India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ మార్పునకు సంబంధించి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాన్ని జూలూరు గౌరీ శంకర్ దాఖలు చేయగా, హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విగ్రహంపై క్యాబినెట్ నిర్ణయం, రూ.150 కోట్ల వ్యయానికి సంబంధించిన వివరాలు ఎక్కడా ప్రస్తావించ లేదని వ్యాఖ్యానించింది. దీంతో పిటిషనర్ తరఫు లాయర్ మయూర్ రెడ్డి పిటిషన్ ఉపసంహరించుకున్నారు.
మాదాపూర్ శిల్పారామంలో జరుగుతున్న ఆలిండియా క్రాఫ్ట్స్ మేళాలో భాగంగా సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ తంజావూర్ నిర్వహణలో రూప్ చంద్ బృందం పురూలియా చౌ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అదే విధంగా ఒడిసి నృత్య ప్రదర్శనలో భాగంగా సస్మితా మిశ్ర శిష్య బృందం హంస ధ్వని పల్లవి, శంకరాభరణం పల్లవి, బసంత్ పల్లవి, స్థాయీ, మోక్ష మొదలైన అంశాలను.. శుభశ్రీ, అంకిత, శ్రద్హ, జ్యోతిక, రిధి, అన్వితలు ప్రదర్శించి అలరించారు.
ఉప్పల్ మినీ శిల్పారామంలో కూచిపూడి నాట్య గురువు సాత్విక శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. మహాగణపతిమ్, లింగాష్టకం, బాలకనకయ్య, చిన్ని శిశివు, అన్నపూర్ణ, అల్లోనేరేళ్లో, పేరిణి కౌత్వం, వారాహి, అష్టలక్ష్మి, గరుడ గమన మొదలైన అంశాలను.. స్ఫూర్తి, నిత్యశ్రీ, గగనశ్రీ, సాన్విక, యోషిక, జూషిత, సహస్ర, ప్రణవి, మనస్వి తదితరులు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
మొబైల్ ఫోన్ సందేశం పేరిట జడ్జిలు, పోలీస్ అధికారులను కించపరచొద్దని BSNL HYD సీజీఎంకు BRS మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. సైబర్ క్రైమ్ అలెర్ట్ కోసం చేస్తున్న ప్రకటనల్లో ‘మీకు జడ్జిలు, పోలీసులు వీడియో కాల్స్ చేస్తూ సైబర్ క్రైమ్లకు పాల్పడవచ్చు’అని ఫోన్ కాల్కు ముందు వస్తోందన్నారు. ఇందులో తప్పు దొర్లుతోందని, ‘జడ్జిలు, పోలీసుల పేరిట’ అని ఇవ్వాలని కోరారు.
2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.
ప్రైవేట్ బౌన్సర్ల వ్యవస్థపై ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే ఊరంతా కోపగించుకుటారని.. అందరికీ శత్రువులు అవుతారంటూ పెద్దలు చెప్పారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో బౌన్సర్లను పెట్టుకుని నెట్టేయించే సంస్కృతిని తెచ్చిందే ఆనాడు TPCC చీఫ్గా పని చేసిన రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. HYD సీపీ సీవీ ఆనంద్ చేతనైతే బౌన్సర్ల మీద చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్ నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో బెలగావికి సీఎం రేవంత్ రెడ్డి బయల్దేరనున్నారు. మహాత్మా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బెలగావిలో సీడబ్ల్యూసీ 26, 27వ తేదీల్లో ఈ ప్రత్యేక సమావేశాలను గ్రాండ్గా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తునారు. ఈ సమావేశంలో సీఎంలు, మాజీ సీఎంలు, ఇతర సీనియర్ నేతలు కలిపి 200 మంది కీలక నేతలు పాల్గొంటారు.
ప్రస్తుతం రాజకీయాల్లో నాయకులు ఎప్పటికప్పుడు రంగులు మారుస్తున్నారని, అలాంటి రంగులు మార్చే నాయకులతో ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని రాజ్యసభ సభ్యుడు, BJP ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి విమర్శించారు. నాంపల్లి BJP రాష్ట్ర కార్యాలయంలో బుధవారం వాజ్ పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వాజ్ పేయి విలువలతో కూడిన వ్యక్తి అని కొనియాడారు.
ఏపీ సీఎం చంద్రబాబు గురువారం హైదరాబాద్ రానున్నారు. ఇవాళ ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. ఇవాళ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం టీడీపీ మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు.
HYD RTC క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో ఇటీవల తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో థియేటర్ యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ లోపల, బయట పూర్తిగా మరమ్మతులు ప్రారంభించారు. పాత సీసీ కెమెరాలను తొలగించి, వాటి స్థానంలో అధునాతనమైన కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి సంధ్య 70MM, 35MM థియేటర్ల గేట్లకు బోర్డులు, కొత్త గ్రిల్స్, మెటల్ డిటెక్టర్లు, ఫైర్ సేఫ్టీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.