India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 20, 21 తేదీల్లో జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయ వజ్రోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఆహ్వానించారు. శాసనసభ ఆవరణలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన జానయ్య ఆహ్వాన పత్రికను అందించారు. ఉత్సవాలకు హాజరు కావడంపై సీఎం సానుకూలంగా స్పందించారు.
సంచార టీకా ద్విచక్ర వాహనాలను సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ వాహనాలు పల్లెలు, పట్టణాలు, జన సంచార ప్రాంతాలలోకి చేరుకొని పిల్లలు, గర్భిణీలకు నూరు శాతం టీకాలు ఇచ్చేందుకు దోహదపడతాయని చెప్పారు. డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, జిల్లా ఇమ్యు నైజేషన్ అధికారి షీభహయత్, డిప్యూటీ డిఎంహెచ్ఓ రాకేశ్, డీపీఓ అక్రమ్ పాల్గొన్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
ప్రజాపాలన విజయోత్సవాలు నేటితో ముగియనున్నాయి. HYD వేదికగా భారీగా ఏర్పాట్లు చేశారు. సెక్రటేరియట్లో ప్రభుత్వం నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తోంది. ఇదేరోజు దుండిగల్లో BRS కూడా విగ్రహావిష్కరణకు సిద్ధమైంది. దీనికి తోడు సోనియా గాంధీ జన్మదినం. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అభివృద్ధిపై కాంగ్రెస్, వైఫల్యాలు ఎత్తిచూపే ప్రతిపక్షాల ప్రసంగాలతో నేడు HYD దద్దరిల్లనుంది.
గతేడాది అధికారిక కార్యక్రమాలు, రాజకీయ ప్రసంగాలతో బిజీబిజీగా గడిపిన CM రేవంత్ రెడ్డి ఆదివారం కాస్త కూల్గా కనిపించారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా HYDలో నిర్వహించిన IAF AIR SHOWకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్స్ విన్యాసాలను వీక్షించేందుకు సన్గ్లాసెస్ ధరించి మోడ్రన్ లుక్లో కనిపించారు. ‘Tiger Ka Hukum’ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు CM రేవంత్ రెడ్డి ఫొటోను ‘X’లో పోస్ట్ చేశారు.
HYDలో ప్రజా పాలన విజయోత్సవాలు అంబరాన్నంటాయి. ట్యాంక్బండ్ మీద IAF సూర్యకిరణ్ టీమ్ అద్భుతంగా ఎయిర్ షో నిర్వహించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, MLAలు తదితర అధికారులతో పాటు నగరవాసులు ఔరా అనేలా విన్యాసాలు జరిగాయి. సెక్రటేరియట్, ట్యాంక్బండ్, అంబేడ్కర్ విగ్రహం వద్ద AIR Showకు సంబంధించిన పైఫొటో నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. PHOTO OF THE DAYగా నిలిచింది. ఫొటోపై మీ కామెంట్?
PIC CRD:@XpressHyderabad
HYD హుస్సేన్ సాగర్ వద్ద జరిగే ఎయిర్ షోకి వెళ్లే వారికి పోలీసులు సూచనలు చేశారు. PVNR మార్గ్, నెక్లెస్ రోడ్డులో కార్లు, టూ వీలర్ పార్కింగ్, ఆదర్శనగర్ గల్లీలో టూవీలర్, GHMC హెడ్ ఆఫీస్ గల్లీలో కార్లు, టూవీలర్ జనరల్ పబ్లిక్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బోట్ క్లబ్లో మంత్రుల కార్లు, అమరవీరుల స్మారక చిహ్నం వద్ద MLA, MP, MLC, IAS, నేతల వాహనాల పార్కింగ్ ఉంటుందని చెప్పారు.
HYD నగరంలో B1,B2 వీసాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని US కాన్సులేట్ జెన్నిఫర్ తెలిపారు. వీసాలకు సంబంధించిన ఇంటర్వ్యూలో భారతదేశ రికార్డును శనివారం నాడు బ్రేక్ చేసినట్లుగా వెల్లడించారు. కొత్త టెక్నాలజీ వినియోగం, పెరిగిన సిబ్బందితో నిరీక్షణ సమయం చాలా వరకు తగ్గిందని, సేవలను అద్భుతంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇందుకు తమకు సంతోషంగా ఉందని తెలిపారు.
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ వద్ద నేడు IAF ఎయిర్ షో జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ట్యాంక్ బండ్పై భారీ బందోబస్తును మోహరించారు. ఎక్కడికక్కడ బారీ కేడ్లు ఏర్పాటు చేశారు. నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని,వాహనాలను అనుమతించమని తెలిపారు. నెక్లెస్ రోడ్, తెలుగు తల్లి వంతెన,VV స్టాచ్యూ, రవీంద్ర భారతి, కవాడిగూడ జంక్షన్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది.
మోసపూరితపు హామీలిచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జెపి నడ్డా మండిపడ్డారు. HYD సరూర్నగర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మహిళలు, యువత, రైతులు, వెనుకబడిన వారికి అబద్దపు హామీలిచ్చిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య భావాజాలంతో పాటు, ప్రజలకు సేవ చేయడంలోనూ తేడాలు ఉన్నాయన్నారు.
Sorry, no posts matched your criteria.