India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో ఓవైపు చలి తీవ్రత పెరుగుతుండగా, గాలి కాలుష్యం సైతం పెరిగినట్లు CPCB తెలిపింది. సనత్నగర్లో-171, పాశమైలారంలో -163, నెహ్రూ జూపార్క్-160, పటాన్చెరు-149, సెంట్రల్ యూనివర్సిటీ-125, బొల్లారం-117, కొంపల్లి-102 గాలినాణ్యత సూచి(AQI) నమోదయింది. పైప్రాంతాలకు PCB ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యధిక చలి, పొల్యూషన్ నమోదవుతున్న వేళ ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలంది.
గ్రూప్-2 పరీక్ష రెండో రోజు ప్రశాంతంగా ముగిసింది. HYD జిల్లాలో 42%, RR-43%, MDCL-45%, VKB జిల్లాలో 10,381 మందికిగానూ 5,033 మంది ఉదయం పరీక్షకు, 5,032 మంది మధ్యాహ్నం పరీక్షకు రెండో రోజు హాజరయ్యారు. మొదటి రోజుతో పోలిస్తే దాదాపు ఉమ్మడి జిల్లాల్లో 2-3 వరకు హాజరు శాతం తగ్గింది. పలు చోట్ల గర్భిణీలు, బాలింతలు, దివ్యాంగులు, మహిళలు తమ లక్ష్యమే ఊపిరిగా కష్ట పరిస్థితుల్లోనూ గ్రూప్-2 పరీక్ష రాశారు.
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ పోలీసులు సూచించారు. ఈ వేడుకల్లో మాదకద్రవ్యాలను వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫామ్ హౌస్లతో పాటు పబ్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేయనున్నట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు.
ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని 21 నుంచి 31వ తేదీ వరకు పత్రీజీ ధ్యాన మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు HYD పిరమిడ్ రీచువల్ ట్రస్ట్ ఛైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో కరపత్రాన్ని ట్రస్ట్ ప్రతినిధులు మారం శివప్రసాద్, సాంబశివరావు, నిర్మల తదితరులతో కలిసి ఆవిష్కరించారు. కడ్తాల్ మండలంలోని కైలాసపురిలో 11 రోజులు మహా జ్ఞాన కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. GHMC హెడ్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. 43 విన్నపాలు స్వీకరించినట్లు పేర్కొన్నారు.
దుబాయ్లో డెలివరీ బాయ్ ఉద్యోగం చేసేందుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. HYDలోని ITI మల్లేపల్లి క్యాంపస్లో డిసెంబర్ 20న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఓవర్సీస్ మ్యాన్ పవర్ సంస్థ(TOMCOM) వెల్లడించింది. అర్హత: 10వ తరగతి పాస్, కనీసం 3 సంవత్సరాల ఓల్డ్ డ్రైవింగ్ లైసెన్స్, 21-40 ఏళ్ల వయసు ఉండాలి.
మరిన్ని వివరాలకు https://tomcom.telangana.gov.in/ సంప్రదించండి.
SHARE IT
HYD, ఉమ్మడి RR జిల్లాలో చలి పెరిగింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత సోమవారం ఉదయం రికార్డు స్థాయిలో షాబాద్లోని చౌదర్పల్లిలో 7.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. HCU వద్ద 7.2, BHEL 7.4, గచ్చిబౌలిలో 9.3 డిగ్రీల(సింగిల్ డిజిట్)కు టెంపరేచర్ పడిపోయింది. ఇక వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఏకంగా 6.8 డిగ్రీలుగా నమోదు కావడం గమనార్హం. రేపు ఉదయం ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. బీ కేర్ ఫుల్
SHARE IT
శంకర్పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ఉన్న మహిమాన్వితమైన మరకత శివాలయానికో ప్రాముఖ్యత ఉంది. మరకత శివాలయాన్ని దర్శిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పర్లి వైద్యనాథుని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం చందిప్ప గ్రామంలో ఉంది. మరకత శివలింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. క్రీస్తు శకం 1076-1126 మధ్య చాలుక్య రాజు 6వ విక్రమాదిత్యుడు ప్రతిష్ఠించారని శాసనంలో ఉంది.
రేషన్ కార్డుల పంపిణీపై HYDలోని శాసనమండలిలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఈరోజు కీలక అంశాలు ప్రస్తావించారు. ‘ఎప్పటిలోగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.. 2014 తర్వాత ఉప ఎన్నికలు జరిగిన చోట్ల మినహా, మిగతా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు.. కొత్త రేషన్ కార్డు జారీ చేయడంలో విధానాలు.. వద్వా కమిటీ సూచనలు.. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
రేషన్ కార్డు పంపిణీపై HYDలోని శాసనమండలిలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఈరోజు కీలక అంశాలు ప్రస్తావించారు. ‘ఎప్పటిలోగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.. 2014 తర్వాత ఉప ఎన్నికలు జరిగిన చోట్ల మినహా, మిగతా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు.. కొత్త రేషన్ కార్డు జారీ చేయడంలో కీలక సూచనలు.. వద్వా కమిటీ సూచనలు.. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలి’ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.