RangaReddy

News December 12, 2024

HYD: ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

image

నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

News December 11, 2024

HYD: DEC-17 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో హైదరాబాద్ రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస చేయనున్నారని కలెక్టర్ తెలిపారు. దీనిపై అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News December 11, 2024

HYD: ‘రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయాలి’

image

DEC 14, 15 తేదీల్లో అనంతపురంలో జరిగే మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయాలని సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ అహ్మద్ కోరారు. HYDలోని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ భవనంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించే మహాసభల్లో అందరూ పాల్గొనాలన్నారు. TPTF మాజీ రాష్ట్ర అధ్యక్షుడు B.కొండల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఉన్నారు.

News December 11, 2024

వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రేపటి నుంచి జాతీయ సదస్సు

image

రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్‌ప్లాంట్ పాథాలజీ అండ్ ప్లాంట్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఇన్‌ప్లాంట్ డిసీజ్ మేనేజ్‌మెంట్ (RAPPID)అంశంపై రేపటినుంచి 2 రోజుల పాటు రాజేంద్రనగర్‌లోని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జాతీయ సదస్సు జరగనుంది. దీన్ని ఇండియన్ ఫైటోపాథాలాజికల్ సొసైటీ (సెంట్రల్ జోన్), దక్కన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ పాథాలజీలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

News December 11, 2024

HYD: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట‌లో మరో మలుపు!

image

పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చిందన్నారు. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదని, ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారన్నారు. అయినా తమ బాధ్యతగా బందోబస్తు కల్పించామని, అలాంటి తమపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

News December 11, 2024

HYD: RTC బస్సు డిపోలన్నీ ప్రైవేటుపరం..?

image

సిటీలో ఎయిర్‌ పొల్యుషన్‌ను తగ్గించేందుకు డిజిల్‌ బస్సులను నగరం వెలుపలకి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో RTC ప్రైవేటీకరణ మొదలైందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని భావిస్తున్న సంస్థ.. ముందడుగు వేసింది. కండక్టర్ సేవలు మినహా మెయింటెనెన్స్ మొత్తం ప్రైవేట్‌ సంస్థలకే అప్పగించే ఛాన్సుంది. దీంతో సిటీ బస్సు డిపోలన్నీ ప్రైవేట్‌పరం కానున్నట్లు టాక్.

News December 11, 2024

చీకట్లో‌ హైదరాబాద్‌ అందాలు!

image

ట్యాంక్‌బండ్‌‌కు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. అనుగుణంగా HMDA, GHMC అధికారులు‌ బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నారు. తాజాగా HYDలో ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించిన ప్రభుత్వం హుస్సేన్‌సాగర్‌ చుట్టూ LED లైట్ల‌ను ఏర్పాటు చేసింది. త్రివర్ణ లైట్లతో తెలంగాణ సెక్రటేరియట్ వెలిగిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోను HMDA ‘X’లో పోస్ట్ చేసింది. చీకట్లో బిర్లా టెంపుల్, సెక్రటేరియట్‌‌ ఫొటో‌ అందరినీ ఆకర్శిస్తోంది.

News December 11, 2024

HYD: GHMC ఎన్నికలు.. భారీ ప్లాన్!

image

GHMC ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా నేతలు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే మేయర్ పీఠం అని ఇటీవల బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. HYDలోని డివిజన్లలో భారీ ఎత్తున పాదయాత్రలు ఉంటాయని‌ ఓ మంత్రి పేర్కొన్నారు. BRS, MIM ఎన్నికలపై స్పందించకపోయిన నగరవాసులు తమవైపు ఉంటారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, డివిజన్లు పెరిగే ఛాన్స్ ఉంది. పార్టీలు బలంగా ఉండడంతో చతుర్ముఖ పోరు తప్పేలా లేదు.

News December 11, 2024

HYD: ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి’

image

HYD నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లటంపై ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ‘మళ్లీ మళ్లీ ఢిల్లీ.. ఇదే రేవంత్ లొల్లి. గల్లీలో అధికారం, ఢిల్లీలో బేరసారం. ప్రజలు వరదల్లో ఉన్నా, నిరుద్యోగులు రోడ్డెక్కినా, విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రులపాలైనా, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. పదవులు నిలుపుకోవడానికి, కార్పొరేషన్ కమిషన్లకు ఢిల్లీ పోవాల్సిందే’ అంటూ మండిపడ్డారు.

News December 11, 2024

HYD: 5 రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన

image

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.