India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ రుచికరమైన భోజనం అందించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. శుక్రవారం కొడంగల్ నియోజకవర్గం గుండుమల్లోని జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు ఆదర్శ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ భోజనంతోపాటు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
52వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో దోమ మండల పరిధిలోని దాదాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. వనరుల నిర్వహణలో రెండవ బహుమతి దయాకర్, చిరుధాన్యాలు వాటి ప్రాధాన్యతలో రెండవ బహుమతి పొందిన అక్షయలు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు వారిని అభినందించారు.
జిల్లాలోని ఎస్సీ, బీసీ మైనార్టీ గిరిజన అన్ని సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ కేజీబీవీ పాఠశాలల్లో ఈనెల 14వ తేదీన నూతన డైట్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ కల్లెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాలు నుంచి అన్ని సంక్షేమ వసతి గృహాలు రెసిడెన్షియల్ కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్స్తో వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్ నిర్వహించారు.
HYDలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వద్దకు వెళ్లిన సివిల్ ఇంజినీర్లు, డిప్యూటీ సర్వేయర్ల నియామకంలో జరగబోయే అన్యాయాన్ని వివరించారు. ఎలాంటి క్వాలిఫికేషన్లేని వీఆర్వోలను డిప్యూటీ సర్వేయర్లుగా కేటాయిస్తే చరిత్రలోనే పెద్ద తప్పుగా మిగులుతుందని అభ్యర్థులు వాపోయారు. అభ్యర్థుల పక్షాన పోరాడుతానని KTR సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఇందులో సర్వేయర్లు, గతంలో పరీక్ష రాసిన వారు పాల్గొన్నారు.
HYDలోని పటాన్చెరు వద్ద ఉన్న ఇక్రిశాట్ సౌరశక్తితో నడిచే గుర్రపు డెక్క తొలగించే హార్వెస్టర్ కోసం భారతదేశంలోనే మొదటి పారిశ్రామిక డిజైన్ గ్రాంట్ పొందింది. HYD వ్యాప్తంగా చెరువులలో ఉన్న గుర్రపు డెక్క మొక్కను తొలగించటం కోసం ప్రస్తుతం డీజిల్ ఇంధనం ద్వారా నడిచే యంత్రాలను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. సోలార్ పవర్ హార్వెస్టర్ అందుబాటులోకి వస్తే లాభం చేకూరనుంది.
>ఉ.11.45కు – జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన పోలీసులు >మ.12.00- సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పిన పోలీసులు > మ.12.15- నివాసం నుంచి చిక్కడపల్లి PSకు తరలింపు >మ.1- బన్నీతో PSకు చేరుకున్న పోలీసులు > మ.2.10 – వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలింపు >మ.2.50 – గాంధీలో ముగిసిన వైద్య పరీక్షలు.. నాంపల్లి కోర్టుకు తరలింపు >3.20కు కోర్టుకు రాక >సా.4 గంటలకు విచారణ
రచయిత కంచ ఐలయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. కోరుట్ల, కరీంనగర్, మల్కాజిగిరి PSలో కేసుతో పాటు పెండింగ్లో ఉన్న అన్ని కేసులను హైకోర్టు కొట్టేసింది. ఆయన ఓ పుస్తకం రాయడంతో నమోదైన కేసులన్నీ రాజ్యాంగపరిధిలోని భావ వ్యక్తీకరణకిందికే వస్తాయని హైకోర్టు పేర్కొంది. పుస్తకాన్ని బ్యాన్ చేయాలనే కేసును సుప్రీంకోర్టు 2017లో తిరస్కరించినా, రచయితకు శిక్ష పడాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోకి పోలీసులు ఎవరినీ డైరెక్ట్గా అనుమతించడం లేదు. సినీ హీరో అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం పేషెంట్లు, వారి సహాయకులు, డాక్టర్లను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. వారి ఐడీ కార్డు చూసి నిర్ధారించుకున్న తర్వాతనే ఆసుపత్రిలోకి అనుమతిస్తున్నారు. 15 నుంచి 20 నిమిషాల్లో అల్లు అర్జున్ వైద్య పరీక్షలు పూర్తికానున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించిన విషయం తెలిసిందే. ఏ క్షణమైనా అల్లు అర్జున్ని వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. దీంతో గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
రాష్ట్రంలోని డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు వీఆర్వోలను కేటాయిస్తే ఉద్యమం తప్పదని HYD నగరంలో సివిల్ ఇంజినీర్లు, సర్వేయర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోస్టుకు అర్హత లేని వీఆర్వోలను ప్రభుత్వం కేటాయిస్తుందన్న సమాచారంతో అభ్యర్థులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఖాళీలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.