India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నాంపల్లి గాంధీ భవన్ వద్ద విజయ్ దివస్ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని సేవాదల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సేవాదల్ ఛైర్మన్ జితేందర్, మాజీ సైనికుల కమిటీ ఛైర్మన్ రాజేందర్, కార్పెరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు.
HYD జూబ్లీహిల్స్లోని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భరణి లేఅవుట్లో ఉంటున్న జైపాల్ ఇంట్లో నుంచి రూ.7.5 లక్షల నగదు దుండగులు చోరీ చేశారు. జైపాల్ యాదవ్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విజయ్ దివస్ సందర్భంగా 1971 ఇండో పాక్ యుద్ధంలో ప్రాణత్యాగాలు చేసి దేశానికి గెలుపునిచ్చిన వీర సైనికుల స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లుగా తెలంగాణ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారికి మించిన సేవ ప్రపంచంలో మరొకటి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
సాలార్జంగ్ మ్యూజియం ప్రారంభమై 73 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో మ్యూజియం నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ‘ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్’ ఫొటో ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం మ్యూజియం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన టికెట్ కియోస్క్ ప్రారంభించారు. దీనిద్వారా టికెట్లను సులభంగ పొందవచ్చని యాజమాన్యం తెలిపింది.
గ్రూప్-2 పరీక్ష ఆదివారం మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. HYDలో 48,012 మందికిగానూ ఉదయం పరీక్షకు 19,208, మధ్యాహ్నం పరీక్షకు 18,879 మంది హాజరయ్యారు. VKB జిల్లాలో 10,381 మంది హాజరు కావలసి ఉండగా 5,147 ఉదయం, 5,135 మంది మధ్యాహ్న పరీక్షకు హాజరయ్యారు. RR జిల్లాలో 45% మంది పరీక్షకు హాజరయ్యారు. మేడ్చల్ జిల్లాలో సుమారు 48% పరీక్షకు హాజరయ్యారు.
HYD ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఓపెన్ స్కూల్లో(SSC, INTER) ప్రవేశాల కోసం( స్పెషల్ అడ్మిషన్) నేడు చివరి తేదీ అని ఆయా జిల్లాల కో-ఆర్డినేటర్లు తెలిపారు. అదనపు ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కావున HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
HYD శివారు ఇబ్రహీంపట్నం పరిధి ఎలిమినేడు, VKB మోమిన్పేటకు వెళ్తే చలితో గజగజ వనకాల్సిందే. HYD, RR, మేడ్చల్, VKB జిల్లాల పరిధిలో ఆ రెండు గ్రామాల్లోనే 30 రోజులు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇబ్రహీంపట్నం ఎలిమినేడు- 8.9, VKB మోమిన్పేట-8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు శనివారం నమోదయ్యాయి. ఆ గ్రామాల్లో ప్రజలను చలి వణికిస్తోంది. సా.6 నుంచి తెల్లవారుజామున ఉ.9 వరకు బయటకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు.
డిసెంబర్ 17న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శీతకాల విడిదికి HYD రానున్నారు. డిసెంబర్ 17 నుంచి 21 వరకు ఇక్కడే ఉంటారు. HYD మల్కాజ్గిరి జిల్లాలో తన పర్యటన కొనసాగనున్న నేపథ్యంలో కలెక్టర్ గౌతమ్ అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలన్నారు.
జల్పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసంలో ఓ మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ప్రముఖ నటుడు మోహన్ బాబు మరోసారి క్షమాపణలు చెప్పారు. దాడిలో గాయపడిన జర్నలిస్ట్ను కలిశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్తో పాటు ఆయన కుటుంబాన్ని కలిసి మోహన్ బాబు మరోసారి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
కడ్తాల్ మండలం హనుమాస్పల్లి గ్రామంలోని మహేశ్వర మహా పిరమిడ్లో ఈ నెల 21 నుంచి 31 వరకు ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 11 రోజులపాటు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ధ్యానం, శాకాహార ప్రచారం కోసం నిర్వహిస్తున్న యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ట్రస్టు సభ్యులు మాధవి, శ్రీరామ్ గోపాల్, హనుమంత రాజు, రాంబాబు, సాంబశివరావు, నిర్మల దేవి, లక్ష్మి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.