, పరీక్ష తేదీలకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
HYD శివారు ఆదిభట్ల మున్సిపాలిటీలో ORR బొంగ్లూరు నుంచి ఆదిభట్ల పట్టణానికి నిర్మించిన రోడ్డుకు రతన్ టాటా మార్గ్గా నామకరణం చేస్తూ తీర్మానించారు. భారతదేశానికి అనేక విధాలుగా సేవలందించి 2024 అక్టోబర్ 9న స్వర్గస్తులైన పారిశ్రామికవేత్త సేవలకు గుర్తింపుగా రోడ్డుకు టాటా పేరును పెట్టినట్లు మున్సిపల్ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఆయన విగ్రహాన్ని కూడా నెలకొల్పుతామని గతంలోనే స్పష్టం చేశారు.
గ్రామపంచాయతీ పెండింగ్ బిల్లులు ఇప్పించాలని బుధవారం శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీనరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 5 నుంచి 50 లక్షలు బకాయిలు ఉన్నాయని వివరించారు. బిల్లులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీలు కవిత, నవీన్రెడ్డితో కలిసి వారు వినతిపత్రం అందజేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అధికారుల చర్యలపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ థియేటర్ ట్విన్ సిటీలో ఫేమస్, మాస్ క్రేజ్ ఎక్కువని టాక్. 1980లో సంధ్య70MM, 1981లో సంధ్య 35MM స్థాపించారు. 70MMలో ఆడిన తొలి సినిమా శాలిమార్. నాటి నుంచి లెక్కలేని చిత్రాలు ప్రదర్శించారు. స్టార్ హీరోలకూ ఈ హాల్ సెంటిమెంట్. అటువంటి థియేటర్లో రేవతి మృతి చెందారు. ఈ కేసులో షోకాజ్ నోటీసులు వెళ్లగా యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. KIMSలో బాలుడు శ్రీతేజ్ను HYD కమిషనర్తో పాటు MLC తీన్మార్ మల్లన్న, పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు. అతడు కోలుకోడానికి సమయం పట్టేలా ఉందన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అల్లు అర్జున్ చెప్పినా.. పుష్ప-2 లాభాల్లో 10 శాతం వాటా ఇవ్వాలని మల్లన్న డిమాండ్ చేశారు. బాలుడిని హీరో పరామర్శించాలన్నారు. దీనిపై మీ కామెంట్..?
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిషనరేట్లతో పోలిస్తే సైబరాబాద్ పరిధిలో అత్యధిక సైబర్ నేరాలు నమోదయినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఏడాది 2136 కేసుల్లో రూ.12.77 కోట్లు ఫ్రీజ్ చేసి బాధితులకు అందించారు. హైదరాబాద్ పరిధిలో 268 కేసులకు రూ.8.84 కోట్లు, రాచకొండ పరిధిలో 592 కేసుల్లో రూ.4.53 కోట్లు బాధితులకు అందజేశారు. అందరి సహకారంతోనే సాధ్యమైందని డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు.
HYD మెట్రో ఫేజ్-2 పార్ట్-Aలో రూ.24,269 కోట్ల అంచనాతో మెట్రో కారిడార్ల నిర్మాణం జరుగుతుందని HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది.ఇప్పటికే పాత బస్తీ మెట్రో పనుల వేగం పుంజుకుంది.4.నాగోల్,శంషాబాద్ రూ.11,226 కోట్లు, 5.రాయదుర్గం,కోకాపేటకు రూ.4,318 కోట్లు,6.పాతబస్తీకి రూ.2,741 కోట్లు, 7.మియాపూర్ పఠాన్ చెరువు మార్గానికి రూ.4,107 కోట్లు, 8.ఎల్బీనగర్ హయత్ నగర్ మార్గానికి రూ.1,877 కోట్లు ఖర్చు అవనుందని తెలిపింది.
Sorry, no posts matched your criteria.