RangaReddy

News July 6, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

హైదరాబాద్‌ శివారులో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ PS పరిధిలో బైక్‌పై వెళుతున్న దంపతులను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

ఆర్టీసీ బస్సులో డెలివరీ.. బర్త్ సర్టిఫికెట్ ఇచ్చిన GHMC

image

HYD ఆరాంఘర్ 1z నంబర్ బస్‌లో ప్రసవించిన శ్వేతను GHMC అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియాకు సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి బర్త్ సర్టిఫికెట్‌‌‌‌‌ను‌ జారీ చేయించారు. భవిష్యత్తులో జనన ధృవీకరణ పత్రం కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా GHMC అధికారులు చొరవ చూపి‌ స్వయంగా ఆమెకు అందజేయడం విశేషం.

News July 6, 2024

HYD: రేపటి నుంచి బోనాలు.. గుడిలో అధ్వాన పరిస్థితి!

image

ఫిలింనగర్‌లోని బసవతారకనగర్‌ బస్తీలో‌ ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు అమ్మవారి ఆలయ ప్రహరీ కూలిపోయింది. వరదలకు నిర్మాణంలో ఉన్న రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయి. కనీసం మరమ్మతులు కూడా చేయలేదని‌ స్థానికులు వాపోతున్నారు. రేపటి నుంచి నగరంలో బోనాలు మొదలుకానున్నాయి. ఇలా అయితే పండుగ ఎలా జరుపుకోవాలని బస్తీ వాసులు నిలదీస్తున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News July 6, 2024

HYD: మంత్రిని కలిసిన BRS ఎమ్మెల్యేలు

image

గ్రేటర్ HYD, మేడ్చల్ జిల్లా పరిధి BRS ఎమ్మెల్యేలు‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని శనివారం కలిశారు. పలు సమస్యలపై వినతి పత్రం అందించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు‌ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ MLA కేపీ వివేకానంద, ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి, మల్కాజిగిరి MLA రాజశేఖర్ రెడ్డి, కూకట్‌పల్లి MLA కృష్ణారావు, శేరిలింగంపల్లి MLA అరికెపూడి గాంధీ మంత్రి సమావేశం అయ్యారు.

News July 6, 2024

HYD: రాత్రి బస్సులు నడపాలని డిమాండ్

image

నగరంలో రాత్రి సమయంలోనూ ఆర్టీసీ బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. JBS, MGBS, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వందల కొద్ది రూపాయలు ఖర్చు చేసి వెళ్లాల్సి వస్తోంది. దీంతో సికింద్రాబాద్ నుంచి బోరబండ, కొండాపూర్, కోఠి, ఉప్పల్, కూకట్‌పల్లి ప్రాంతాలకు నైట్ RTC సర్వీసులు నడపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.

News July 6, 2024

HYD: ఆర్టీసీ బస్సులో పుట్టిన పాపకు బర్త్ సర్టిఫికెట్

image

ఆరాంఘర్ 1z నంబర్ బస్‌లో ప్రసవించిన మహిళ శ్వేతను ఆర్టీసీ అధికారులు శనివారం కలిశారు. డెలివరీ అయిన ఏరియా సంబంధిత అధికారులతో మాట్లాడారు బర్త్ సర్టిఫికేట్‌ను జారీ చేసి ఆమెకు అందజేశారు. కాగా, పురిటి నొప్పులతో బస్సులో బాధపడుతున్న మహిళకు మహిళా కండక్టర్, ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది.

News July 6, 2024

HYD: న్యాయ పట్టభద్రులకు నేడే లాస్ట్ ఛాన్స్..!

image

HYD జిల్లాలోని షెడ్యూల్ కులాలకు చెందిన న్యాయ పట్టభద్రులకు మూడేళ్లపాటు ఉచిత నైపుణ్య శిక్షణ అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ యాదయ్య తెలిపారు. శిక్షణ పొందేవారికి నెలకు రూ.3 వేల స్టైఫండ్, రూ.50 వేల డిజిటల్ బుక్స్, ఫర్నిచర్, కంప్యూటర్, డ్రెస్ ఇస్తామని తెలిపారు. దరఖాస్తుకు నేడే లాస్ట్ కాగా.. ఈ వెబ్ సైట్ https://tsepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 6, 2024

HYD: విస్తరిస్తోన్న డెంగ్యూ వ్యాధి.. జర జాగ్రత్త..!

image

HYD, RR, MDCL జిల్లాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైద్యారోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు HYDలో 114, మేడ్చల్‌లో 108, రంగారెడ్డిలో 51 కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా బాధితుల సంఖ్య రెట్టింపు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. HYDలో మే నెలలో 39, జూన్‌లో 56, జులైలో కేవలం 4 రోజుల్లోనే 19 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు.  

News July 6, 2024

HYD: నురగలు కక్కి చనిపోయాడు..!

image

కడుపు నొప్పితో ఓ లారీ డ్రైవర్ మృతిచెందిన ఘటన HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శ్రీకాకుళం ఇచ్ఛాపురం వాసి ఢిల్లీ రావు(38) నేపాల్ నుంచి చీపురు కట్టల లోడుతో జవహర్‌నగర్‌కు చేరుకున్నాడు. లోడ్ దించిన అనంతరం డ్రైవర్‌ను లేపుదామని క్లీనర్ వెళ్లగా నురగలు కక్కి మృతిచెందాడు. అయితే అంతకుముందు అతడు 2 మాత్రలు వేసుకుని, ENO తాగాడని స్థానికులు తెలిపారు. కేసు నమోదైంది.  

News July 6, 2024

HYD: కొరియర్‌లో మత్తు పదార్థాలంటూ రూ.12 లక్షలు స్వాహా

image

కొరియర్‌లో మత్తు పదార్థాలంటూ సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలు స్వాహా చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఫెడెక్స్ కొరియర్ నుంచి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మీకు వచ్చిన పార్సిల్‌లో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు. తర్వాత స్కైప్ కాల్ ద్వారా ముంబై పోలీసుల వేషంలో సైబర్ నేరగాళ్లు కనిపించారు. దీంతో భయపడ్డ బాధితుడు వారికి రూ.12 లక్షలు పంపి మోసపోవడంతో PSలో ఫిర్యాదు చేశాడు.