RangaReddy

News July 5, 2024

HYD: బస్సులో మహిళ ప్రసవం.. అభినందించిన ఎండీ సజ్జనార్

image

ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులో శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. డ్రైవర్, కండక్టర్ సరోజతో పాటు మహిళా ప్రయాణికులను అభినందించారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవాస్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండడం అభినందనీయమన్నారు.

News July 5, 2024

WOW.. HYD నగరంలో హెరిటేజ్ అందాలు!

image

HYD నగరం హెరిటేజ్ అందాలకు మారుపేరుగా నిలుస్తుంది. దేశ, విదేశాల నుంచి HYD నగరానికి తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కోకాపేటలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపుగా 120 మీటర్ల ఎత్తులో ఈ హెరిటేజ్ టవర్ ఉండటం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు.

News July 5, 2024

HYD: 8వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

image

MBBS పూర్తి చేసిన మహిళ మతిస్థిమితం కోల్పోయి అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ASరావు నగర్‌కు చెందిన నిహారిక రావు(29)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంతకాలంగా మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండటం లేదు. దీంతో రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకడంతో కారుపై పడి మృతి చెందింది. కేసు నమోదైంది.

News July 5, 2024

HWO పరీక్షకు 56.92 శాతం మంది హాజరు

image

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ (HWO) పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు TGPSC అధికారులు పేర్కొన్నారు. పేపర్-1కు 56.94% మంది, పేపర్-2కు 56.04% మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే రెస్పాన్స్ షీట్స్ విడుదల చేస్తామన్నారు. పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

News July 5, 2024

HYD: జూలై 7 నుంచి MMTS సేవల పునరుద్ధరణ!

image

HYD నగరంలో జులై 6 వరకు పలు MMTS రైళ్ల సేవలు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. జులై 7 నుంచి సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. మేడ్చల్ లింగంపల్లి (47222), లింగంపల్లి మేడ్చల్(47225), మేడ్చల్ సికింద్రాబాద్(47235), సికింద్రాబాద్ మేడ్చల్ (47236), మేడ్చల్ సికింద్రాబాద్ (47237) సేవలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 5, 2024

HYD: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ వెంకట్ రామిరెడ్డి వివరాల ప్రకారం.. అత్తాపూర్ PS పరిధిలో నివసించే ఓ బాలిక ఇంటి సమీపంలో ఉండే యువకుడు కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. మాయమాటలతో బాలికను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు గురువారం అత్తాపూర్ PSలో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదైంది.

News July 5, 2024

గ్రేటర్ HYDలో ఆస్తి పన్ను పరిస్థితిపై FOCUS!

image

గ్రేటర్ HYD ఆస్తిపన్ను పరిధిలో భవనాలు 17 లక్షలకు పైగా ఉన్నాయి. ఏటా దాదాపు 20 వేల వరకు కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆ మేరకు ఆస్తిపన్ను రావడం లేదు. ఏటా రూ.1900 కోట్ల మేర ఆదాయం కష్టంగా రాబడుతున్నారు. వాస్తవానికి రూ.2500 కోట్ల మేర రావాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పలు సమస్యలు తీర్చి, ఆస్తి పన్నును పకడ్బందీగా వసూలు చేసే విధానం పై కసరత్తు చేస్తున్నారు.

News July 5, 2024

HYD: ఆరో తరగతి బాలికకు వివాహం.. కేసు నమోదు

image

6వ తరగతి చదివే బాలికకు వివాహం జరిగిన ఘటన VKBD జిల్లా గండీడ్ మండలంలో జరిగింది. SI శేఖర్ రెడ్డి ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన యువకుడు బీరప్ప.. 6వ తరగతి చదివే అదే గ్రామానికి చెందిన బాలికను గత నెలలో వివాహం చేసుకున్నాడు. గుర్తించిన ఉపాధ్యాయులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో విచారణ చేపట్టి యువకుడితో పాటు సహకరించిన కుటుంబీకులపై చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

News July 5, 2024

ఎప్పటికప్పుడు చెత్తలేకుండా శుభ్రం చేయాలి: అమ్రపాలి

image

జీహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలి కూకట్పల్లి, మూసాపేట్ భరత్నగర్, రైతుబజార్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వీధుల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ఎప్పటికప్పుడు చెత్తలేకుండా శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్(జివిపి)ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

News July 5, 2024

మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్

image

మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. దూలపల్లిలోని మల్లారెడ్డి వర్సిటీ.. బాలానగర్‌లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సెలెన్స్‌ ఫర్‌ కామర్స్‌ అండ్‌ డిజైన్‌ పేరుతో ఆఫ్ క్యాంపస్‌ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. వర్సిటీతో పాటు.. ఆఫ్‌ క్యాంపస్‌ కేంద్రంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.