RangaReddy

News December 11, 2024

HYD: అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష

image

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News December 11, 2024

ఉప్పల్‌లో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్

image

HYDలోని ఉప్పల్‌లో సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ ఇంక్యుబేటర్ కేంద్రాన్ని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ మిథాలీ రాజ్ సందర్శించారు. ఆమె ఈ పర్యటన తమకు ఎంతో ప్రోత్సాహం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు, అసిస్టెంట్లు తెలిపారు. ప్రతి రంగంలో రాణించేందుకు చేయాల్సిన కృషి, పట్టుదల ఆమె మాటలు తెలిపాయన్నారు.

News December 11, 2024

‘గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ఎమ్మెల్యే భేటీ’

image

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మతో చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేకానంద భేటీ అయ్యారు. స్థానిక ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశాలు తదితర విషయాల గురించి చర్చలు జరిపారు. ప్రజల్లో కలుస్తూ, సమస్యలు తీరుస్తూ ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే వివేక్ అన్నారు. గవర్నర్ వర్మతో భేటీ తనకు సంతోషం కలిగించిందన్నారు.

News December 10, 2024

HYD: ఈనెల 14న దొడ్డి కొమురయ్య భవనం ప్రారంభం

image

ఈనెల 14న నార్సింగి పరిధి కోకాపేట్ వద్ద దొడ్డి కొమురయ్య కురమ సంఘ ఆత్మ గౌరవ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు తెలిపారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను డా.బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం భట్టి పాల్గొంటారని తెలిపారు.

News December 10, 2024

HYD: ఇదే నిలువెత్తు సాక్ష్యం: మాజీ మంత్రి

image

మాజీ సీఎం KCR ఎక్కడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించలేదని అంటున్న సీఎం, మంత్రులకు హుస్సేన్‌సాగర తీరాన అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంగణంలోని పసిడి వర్ణపు తెలంగాణ తల్లి విగ్రహమే నిలువెత్తు సాక్ష్యం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ HYDలో 2023 జూన్ 22న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంతో పాటు తెలంగాణ తల్లిని ఆవిష్కరించారన్నారు.

News December 10, 2024

వికారాబాద్: గ్రూప్-2 పరీక్షలకు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 30 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్-2 పరీక్షలకు జిల్లాలో 10,381 మంది హాజరుకానున్నట్లు తెలిపారు.

News December 10, 2024

HYD: రాహుల్, ప్రియాంక గాంధీని కలిసిన సీతక్క

image

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లిన మంత్రి సీతక్క, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ఇటీవల వయనాడ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీకి మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

News December 10, 2024

REWIND: ట్యాంక్‌బండ్‌లో విషాద గాథ తెలుసా?

image

సాగర్‌లో బుద్ధుడి విగ్రహ ప్రతిష్ఠలో పెను విషాదం జరిగింది. 1990 మార్చి 10న విగ్రహాన్ని HYDకు తీసుకొచ్చారు. పెద్ద పడవలో ఎక్కించి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా అది కుదుపునకు గురైంది. విగ్రహం మెల్లిగా నీటిలోకి జారిపోవడంతో పడవలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక విగ్రహాన్ని వెలికితీసే సాహసం చేయలేదు. 1992లో నాటి CM కోట్ల విజయ భాస్కర్‌ రెడ్డి చొరవ చూపి డిసెంబర్‌ 1992లో వెలికి తీసి ప్రతిష్ఠించారు.

News December 10, 2024

HYD: మంచుకురిసే వేళలో జాగ్రత్త!

image

HYD, VKB, RR జిల్లాలలో చలికి తోడు, ORR పరిసరాల్లో పొగ మంచు కమ్మేసింది. ORR, VKB జిల్లాలోని పలు గ్రామాల్లో ఉదయం 8 దాటినా పొగ మంచు తగ్గటం లేదు. వాహనదారులకు ఎదురొచ్చే ఇతర వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధిక పొగ మంచు ఉన్నప్పుడు జాగ్రత్త పడాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.VKB, ORR ప్రాంతాల్లో 16 డిగ్రీలకు తక్కువగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

News December 9, 2024

HYD: సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తాం: బిర్లా గ్రూప్

image

రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నేర నియంత్రణ కోసం సీసీటీవీల నిర్వహణకు నిధులు కేటాయిస్తామని ఆదిత్య బిర్లా గ్రూపు వైస్ ఛైర్మన్ రాజశ్రీ తెలిపారు. రాచకొండ సీపీ సుధీర్ బాబుతో సోమవారం రాజశ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనరేట్ భౌగోళిక పరిస్థితులు, నేర నియంత్రణ విధానాలు, షీ టీమ్స్ పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.