India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తొమ్మిది నెలలు శిక్షణను పూర్తిచేసుకుని విధులు నిర్వహించేందుకు సిద్ధమైన 578 మంది కానిస్టేబుళ్లతో సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే అవకాశం పోలీసులకు మాత్రమే ఉంటుందన్నారు. ప్రజల మన్ననలు పొందేవిధంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త ఛైర్మన్గా జనగామ మండలం ఓబుల్ కేశ్వపూర్ గ్రామానికి చెందిన బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. డిసెంబర్ 3న ప్రస్తుత ఛైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ మేరకు వెంకటేశంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. పోలీసుల వివరాలు.. పర్వతగిరి మం. అన్నారం షరీఫ్లోని ఓ హోటల్లో గోరుకాటి చేరాలు(50) పని చేస్తున్నాడు. పెద్దతండాకు చెందిన ఓ వ్యక్తి తాగిన మైకంలో చేరాలును శనివారం తెల్లవారుజామున ఆటోలో తీసుకెళ్లాడు. విపరీతంగా కొట్టి అన్నారం కెనరా బ్యాంక్ ఎదురుగా పడేశాడు. ఉదయాన్నే అటుగా వెళ్లే అయ్యప్ప భక్తులు గాయాలతో ఉన్న చేరాలును గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు.

మాజీ మంత్రి, సిరిసిల్ల MLA KTR తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నవంబర్ 29న అరెస్ట్ అయ్యా. నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమే నిత్యం కృషి చేస్తాను’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.

వరంగల్ నగరంలోని ఎంజీఎంం హాస్పిటల్ను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోగుల సౌకర్యార్థం చేపడుతున్న పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె రోగులతో స్వయంగా మాట్లాడి అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజా పాలన విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. నేడు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పాలన విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తున్న దృష్ట్యా డిసెంబర్ 3న మునిసిపాలిటీల్లో అర్బన్ డే వేడుకలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు.

శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం నేర సమీక్ష నిర్వహించారు. సూదీర్ఘకాలంగా పెండిరగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు.

రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్కు వరంగల్ జిల్లా నుంచి 28 ప్రాజెక్టులను ఎంపిక చేశారు. నర్సంపేటలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో ఇన్స్పైర్ కేటగిరిలో 148, రాష్ట్రీయ బాల సైన్స్ కేటగిరిలో 352 ఎగ్జిబిట్లు వచ్చాయి. ఈ రెండు కేటగిరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 28 ప్రాజెక్టులను జడ్జీలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. త్వరలో జరిగే స్టేట్ లెవల్ పోటీల్లో వాటిని ప్రదర్శించనున్నారు.

కరెంట్ షాక్తో కావ్య(16) అనే <<14732971>>బాలిక మృతి<<>> చెందిన ఘటన చేర్యాలలో జరిగిన విషయం తెలిసిందే. నాగపురి గ్రామానికి చెందిన మజ్జిగ నర్సింలు-లావణ్య దంపతుల పెద్ద కూతురు కావ్య ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. నీళ్లు ట్యాంకులోకి పట్టేందుకు మోటార్ వైరును స్విచ్ బోర్డులో పెడుతుండగా కరెంటు షాక్కు గురైంది.హాస్పిటల్కి తరలించగా అప్పటికే చనిపోయింది. బాలికకు పుట్టినరోజే నూరేళ్లు నిండాయని తల్లిదండ్రులు విలపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కాకతీయ మెడికల్ కాలేజి ఎన్ఆర్ఐ మిలినియం ఆడిటోరియంలో సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్నారు. విజయోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డీపీఆర్వో ఆయుబ్ అలీతో కలిసి జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.