RangaReddy

News December 26, 2024

కాంగ్రెస్‌ నిజస్వరూపం ఇంటింటికీ వివరించండి: కిషన్ రెడ్డి

image

ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి వేడుకల సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని, అబద్ధాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్‌ అని విమర్శించారు.

News December 25, 2024

VKD: జిల్లాలో నేటి ముఖ్య వార్తలు !

image

✔VKD: పురవీధుల్లో అయ్యప్ప స్వామి ఊరేగింపు✔కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం✔ ఘనంగా క్రిస్మస్ వేడుకలు✔నాపై సీఎం కక్షసాధింపు చర్యలు: పట్నం నరేందర్‌రెడ్డి✔నవాబ్ పేట: జాతరలో బోనమెత్తిన జోగిని శ్యామల✔దౌల్తాబాద్:లేగదూడపై చిరుత దాడి✔అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు:ఎస్ఐలు✔CM ఇలాకాలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు✔ఒకవైపు ముసురు..మరోవైపు చలి

News December 25, 2024

HYD: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివ చరణ్ రెడ్డి

image

తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జక్కిడి శివ చరణ్ రెడ్డిని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఢిల్లీలో ఉదయ్ భాను చిబ్‌, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ & నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ క్రిష్ణ అల్లవరు‌ను శివ చరణ్ రెడ్డి కలిశారు. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు నియామక పత్రం అందజేశారు.

News December 25, 2024

శంషాబాద్‌లో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం

image

ఉపరాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధన్‌ఖడ్ దంపతులకు శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మెద‌క్ జిల్లాలోని తునికిలోని ఐసీఏఆర్ విజ్ఞాన కేంద్రానికి షెడ్యూల్ ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లారు. విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న సుమారు 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి మాట్లాడుతారు.

News December 25, 2024

HYD: సంపులో నాగు పాము (PHOTO)

image

సంపులో నాగు పాము ప్రత్యక్ష్యమైంది. స్థానికుల వివరాలు.. హైదర్‌షాకోట్ బైరాగిగూడలోని ఓ ఇంట్లో పాము దూరింది. ఒక్కసారిగా సంపులో పడిపోయింది. పైకి ఎక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ పడగ విప్పి బుసలు కొట్టింది. భయాందోళనకు గురైన కుటుంబీకులు, స్థానికులు వెంటనే స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచాక్యంగా పామును పట్టుకొని, అక్కడి నుంచి తరలించారు.

News December 25, 2024

NEW YEAR: HYDలో రాత్రి 10 దాటితే బంద్!

image

రాజధానిలోని 3 కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
➤ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బంద్
➤ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి
➤మైనర్లకు పార్టీల్లో నో ఎంట్రీ
➤ఇండోర్‌‌‌‌‌‌‌‌లోనే మ్యూజికల్ ఈవెంట్స్
➤సౌండ్ పొల్యూషన్ 45 డెసిబుల్స్‌‌‌‌ దాటొద్దు
➤అసభ్యకర డాన్సులు బ్యాన్
డ్రంకెన్ డ్రైవ్‌‌‌‌లో పట్టుబడితే రూ.10,000 FINE, 6 నెలల జైలు శిక్ష విధిస్తారు.
SHARE IT

News December 25, 2024

హైదరాబాద్‌‌లో OYO‌కు ఫుల్ డిమాండ్!

image

HYD OYO బుకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం.. గల్లీల్లో ఉండే లాడ్జిలను సైతం అధునాతన హంగులతో తీర్చిదిద్ది, అందుబాటు ధరలకే‌ ఇస్తున్నారు. అయితే, నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ ఈ సారి గ్రాండ్‌‌గా నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి మన నగరానికి టూరిస్టులు వస్తుంటారు. దీంతో OYO హోటల్స్‌‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఆయా హాటల్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టడం విశేషం.

News December 25, 2024

HYDలో అర్ధరాత్రి నుంచి సంబరాలు

image

హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి పండుగ వాతావరణం నెలకొంది. యేసు పుట్టిన రోజు సందర్భంగా అన్ని చర్చిలను అందంగా అలంకరించారు. స్టార్ ఆకారంలో పలుచోట్ల LED లైట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్‌లో క్రిస్‌మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే, మిడ్ నైట్ 12 గంటలకు చర్చిలకు వెళ్లిన క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Happy Christmas

News December 25, 2024

HYD: చీకటి ప్రాంతాలే అడ్డాగా..!

image

HYD శివారు చీకటి ప్రాంతాలను చైన్ స్నాచింగ్, గంజాయి, అసాంఘిక కార్యక్రమాలకు ముఠాలు అడ్డగా మార్చుకుంటున్నట్లు వివిధ కేసుల్లో తెలిసింది. శామీర్‌పేట, పెద్ద అంబర్ పేట, ఔటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో అన్నోజిగూడ, యమ్నంపేట, ఘట్కేసర్, మాధవరెడ్డి బ్రిడ్జి, అవుషాపూర్, తోండుపల్లి జంక్షన్, మల్లంపేట నుంచి దుండిగల్ వైపు ప్రాంతాల్లో ముఠాలు తిష్ట వేస్తున్నాయి.

News December 25, 2024

HYD: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌తో మలేసియా ప్రతినిధులు భేటీ

image

HYD బుద్ధభవన్ కార్యాలయంలో తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శారదతో మలేసియా ప్రతినిధుల బృందం భేటీ అయ్యారు. మహిళల హక్కులు, రక్షణకే కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఛైర్‌పర్సన్ వారికి సూచించారు. సమాజంలో మహిళల పట్ల వివక్షతను తొలగించి, సాధికారత కృషి గురించి బృందానికి ఆమె తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్, విజయ్ పాల్గొన్నారు.