India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమను, తమ కార్యకర్తలను ఎంత వేధించినా సరే తాము కాంగ్రెస్లో చేరబోమని, BRSలోనే ఉంటామని మహేశ్వరం MLA సబితాఇంద్రారెడ్డి కుమారుడు, ఆ పార్టీ రాష్ట్ర నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. ‘మా అమ్మ కాంగ్రెస్లో చేరదు.. గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీ మారాం.. ఇక BRSలోనే కొనసాగుతాం.. పార్టీ ఫిరాయింపులు వద్దని రాహుల్ గాంధీ చెబుతుంటే.. రేవంత్ వినడంలేదు’ అని అన్నారు.
HYD హైటెక్స్ ప్రాంగణంలో 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ ఎక్స్పోకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. రోల్ ఆఫ్ ఇండియన్ ఫార్మా ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ నేపథ్యంతో 3 రోజుల పాటు సదస్సు జరగనుండగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా శాస్త్రవేత్తలు, ఫార్మసిస్టులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. HYDలో బిర్యానీయే కాదు.. ఫార్మా కూడా ఫేమస్ అని మంత్రులు అన్నారు.
HYD గోల్కొండ బోనాలను పురస్కరించుకొని జలమండలి తాగునీటి కోసం ఏర్పాట్లు చేసింది. కోట ప్రారంభంలోని మెట్ల దగ్గరి నుంచి బోనాలు జరిగే ప్రాంతం వరకు తాగునీటి పాయింట్లను ఏర్పాటు చేసింది. డ్రమ్ములు, ట్యాంకులు, పంపులు అందుబాటులోకి తెచ్చింది. వంటలు చేసే ప్రాంతంలో స్టాండ్లను కూడా సిద్ధం చేసింది. పైపులైన్ ద్వారా తాగునీరు అందించేందుకు ట్రయల్ రన్ను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
అత్యాచార బాధితురాలైన ఓ బాలిక అవాంఛనీయ గర్భం తొలగింపునకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ బోర్డు నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఆ బాలిక, తల్లి అనుమతి తీసుకుని గర్భం తొలగించాలంటూ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఆదేశాలు జారీ చేసింది. నగరానికి చెందిన ఓ బాలికపై 10 మంది కామాంధులు 6 నెలల పాటు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటనపై గతంలో పోలీసు కేసు నమోదైంది.
ఈనెల 7వ తేదీ నుంచి మొదలు కానున్న ఆషాఢ మాసం బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గోల్కొండ కోటలోని ఎల్లమ్మ (జగదాంబిక) ఆలయాన్ని కలెక్టర్ సీపీతో కలిసి సందర్శించారు. రేపు కోటలో తొలి పూజ ప్రారంభమవుతున్నందున ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.
గ్రేటర్ HYDలో GHMC ఫుడ్ సేఫ్టీ బృందం శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లోని రోడ్ సైడ్ షాపుల్లో టీ పొడిలో క్యాన్సర్కు కారణమయ్యే కలర్లు వాడుతున్నట్లు దాడుల్లో బయటపడిందన్నారు.స్ట్రీట్ ఫుడ్లో వాడే మసాలాలు, సాస్లు అన్నింటిలో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్లు తేలిందని, FSSAIమొబైల్ ల్యాబ్ ద్వారా అక్కడికక్కడే నిర్ధారించామన్నారు.
తెలంగాణలో BRS పని అయిపోయిందని BJP నేత చికోటి ప్రవీణ్ ఎద్దేవా చేశారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మం, గోమాతపై దాడి చేస్తే ఏ పార్టీకైనా ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇలా చేసిన పార్టీకి, నాయకులకు క్షణికానందం ఉంటుందేమో కానీ తర్వాత జీరో అవ్వడం ఖాయమన్నారు. BRS ఔటైందని, ఆఖరికి MIMలో విలీనమయ్యే దుస్థితి ఆ పార్టీకి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో రానున్నది BJPనే అని అన్నారు. దీనిపై మీ కామెంట్?
ఈనెల 7న ప్రారంభం కానున్న గోల్కొండ కోట జగదాంబికా మహంకాళి బోనాలకు తొలి రోజున రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ రానున్నారని భాగ్యనగర్ బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ భగవంత్ రావు తెలిపారు. బోనాల ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
వీధి దీపాల నిర్వహణలో అశ్రద్ధ వహించవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. ఖైరతాబాద్లోని తన ఛాంబర్లో ఈఈఎస్ఎల్ ప్రతినిధులు, అడిషనల్ కమిషనర్లతో వీధి దీపాల నిర్వహణపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాత్రి సమయంలో వీధి దీపాలు వెలగకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని, వెంటనే స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సిటీలో డార్క్ స్పాట్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
నగరాభివృద్ధి, నిర్వహణ పనులు, ప్రజా సమస్యలపై శనివారం హైదరాబాద్ నగర పాలక సంస్థ(GHMC) పాలకమండలి ఖైరతాబాద్లోని బల్దియా హెడ్ ఆఫీస్లో సమావేశం కానుంది. అందుకు సంబంధించి సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై BRS, కాంగ్రెస్ నేతలు శుక్రవారం పోటాపోటీ సమావేశాలు నిర్వహించారు. BRS కార్పొరేటర్లతో మాజీ మంత్రి తలసాని, ఇతరులు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాల డిమాండ్కు వారు తీర్మానించారు.
Sorry, no posts matched your criteria.