India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం ముంజలకుంటతండాకి చెందిన రమావత్ వెంకన్న కొత్త ఇంటికి అవసరం నిమిత్తం శనివారం మోటార్ను బిగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకన్న భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకన్న కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం MGMకు తరలించారు.
వరంగల్ నగరంలోని కరీమాబాద్ SRR తోట ప్రాంతంలో ఉన్న వాణి విద్యానికేతన్ స్కూల్పై వివిధ విద్యార్థి సంఘాలు వినతి పత్రం సమర్పించడంతో డీఈవో వాసంతి స్పందించారు. శనివారం ఆర్జేడీకి ప్రొసీడింగ్ లేఖ పంపించారు. ఒక పర్మిషన్ మీద రెండు బ్రాంచీలు నడిపిస్తున్న వాణి విద్యానికేతన్ పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఆర్జేడీకి పంపించారు. ఈ మేరకు AIFDS వామపక్ష విద్యార్థి సంఘాలు డీఈఓకు కృతజ్ఞతలు తెలిపాయి.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు.
> MHBD ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా సుజాత
> > జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు
> > సీఎం రేవంత్ను కలిసిన పాలకుర్తి MLA
> > HNK: బాలికపై లైంగికదాడికి యత్నం.. సీఐ సస్పెండ్
> > గాంధీభవన్ వద్ద దేవరుప్పుల కాంగ్రెస్ నాయకుల నిరసన
> దుగ్గొండి: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
> > ములుగు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి సీతక్క
> ములుగు: వదంతులు సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. మైసంపల్లి గ్రామానికి చెందిన వెంగళ సుప్రియ శనివారం సాయంత్రం ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉంది. ఇంట్లో ఉన్న బీరువా పగలగొట్టి ఉన్నట్లు, మృతురాలి మెడలోని బంగారం కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. సుప్రియ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సుప్రియకు భర్త కిరణ్, ఇద్దరు పిల్లలున్నారు.
మహబూబాబాద్ DRDOగా పని చేస్తున్న పురుషోత్తంపై సస్పెన్షన్ వేటు పడింది. భూపాలపల్లిలో డీఆర్డీఏ పీడీగా కొనసాగిన సమయంలో రికార్డులను అందజేయకపోవడంపై సమగ్రమైన విచారణ అనంతరం పురుషోత్తం సస్పెండ్ అయ్యారు. డీఆర్డీవోను బాధ్యతల నుంచి తప్పించాలని పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు.
మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్గా దామల్ల సుజాతను నియమించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటి వరకు ఇక్కడ సబ్ రిజిస్ట్రార్గా పని చేసిన తస్లీమా మహ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్గా సుజాత విధుల్లోకి రానున్నారు.
బాలికపై లైంగిక దాడికి యత్నించి పోక్సో కేసులో అరెస్టయిన భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ బండారి సంపత్ కుమార్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రత కల్పించాల్సిన పోలీస్ అధికారి బాలికపై అత్యాచారానికి యత్నించినందుకు సంపత్పై శాఖపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశామని ఆయన వెల్లడించారు.
వరంగల్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే ఇక్కడ మాజీ MLA ఆరూరి రమేశ్ను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురుచూసున్నారు. మీ కామెంట్?
BRS పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఆరూరి రమేష్ రాజీనామాతో ఈ పదవి ఖాళీ అవ్వగా.. ఈ పదవిని ఎవరికి ఇస్తారో అని సందిగ్ధం నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కార్యకర్తలు, సీనియర్ లీడర్లు చాలామంది పార్టీ ఫిరాయించడంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్, పరకాల మాజీ MLA చల్లా ధర్మారెడ్డిలలో ఎవరో ఒకరికి ఈ పదవి రానున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.